Friday 24 April 2015

అంతరిక్షంలో ఇస్రో అద్భుతం....


చంద్రయాన్‌-1 విజయంతో భారత్‌ 2017లో చంద్రయాన్‌-2ను ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్‌ కోసం ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లను ఇస్రోనే సొంతంగా తయారుచేస్తోంది. అమెరికన్‌ ఆసో్ట్రనాట్స్‌, రష్యన్‌ కాస్మోనాట్స్‌, చైనీస్‌ టైకోనాట్స్‌లా మన భారతీయ వ్యోమగాముల్ని ‘వ్యోమనాట్స్‌’ అని పిలుస్తారట!. 2020 తర్వాత వ్యోమనాట్స్‌ కక్ష్యలో పర్యటించనున్నారు.
న్నత స్థాయి అంతరిక్ష పరిజ్ఞానాన్ని అంచెలంచెలుగా పెంపొందించుకుంటూ అంతరిక్ష శక్తుల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. ‘ఇండియన్‌ రీజియనల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం’ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) అనే వ్యవస్థను భారత్‌ సొంతంగా ఏర్పాటు చేసుకుంటోంది. అందుకు మొత్తం 29 ప్రయోగాల్లో తొలి ఒక్కటి తప్ప వైఫల్యమే ఎరుగని ఇస్రో రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ మార్చిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1డి ఉపగ్రహాన్ని దిగ్విజయంగా కక్ష్యకు చేర్చి వినువీధిలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుది. పీఎస్‌ఎల్‌వీ ద్వారా యూకేకు చెందిన డీఎంసీ ఇమేజింగ్‌ ఇంటర్నేషనల్‌ (డీఎంసీఐఐ)కు చెందిన మూడు ఉపగ్రహాలను ఎప్పుడు ప్రయోగించేది శుక్రవారం ఇస్రో ప్రకటించనుంది.
జీపీఎస్‌ (అమెరికా), గ్లోనాస్‌ (రష్యా), గెలీలియో (యూరప్‌), బైద (చైనా) మాదిరిగానే భారత్‌ కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అనే ఉప్రగ్రహ ఆధారిత గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ సేవల్ని సొంతంగా సమకూర్చుకుంటోంది. ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఇది నాలుగోది. త్వరలో ప్రయోగించే మరో మూడు ఉపగ్రహాలతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. తాజా ప్రయోగంతో ఇస్రో ఖ్యాతి ఇనుమడించింది. స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు మళ్లించే లక్ష్యంతో భారత్‌లో 1972లో అంతరిక్ష విభాగం ఏర్పాటైంది. 1983లో భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్ఠ (ఇన్‌శాట్‌)ను నెలకొల్పారు. ఇందులో భాగంగా టెలికమ్యూనికేషన్లు, టీవీ ప్రసారాలు, టెలి-మెడిసిన్‌, టెలి-ఎడ్యుకేషన్‌, వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ కోసం ఇస్రో ఇప్పటిదాకా 30 సమాచార ఉపగ్రహాలను రోదసికి పంపింది. తర్వాత 1988లో భారత రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎస్‌) ఆవిర్భవించింది. ఖనిజ వనరులు, జల వనరులు, మత్స్యసంపద, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అంశాలపై సమాచార సేకరణ గ్రామీణాభివృద్ధి - పట్టణ ప్రణాళికల రూపకల్పన, వ్యవసాయోత్పత్తుల అంచనాల తయారీ, ప్రకృతి విపత్తులపై అధ్యయనం కోసం ఇస్రో దాదాపు పాతి రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలను పంపింది. వీటిలో 2 రోసోర్స్‌ శాట్స్‌, 4-కార్టో శాట్స్‌, 2 రైశాట్స్‌, ఓషనశాట్‌, మేఘాట్రోపిక్స్‌, సరళతో కలిపి ప్రస్తుతం 11 ఉపగ్రహాలు సేవలందిస్తున్నాయి. ఇవే కాకుండా భారత్‌ 40 దాకా విదేశీ ఉపగ్రహాల్ని సైతం కక్ష్యకు చేర్చి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించింది.
2011-15 మధ్యకాలంలో 15 విదేశీఉపగ్రహ ప్రయోగాల ద్వారా 40 మిలియన్ల యూరోలు (రూ.270 కోట్లు) సంపాదించింది. ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో అనూహ్య మలుపులు, ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠతో అంతరిక్షంలో సాగే ఇతివృత్తంగా ‘గ్రావిటీ’ అనే హాలివుడ్‌ సినిమా ఖర్చు కంటే చౌకగా ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ (మామ్‌) ప్రయోగాన్ని భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. భూమికి గరిష్ఠంగా 40 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహానికి కేవలం రూ. 450 కోట్లు ఖర్చుతో మామ్‌ లేదా మంగళయాన్‌ ప్రయోగించి భారత్‌ చరిత్ర సృష్టించింది. మామ్‌ ప్రాజెక్టుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మన త్రివర్ణపతాకాన్ని అంతరిక్షంలో సమున్నతంగా నిలిపింది. దాంతో అరుణ గ్రహాన్ని అందుకున్న దేశాలు/సంస్థల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచి యావత్ప్రంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఇవాళ ఇన్నేసి స్పూర్తిదాయక విజయాలు సాధిస్తున్నా మొదట్లో ఇస్రో పయనం కష్టాలు, సవాళ్ల ముళ్లబాటలోనే సాగింది. తొలినాళ్ళలో 1980లలో సోవియట్‌ ‘వోస్తాక్‌’ లాంచర్లపై ఆధారపడిన ఇస్రో, అనంతరం సొంతంగా శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వీ), ఆగ్‌మెంటెడ్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఏఎస్‌ఎల్‌వీ), పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) వంటి రాకెట్లను దశలవారీగా రూపొందించింది. కానీ భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే భూ స్థిర కక్ష్యను అందుకోవాల్సిన భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల విషయంలో మాత్రం పరాధీనత తప్పలేదు. భారత్‌ ఈ ప్రయోగాల కోసం యూరోపియన్‌ ‘ఏరియన్‌’ రాకెట్లపై ఆధారపడవలసి వస్తోంది. పీఎస్‌ఎల్‌వీ కంటే మెరుగైన జియోసింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ)ని ఇస్రో తయారు చేసుకోవాల్సి వచ్చింది. అందుకు క్రయోజెనిక్‌ ఇంజన్లతో కూడిన రాకెట్లను తయారు చేయవలసి ఉంటుంది. క్రయోజెనిక్‌ పరిజ్ఞానం అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనాల సొత్తు. 1991లో ఇస్రో, సోవియట్‌ అంతరిక్ష సంస్థ గ్లవ్‌కాస్మోస్‌ మధ్య ఆ పరిజ్ఞానం మార్పిడిపై ఒప్పందం కుదిరినా, అమెరికా మోకాలడ్డింది. రష్యాపై ఒత్తిడి పెరగడంతో క్రయోజెనిక్‌ పరిజ్ఞానం మనకు అందకుండా పోయింది. కేవలం క్రయోజెనిక్‌ రాకెట్లను మాత్రమే రష్యా మనకు అందించింది. 20 ఏళ్ళ పాటు నిర్విరామ కృషితో సొంత క్రయోజెనిక్‌ ఇంజిన్‌ అమర్చి జీఎస్‌ఎల్‌వీ-డీ 5 రాకెట్‌ నిరుడు జీశాట్‌-14 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం గల దేశాల్లో భారత్‌ ఆరవ స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో మానవసహిత రోదసీయాత్రల కోసం ‘జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3’ రాకెట్లను ఇస్రో రూపొందించింది. చంద్రయాన్‌-1 విజయంతో భారత్‌ 2017లో చంద్రయాన్‌-2ను ప్రయోగం చేపట్టనుంది. దీనికోసం ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లను ఇస్రోనే సొంతంగా తయారుచేస్తోంది. అమెరికన్‌ ఆసో్ట్రనాట్స్‌, రష్యన్‌ కాస్మోనాట్స్‌, చైనీస్‌ టైకోనాట్స్‌లా మన భారతీయ వ్యోమగాముల్ని ‘వ్యోమనాట్స్‌’ అని పిలుస్తారట!. 2020 తర్వాత వ్యోమనాట్స్‌ కక్ష్యలో పర్యటించనున్నారు. ఇద్దరేసి వ్యోమగాముల్ని రోదసికి తీసుకెళ్లి వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు వీలుగా రష్యన్‌ సోయజ్‌ కేప్యూల్‌ను రీ డిజైన్‌ చేసి సొంత క్రూ మాడ్యూల్‌ను తీర్చిదిద్దనున్నారు. భావి వ్యోగాముల కోసం బెంగళూరులో శిక్షణా సంస్థ ఏర్పాటు, శ్రీహరికోటలో మూడోల్యాంచ్‌ప్యాడ్‌ నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. గ‘ఘన’తలాన మువ్వన్నెల పతాక రెపరెపలాడాలి.
జమ్ముల శ్రీకాంత్‌
ఫ్రీలాన్సర్‌
Courtesy with:  Andhra Jyothi 

Tuesday 7 April 2015

జీవం అంటే ఏమిటి?
Posted on: Tue 07 Apr 20:06:43.924176 2015
     గతవారం డార్వినిజంపై దాడి గురించి చెప్పుకున్నాం. ఈ వారం జీవం అంటే ఏమిటో తెలుసుకుందాం.
Third International Conference on Science and Scientists -2015  నినాదమైన “The Scientist is able for explain Science but is Science able to explain Scientist?” ''శాస్త్రవేత్త శాస్త్రాన్ని వివరించగలుగుతున్నారు కానీ, శాస్త్రం శాస్త్రజ్ఞుణ్ణి వివరించగలుగుతుందా?'' అన్న ప్రశ్నకు మరికొంత సమాధానాన్ని ఇక్కడ ఇస్తున్నాను.
                  ఇక్కడ నిర్వాహకుల వెనుక ఉన్న ఛాందసవాద భావజాలం, దోపిడీవర్గాలకు వత్తాసునిచ్చే విధంగా తికమకలోకి సైన్సును నెట్టే కుహనా తాత్వికత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సైన్సును సైంటిస్టు నుండి వేరుచేసి, రెండు వేర్వేరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వస్తువులు (వఅ్‌ఱ్‌ఱవర) గా చూపుతున్నారు. సైన్సు ఎపుడూ సైంటిస్టుని వదిలి ఉండదు. భౌతికవాద సూత్రాల ప్రకారం, చారిత్రక భౌతికవాదం ప్రకారం ప్రతి మనిషి సైంటిస్టే. తరతమ భేదాల్లో ప్రకృతి వాస్తవికతా ఆవిష్కరణల్లో పాలుపంచుకోవడం ఉంటుందిగానీ ప్రజలందరూ శాస్త్రవేత్తలే.
                  ప్రజల్ని విడిచి శాస్త్రం ఉండదు. శాస్త్రం అంటే ఓ సూర్యుడో, చందమామో, ఫసిఫిక్‌ మహాసముద్రమో కాదు. సైన్సు అంటే మానవజాతి సమస్తం తమ బతుకుదెరువు కోసం, ప్రకృతిపై పట్టు సాధించడం కోసం, ప్రకృతి రహస్యాల్ని ఛేదించి, ఆ రహస్యాల ఆధారంగా సాంకేతికతను సాధించడమే. అందుకే మానవజాతికే సైన్సు ఉందిగానీ పురుగుల గుంపునకు, తేనెటీగల తుట్టెలకు, పూల తోటలకు, గొర్రెల మందకు సైన్సు ఉండదు. నిర్దిష్టమైన సంఖ్యల్ని, నియమాల్ని ఇతర జంతువులు, జీవజాతులు తమ తదుపరి తరాలకు గ్రంథ రూపేణా, చెరిగిపోని సంకేతాల రూపేణా దాఖలు చేయవు. వాటికి ఆ వరవడి, సంప్రదాయాలు లేవు.
సైంటిస్టు సైన్సును కేవలం వివరించడు. సైంటిస్టు సైన్సును ఆవిష్కరిస్తాడు. సేకరించుకొంటాడు. ఆ సైన్సులో తాను అంతర్లీనమవుతాడు. తన శరీర అవయవ నిర్మాణం గురించి, ఆలోచనలకు కారణమైన నాడీతంత్రుల గురించి, మెదడు నిర్మాణం గురించి ఆరా తీస్తాడు. సైన్సు, సైంటిస్టు ఒకే నాణేనికి ఇరు పార్శ్వాల కింద అర్థంచేసుకోవాలి. ఆ సదస్సు నిర్వాహకులకు ఒక్కటే ఇష్టం. సైన్సు ఛాందసభావాల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి, దాన్ని తక్కువ చేసి చూపాలి. మానవుడు అనే వస్తువులోని జీవానికి సైన్సు కారణం చెప్పదనడం వారి వాదన. మనిషి, తదితర జీవులు సృష్టించబడ్డాయని తీర్మానించడం వారి పరమావధి. జీవం అంటే మరణం లేకపోవడమన్న కనీస సత్యాన్ని వారు విస్మరిస్తారు. మరణానికి కారణమైనవేమిటో సైన్సు వివరిస్తోంది.
నీటిలో పడి ఊపిరి ఆగిపోతే మనిషి మరణిస్తాడు. ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడం వల్ల కణాలకు సరిపడినంత శక్తి కావాలంటే గ్లూకోజు అణువులు ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందాలన్న వాస్తవం మృగ్యం కావడం వల్లనే నీటిలో మునిగిన వ్యక్తి చనిపోతాడు. తాచుపాము కాటుకు మనిషి ఎందుకు మరణిస్తాడు? ఆ విషంలోని ప్రోటీన్లు రక్తం ద్వారా మెదడుకు చేరి దాని చర్యలను చిన్నాభిన్నం చేయడం ద్వారా గుండె కదలికలకు జరగాల్సిన సంకేతాలు ఆగిపోవడం వల్ల చనిపోతాడు. ఉరి వేసుకొంటే మనిషి ఎందుకు చనిపోతాడు? ముసలి ప్రాయంలో ఎందుకు మరణిస్తాడు? రోడ్డు ప్రమాదాల్లో ఎందుకు మరణిస్తాడు? క్యాన్సరు వస్తే ఎందుకు మరణిస్తాడు; గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది వచ్చినపుడు ఎందుకు దాదాపు మరణానికి చేరువవుతాడు? ఎయిడ్స్‌ వ్యాధి వల్ల ఎందుకు మరణం తథ్యం? భోపాల్‌ గ్యాసు ప్రమాదం వల్ల వేలాదిమంది ప్రాణాలు ఎందుకు పోయాయి? ముషీరాబాదు ప్రాంతంలో ఆ మధ్య కలుషిత నీరు తాగితే చాలామంది పేదవారు ఎందుకు మరణించారు? యుద్ధంలో తుపాకీ తూటాలకు లోనైనవారు మరణించిందెందుకు? రైలు బోగీలకు, బస్సులకు నిప్పంటుకొంటే ఎందుకు ప్రయాణీకులు మరణిస్తారు? చాలాకాలంగా ఎండిపోయిన బావుల్లోకి దిగిన ఆరోగ్యవంతుడు ఎందుకు చనిపోతాడు?... ఇలా ఎన్నో మరణాలకు కారణాల్ని సైన్సు పూర్తివివరాలతో తెలుపుతోంది. శరీరంలో ప్రతి కణం, కణజాలం కీలకావయవాలు, సున్నితభాగాలు సరియైన పాదార్థిక నిర్మాణంతోను, దరిమిలా సక్రమమైన పాదార్థిక చర్యలతోనూ ఉండడమే జీవం.
ఉదాహరణకు ఓ లేటెస్టు మొబైల్‌ ఫోనును తీసుకోండి.. అందులో ఉన్న ఏ వస్తువుకూ జీవం లేదు. జీవంలాగా తనంత తాను కదలదు. ప్రక్కనే ఎన్ని పదార్థాలను పెట్టినా తనలాంటి మరో సెల్‌ఫోన్‌ను సృష్టించలేదు. కానీ ఆ సెల్‌ఫోన్‌లో కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు జరుగుతాయి. ఫొటోలు తీస్తుంది, బయటి నుంచి వచ్చే మాటల్ని వినిపిస్తుంది. మన మాటల్ని బయటికి పంపుతుంది. చేయి తగిలితే టచ్‌స్క్రీన్‌ మీద బొమ్మలు మారతాయి. సినిమాలు, పాటలు, వీడియోలు ఆడిస్తుంది. స్క్రీను మీదే బొమ్మలు వస్తున్నాయి కదాని సెల్‌ఫోను స్క్రీనును ఊడబెరికి ప్రక్కనబెడితే అందులోంచి బొమ్మలు రావు. సెల్‌ఫోను నడవాలంటే లోపలున్న బ్యాటరీ ముఖ్యం కాబట్టి, బ్యాటరీని టేబుల్‌పై ఉంచితే అదే బ్యాటరీ సెల్‌ఫోను చేసే పనుల్ని చేయదు. సెల్‌ఫోనులోని అన్ని వస్తువుల సమగ్ర, సంక్లిష్ట అమరికలోనే సెల్‌ఫోను నిర్మాణం, దాని పనితీరు నిబిడీకృతమై ఉన్నాయి. పనిచేయని సెల్‌ఫోనులో బ్యాటరీ బాగున్నా, స్క్రీన్‌ బాగున్నా, మరేదో బాగలేకపోవడం వల్లనే పనిచేయడం లేదు. అలాగే మనిషి లేదా ఓ జీవకణం సెల్‌ఫోను కన్నా సంక్లిష్టమైన నిర్మాణపూరితం. సెల్‌ఫోను చరిత్ర కొన్ని దశాబ్దాలది మాత్రమే. కానీ జీవకణం చరిత్ర వందల కోట్ల సంవత్సరాలది. శాస్త్రవేత్త అనే మనిషి శాస్త్రాన్ని సృష్టించే ధీశాలి కావచ్చు. అయితే అదే శాస్త్రం శాస్త్రవేత్తలో ఉన్న తెలివితేటలకు సృజనాత్మకతకు, నడవడికకు, జ్ఞానానికి, పరిజ్ఞానానికి, జ్ఞాపకశక్తికి, ఆకలిదప్పులకు, ఆలోచనాసరళికి పాదార్థిక భూమికను ఆపాదిస్తోంది. ఓ మనిషికున్న భావస్ఫోరకత సైన్సు పరిధిలోకి రాదని ఆ సదస్సు నిర్వాహకుల భావన. మనిషి ఆలోచన మెదడులోనే ఉంటుంది. మెదడు అనే పదార్థంలో ఉంటుంది. అయితే ఆ పదార్థం ఓ గుండుగుత్తగా బెల్లం ముద్దలా, బంగారపు బిస్కెట్‌లాగా లేదు. అందులో ఎంతో పాదార్థిక విశిష్టత ఉంది. గుణాత్మకత, పరిమాణాత్మకత ఉన్నాయి. ప్రతి మెదడు కణంలో ఉన్న డిఎన్‌ఎ లేదా ఆర్‌ఎన్‌ఎలలో ఉన్న కోడాన్ల సంఖ్య, అమరిక ఆయా మెదడు కణాల లక్షణాల్ని వ్యక్తీకరిస్తాయి. ఆరోగ్యంగా అన్నీ బాగా ఆస్వాదిస్తూ ఆ క్షణంలో నవ్వుతూ సరదాగా ఉన్న మనిషిని ఆసుపత్రి ఆపరేషను థియేటర్‌లో నైట్రస్‌ ఆక్సైడు అనే వాయువును కాసేపు పీల్పింపజేస్తే మత్తులోకి వెళ్తాడు. ఎన్ని జోకులు వేసినా అపుడు నవ్వలేడు. ఎదురుగా పిల్లల్ని దండిస్తున్నా ఏడవలేడు. పంచభక్ష్య పరమాన్నాల్ని ముందుపెట్టినా అబగా చూడలేడు. ఆయనకు అత్యంత ఇష్టమైన సంగీతాన్ని ఎంత బాగా వినిపించినా ఆనందించలేడు. కేవలం ఓ నిర్జీవ నైట్రస్‌ ఆక్సైడ్‌ వాయువు అణువుల ప్రభావంతో ఆయనలోని కళాపోషణ, భావుకత, అరిషడ్వర్గాలు, ఆకలిదప్పులు, ఆర్ద్రత, వాత్స్యలం, దయాకారుణ్యాలు, కోపతాపాలు, శృంగార కామాలు, నియమ నిష్టలు, కృత నిశ్చయాలు, భయ విహ్వలతలు, నవరస భావాలేమీ ఉండవు. చేష్టలుడిగి, కేవలం పరిమిత స్వతంత్ర నాడీవ్యవస్థ పరిధిలోకి నెట్టబడి బతకుతుంటాడు. కాబట్టి మనిషికున్న సకల బాహ్య, అంతరంగిక, చైతన్యపూరిత ప్రకటనల వెనుక జీవిస్తుండడం (మరణం లేకుండా ఉండడం) వెనుక పాదార్థిక భూమిక ుంది.. ఎవరు ఎందుకు ఎపుడు నవ్వుతారో, పిచ్చివారు అంటే ఎవరో, నడవడిక బాగా ఉన్నవారు ఎవరో, దొంగలెవరో, దొంగబుద్ధులెవరివో, తెలివి ఎవరిదో, తెలివి తక్కువతనం ఎందుకో, ఆకలి ఎపుడో, ఆకలి లేనిదెపుడో, ఇలాంటి ప్రతి భావ స్పురణ వెనుక పాదార్థిక నేపథ్యం ఉంది. సామాజిక పరిసరాలు కూడా మనిషి ఆలోచనలను నియంత్రిస్తాయి. సామాజిక పరిస్థితులంటేనే ఏమి తింటున్నాడు, ఎక్కడుంటున్నాడు, ఎవరితో ఉంటున్నాడు అన్న ఎన్నో భౌతిక వాస్తవాలే!
(పైవారం డార్విన్‌ 'నిజం' గురించి సంక్షిప్తంగా)
ప్రొ|| ఎ. రామచంద్రయ్య

సంపాదకులు, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

Monday 6 April 2015

థియోడోలైట్‌ను దేనికి ఉపయోగిస్తారు?
Posted on: Mon 06 Apr 22:23:46.65838 2015
                   
                  సమాంతర, నిట్టనిలువు కోణాలను కొలిచే సర్వే సాధనమే థియోడోలైట్‌. భూమి మీద గల వివిధ స్థలాలు, వాటికి మధ్య సంబంధాలను దీని ద్వారా కొలిచి మ్యాపులు తయారు చేస్తారు. రోడ్లు, భూగర్భ రహదారులు, ఇతర నిర్మాణాలలో ఖచ్చితమైన కోణాల కొలతలకు దీనిని వినియోగిస్తారు. క్షితిజ రేఖపై భూతలంమీంచి రెండు స్థలాలలో చంద్రునికి గల కోణాలను రోదసీ యాత్రికులు దీనితో కొలవగలరు. ఈ కోణాల నుండి భూమినుంచి చంద్రునికి గల దూరాన్ని లెక్కగడతారు. లెనార్డు డిగ్గెస్‌ అనే ఆంగ్ల గణితశాస్త్రవేత్త 16వ శతాబ్దంలో ఈ పరికరాన్ని రూపొందించాడు. గత నాలుగు దశాబ్దాలలో ఇది అనేక మార్పులు పొందింది. ఖచ్చితమైన కొలతలను ఇచ్చేందుకు ఇది ఒక త్రిపాదిపై అమర్చబడి ఉంటుంది. కదల్చగలిగే థియోడోలైట్‌లో పైన అమర్చబడిన టెలిస్కోపును బయటకు తీయవచ్చు. థియోడోలైట్‌ను కెమెరాతో కలిపితే అది ఫోటో థియోడోలైట్‌ అవుతుంది. మ్యాపుల తయారీలో అవసరమైన క్షేత్ర ఫోటోగ్రామెట్రీ కి దీనిని వినియోగిస్తారు.
ఏప్రిల్‌ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
Posted on: Mon 06 Apr 22:38:06.764362 2015
                      మన ఆరోగ్య సంరక్షణలో పోషకాహారానికి ఉన్న ప్రాధాన్యత కొత్తగా చెప్పనవసరం లేదు. ఆహారం విషయంలో పోషక విలువలు ఎంతముఖ్యమో పరిశుభ్రత అంతే ముఖ్యం. పరిశుభ్రత లోపించిన లేదా కల్తీచేయబడిన ఆహార పదార్థాల వలన విరేచనాలు మొదలు కొని క్యాన్సర్‌ల వరకు 200 రకాల వ్యాధులు వస్తాయి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం వలన వచ్చే విరేచనాలతో యేటా ప్రపంచ వ్యాపితంగా 22 లక్షల మంది ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. ఇందులో ప్రధాన వాటా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలదే! దీర్ఘకాలిక పోషకాహార లోపానికి, వ్యాధులకు అపరిశుభ్రమైన ఆహారం కూడా ఒక ముఖ్య కారణం. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మొదలుకొని ఈ సంవత్సరమంతా ''పొలం నుంచి పళ్లెం వరకు ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచండి'' అనే నినాదంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు.
ఆహారసంబంధ వ్యాధులు -కారణాలు..
ఆహార పదార్థాలలో బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు వంటివి చేరడం వల్ల, లేదా హానికారక రసాయనాలు కలవడంవల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. ఆహారం కలుషితమయినప్పుడు తలెత్తే వాంతులు, విరోచనాలు శరీరం విషతుల్యం కావడం వంటి తక్షణ సమస్యలే కాకుండా దీర్ఘకాలం పాటు కలుషిత ఆహారాన్ని తింటే ఊపిరితిత్తులు, నాడీమండల, శ్వాసకోశవ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్లు తలెత్తుతాయి.
ఏవి ప్రమాదకరమైన ఆహారాలు?
సరిగా ఉడికించని మాంసపు ఉత్పత్తులు, శుభ్రపరచని పండ్లు, కూరగాయలు, సముద్ర విషపదార్థాలతో కలుషితమైన చేపలు వంటివి.
కల్తీకి గురయ్యే ఆహారపదార్థాలు : పాలు, నెయ్యి, వంటనూనెలు, మసాలా పొడులు, గోధుమపిండి, టీ పొడి, కాఫీపొడి, మిరి యాలు, పసుపు, చక్కెర, బెల్లం, కందిపప్పు, తేనె మొదలగునవి.
ఆహారం ఇలా కలుషితం అవుతుంది..
పొలంలో పండించిన దగ్గర నుండి (శాకాహారం) లేదా ఫారాలలో పెంచేదశ నుండి (మాంసాహారం) -వాటిని సేకరించ డం, శుద్ధి చేయడం, ప్యాకింగ్‌ చేయడం, రవాణా చేయడం, నిల్వ వుంచడం, వండి వడ్డించే వరకు వివిధ దశలలో ఆహారం ఎక్కడైనా కలుషితం అయ్యే అవకాశం వుంది.
మితిమీరి వాడుతున్న ఎరువులు, పురుగుమందులు, జంతువుల ఆహారంలో కలుపుతున్న ఔషధాల వలన.
హోటళ్లలో, దుకాణాలలో పదార్థాల తయారీలో, నిల్వ ఉంచడంలో తగిన పరిశుభ్రత, ఇతర జాగ్రత్తలు పాటించనందున.
ఆహారం దీర్ఘకాలం నిల్వఉండడానికి, పండ్లు త్వరగా పండడానికి, మంచి రంగులో కనిపించడానికి కలిపే రసాయనాల వలన.
పదార్థాల పరిమాణం పెంచేందుకు చేసే కల్తీ కారణంగా.
ఆహార పరిశుభ్రత - అందరిబాధ్యత..
ప్రభుత్వాలు: పట్టిష్టమైన చట్టాలు రూపొందించి అమలు చేయాలి. దేశంలో వివిధ ప్రాంతాలలో తలెత్తుతున్న ఆహార సంబంధ వ్యాధులను గుర్తించడానికి ప్రాంతీయ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటుచేయాలి. తగిన సంఖ్యలో ఆహార తనిఖీ అధికారులను నియమించాలి. వారు పారదర్శకంగా బాధ్యతలు నిర్వహించేలా చూడాలి. ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, రవాణా, విక్రయం వంటి దశలలో పాటించ వలసిన జాగ్రత్తలను, నిబంధనలను స్పష్టంగా స్థానిక భాషలో తెలియచేయాలి. అవి పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు తమ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, కల్తీలను గుర్తించి నివారించు కోవడానికి కావలసిన అవగాహన కల్పిం చాలి. ఇందుకు జన విజ్ఞానవేదిక వంటి సైన్సు ప్రచార సంస్థలు, పౌర సంఘాలు, వినియోగ దారుల సంఘాల సహకారం తీసుకోవచ్చు.
పౌర సంఘాలు : తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలి. ప్రజలకు అవగాహన కలగచేయాలి.
విద్యాసంస్థలు : తమ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆహార పరిరక్షణపై అవగాహన కలిగించాలి.
ప్రజలు : ఆహార పరిశుభ్రతకు తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలి. ఆహార సంబంధ వ్యాధులపై అవగాహన పెంచుకుని పరిశుభ్రత పాటించాలి. ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు వాడేటప్పుడు లేబుల్‌పై ఉన్న సూచ నలను పాటించాలి. కల్తీని గుర్తించి ఆహార తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
- జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ కమిటీ