Saturday 31 March 2012

పుస్తక పఠనం... ప్రగతికి సోపానం...


చిన్నారులూ..!
చదువు వేరు.. పుస్తక పఠ నం వేరు.. చదువు పఠనా నికి సాధనం. పుస్తక పఠ నం విజ్ఞానాన్ని పెంచి, ప్రగ తికి సోపానమవుతుంది. పుస్తకాలు చదవడమనేది మంచి అలవాటు. అది చిన్నతనంలోనే అబ్బాలి. మరి రేపు 'అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం' సందర్భంగా పుస్తక పఠనం ప్రారంభించేద్దామా?!
కొన్ని అలవాట్లు చిన్నప్పుడే అలవడాలి. 'మొక్కై వంగనిది మానై వంగునా..!' అనే సామెత వినే ఉంటారు. బాల్యంలోనే పుస్తక పఠనం అలవాటైతే అది ఎప్పటికీ వాడిపోదు సరికదా! మిమ్మల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది.
పుస్తక పఠనంతో అపరిమిత విజ్ఞానం మీ సొంతమవుతుంది. కొత్త విషయాలు తెలుసు కోవాలన్న ఆసక్తి కలుగుతుంది. మీలోని ఊహాశక్తి అధికమవుతుంది.
ఇన్ని లాభాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి అంటారు పెద్దలు. ఇంత మంచి అలవాటు మీరంతా చేసుకోవాలనే ఈ నెల 2వ తేదీన 'అంతర్జాతీయ బాలల పుస్తక మహోత్సవం' నిర్వహిస్తున్నారర్రా!
పాశ్చాత్య ప్రపంచంలో సంచలనం సృష్టించిన 19వ శతాబ్ధపు రచయిత 'హాన్స్‌ క్రిస్టియన్‌ ఏండా ర్సన్‌'. ఈయన బాలసాహిత్యంలో దిట్ట. హాలెండ్‌కు చెందిన ఈయన రచనలంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడేవారంట! అందుకే ఈయన రచనల్ని అన్ని భాషల్లోకి అనువదించారర్రా! మీకు ఆయన రచనలు దొరికితే తప్పక చదవండే!
ఆయన పుట్టినరోజైన 'ఏప్రిల్‌ 2'ను 'అంతర్జా తీయ బాలల పుస్తక దినోత్సవం'గా జరపాలని 1967లో నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని పురస్క రించుకుని మీలాంటి పిల్లల్లో సాహిత్యాభిలాష పెంచాలన్నదే ఉద్దేశం. మీరంతా మంచిపిల్లలు కదా! మరి ఎంచక్కా ఎండాకాలం సెలవుల్లో బోలెడన్ని కథల పుస్తకాలు చదవండే..!

No comments:

Post a Comment