Saturday 13 September 2014

పుదీనాతో మచ్చలు మాయం

                         ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో పుదీనా ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. దోమలు కుట్టడం వల్ల, ఇతర కారణాల వల్ల ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను పుదీనా ఆకుల రసం దూరం చేస్తుంది. పుదీనా నూనెతో (మింట్‌ ఆయిల్‌) తలకు మసాజ్‌ చేస్తే చుండ్రు వంటి సమస్యలు దూరమవుతాయి. మహిళలు మొటిమల కారణంగా కలిగే నల్ల మచ్చలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. పుదీనా ఇటువంటి మచ్చలను ను తగ్గిస్తుంది. పుదీనా రసంలో ఓట్స్‌ పౌడర్‌ను మిక్స్‌ చేసి చర్మానికి రాసు కుంటే నల్లమచ్చలను తొలగించడమే కాక, డెడ్‌ స్కిన్‌ను కూడా తొలగి స్తుంది. మచ్చలు తొలగించడంలోనూ, పాదాల పగుళ్లను నివారించడంలోనూ పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరి గించి ఆ నీటిలో పాదాలను కొద్ది సమయం నాన బెట్టాలి. వారానికి రెండు, మూడు సార్లు చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.

Courtesy  with: PRAJA SEKTHY DAILY

No comments:

Post a Comment