Wednesday 18 July 2012

విశ్వావిర్భావం.. పరమాణు ... ఉపకణాలు...


           ఒకే ముద్దగా ఉన్న విశ్వంలో 1375 కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం జరిగిన వెంటనే విడుదలైన మహాశక్తి సెకనులో కొన్నికోట్ల వంతు సమయంలో వేగంగా చల్లారి ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఏర్పడ్డాయని మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఇవి కొన్ని నిమిషాల్లోనే పరమాణు కేంద్రకాలుగా రూపుదిద్దుకున్నాయి. ఈ మహావిస్ఫోటన సమయంలో జరిగిన మార్పులకు సాక్ష్యాలుగా పరమాణు ఉపకణాలు నేడు మనముందున్నాయి. వీటి అధ్యయనం ద్వారా విశ్వావిర్భావ రహస్యాలను తెలుసుకునే పరిశోధనలు కొనసాగుతున్నాయి. 'లార్జ్‌ హార్డన్‌ కొల్లిడర్‌' ప్రయోగం వీటిలో ఒకటి. 'విశ్వావిర్భావం.. వివిధ పరమాణు.. ఉపకణాల'కున్న సంబంధాన్ని 'ప్రొ|| అరిబండి ప్రసాదరావు, డా|| బి.ఆర్‌.కె.రెడ్డి' సంయుక్త సహకారంతో సంక్షిప్తంగా తెలిపేందుకు మీముందుకొచ్చింది 'విజ్ఞానవీచిక'. మూడుభాగాల్లో రెండోభాగం ఈ వారం మీ కోసం.
మహావిస్ఫోటన సమయంలో చిన్న 'పులుస్టాప్‌' కన్నా తక్కువ పరిమాణంలో గల చిన్నకణాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా తటస్థ ఛార్జితో పరమాణువులు 3.80 లక్షల సంవత్సరాలు అయ్యేసరికి ఏర్పడ్డాయి. వాటిలో 76% హైడ్రోజన్‌, 24% హీలియం పరమాణువులు ఏర్పడ్డాయి. ఒక బిలియన్‌ సంవత్సరాలు గడిచేసరికి మొదటిగా నక్షత్రాలు, డ్వార్ఫ్‌ (కుబ్జ) గెలాక్సీలు, మూడు బిలియన్‌ సంవత్సరాలకు ఈ చిన్న చిన్న గెలాక్సీలు కలిసి పెద్దవిగా రూపాంతరం చెందాయి. తొమ్మిది మిలియన్‌ సంవ త్సరాలకు మిల్కీవే గెలాక్సీలో సౌరకుటుంబం ఏర్పడింది. అంటే, 500 కోట్ల సంవత్సరాల క్రితమే మన సూర్యుడు రూపొందాడు. హైడ్రోజను, హీలియం ఇంకా కొన్ని తక్కువ పరిమాణంలో ఇతర మూలకాలతో కలిసి సూర్యుడు ఏర్పడ్డాడు.

450 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యునితో కలవకుండా మిగిలి ఉన్న కొంత పదార్థం కలిసి మన భూమి ఏర్పడింది. 370 కోట్ల సంవత్సరాల క్రితమే కర్బనము కలిసిన అణువుల (మాలిక్యూల్స్‌)తో మొదటి జీవము ఏర్పడింది. పది లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే భూమి మీద మానవుడు నడక మొదలుపెట్టాడు. మహావిస్ఫోటనం వల్ల విడుదలైన మహాశక్తి పరమాణు ఉపకణాలుగా రూపు దిద్దుకోవడం విశ్వావిర్భావ రహస్యాలుగా కొనసాగుతున్నాయి. పరమాణు నిర్మాణం, ముఖ్యంగా పరమాణు ఉపకణాల అధ్యయనం ద్వారా ఈ రహస్యాల్ని ఛేదించడానికి శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. వీటిలో ఆధునిక పరమాణు ఉపకణాల అధ్యయనం కీలకంగా కొనసాగుతుంది.

పరమాణు నిర్మాణం..


     
          పరమాణువులను విభజించలేని కణాలుగా ఒకప్పుడు భావించాం. కానీ, ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం వీటిని విభజించవచ్చు. ఇవి ఉపకణాలను కలిగి ఉన్నాయి. ఇవి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు. వీటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకంలో ఉండగా, ఎలక్ట్రాన్లు స్థిరకక్ష్యలో కేంద్రకం చుట్టూ నిరంతరం తిరుగు తుంటాయి. ప్రోటాన్ల ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ల కన్నా 1832 రెట్లు ఎక్కువ. న్యూట్రాన్లు 1839 రెట్లు ద్రవ్యరాశిని అధికంగా కలిగి ఉంటాయి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు విభజింపలేనివిగా భావించేవారు. కానీ, ఇపుడు ఇవీ విభజించబడుతున్నాయి. ఇలా వచ్చిన ఉపకణాలను 'క్వార్క్‌'లుగా పేరు పెట్టారు.
         ప్రోటాన్లు ఒక యూనిట్‌ ధనావేశం కలిగి ఉండగా, న్యూట్రాన్లు తటస్థంగా ఉంటాయి. కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య పరమాణు సంఖ్యను తెలియజేస్తుంది. దీనిమీద పరమాణు రసాయనిక ధర్మాలు, గుణగణాలు ఆధారపడి ఉంటాయి. ఈ సంఖ్యకు సమానమైన ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ స్థిరకక్ష్యలో నిరంతరం తిరుగుతూ ఉంటాయి. భౌతిక ప్రామాణిక నమూనా (స్టాండెర్డ్‌ మోడల్‌) ప్రకారం ఎలక్ట్రాన్లకు అంతర్గత నిర్మాణం లేదు. కానీ, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మిశ్రమ ఉపకణాలు. ఇవి అంతర్గత నిర్మాణం కలిగి వున్నాయి. వీటిలో ప్రాథమిక ఉపకణాలైన 'క్వార్క్‌'లు ఉంటాయి.
క్వార్క్‌లు..

        ఇవి రెండు రకాలు. అవి పైవి, కిందవి. వీటి విద్యుదావేశం వేర్వేరుగా ఉంటుంది. పైక్వార్కులు+2/3 ఛార్జి కలిగి ఉండగా, కింద క్వార్కులు-1/3 ఛార్జి కలిగి ఉంటాయి.
ప్రోటాన్లలో రెండు పైక్వార్క్‌ కణాలు, ఒక కింది క్వార్క్‌ కణం ఉంటుంది. ప్రోటాన్‌ నికర ఛార్జి ఒక యూనిట్‌. న్యూట్రాన్లలో ఒక పైక్వార్క్‌ కణాలు, రెండు కింద క్వార్క్‌ కణాలు ఉంటాయి. మొత్తం మీద ఈ ఉపకణాలు విద్యుత్‌పరంగా తటస్థంగా ఉంటాయి. ఈ క్వార్క్‌లు పటిష్టమైన శక్తితో అనుసంధానించబడి ఉంటాయి. ఈ శక్తి కణాలను 'గ్లూవాన్లు'గా పిలుస్తారు. కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకశక్తితో జత కలిసి ఉంటాయి.
కేంద్రకంలో వుండే ఉపకణాలన్నింటినీ కలిపి 'కేంద్రకకణాలు (న్యూక్లియన్స్‌)' గా పిలుస్తారు. ఒకే పరమాణువుకు చెందిన ప్రోటాన్ల సంఖ్య ఒకేలా ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య మారితే పరమాణువు స్వభావం మారుతుంది. ఒకే పరమాణువు కేంద్రకంలో గల న్యూట్రాన్ల సంఖ్య మారవచ్చు. ఇలా మారిన పరమాణువుల్ని 'ఐసోటోపు'లుగా పిలుస్తారు. కేంద్రకంలో మామూలుగా న్యూట్రాన్లు, ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉం టుంది. ప్రోటాన్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పరమాణు కేంద్రకంలో అస్థిరత్వం పెరు గుతుంది. ముఖ్యంగా పరమాణు సంఖ్య 26 పైన ఉంటే అస్థిరత్వం పెరుగుతుంది.
పరమాణు రూపం కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్లతో అస్పష్టంగా కనిపిస్తుంది. ఎలక్ట్రాన్లు స్థిరమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి.
విశ్వంలో పరమాణువుల మొత్తం శక్తి నాలుగుశాతం వరకే ఉంటుంది. విశ్వం సగటు పరమాణు సాంద్రత చదరపు మీటరుకు 0.25 పరమాణువులు. కానీ, గ్యాలెక్సీ, పాలపుంతల్లో ఈ సాంద్రత 105 నుండి 109 పరమాణువుల వరకూ చేరుతుంది. సూర్యుని చుట్టూ ఉన్న ప్రాంతంలో పరమాణువుల సాంద్రత 103 విశ్వంలో మిగతా 96 శాతం పదార్థాన్ని 'ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని అంతరిక్ష ప్రాంతం' (డార్క్‌ మ్యాటర్‌)గా, శక్తిని 'కృష్ణ బిలం (డార్క్‌ ఎనర్జీ)'గా పిలుస్తున్నారు. ఖగోళ భౌతికశాస్త్రవేత్తల ప్రకారం కనిపించని ఈ 96% పదార్థంలో 70% శక్తి రూపంలోనూ, 26% పదార్థ రూపంలోనూ ఉంటుంది.
ఉపకణాలు..

             దాదాపు వందకుపైగా పరమాణు ఉపకణాలను గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1.ఫ˜ర్మియాన్లు, 2. బోసాన్లు. ఫ˜ర్మియాన్‌ ఉపకణాలు ఫర్మి-డిరక్‌ గణాంకాలకు అనుగుణంగా వుంటాయి. బోసాన్లు బోస్‌-ఐన్‌స్టీన్‌ గణాంకాలకు అనుగుణంగా ఉంటాయి. ఒకే పరిమాణస్థితిలో ఒకటికన్నా ఎక్కువ ఫర్మియాన్‌ ఉపకణాలు ఉండలేవు. ఇవి పదార్థానికి గట్టితనాన్ని, స్థిరత్వాన్ని ఆపాదిస్తాయి. కానీ, బోసాన్లు ఒకేస్థితిలో ఒకటి కన్నా ఎక్కువగా ఉండగలవు. బోసాన్లు ప్రధానంగా శక్తి వాహక ఉపకణాలు. కానీ ఫర్మియాన్లు పదార్థంతో ఇమిడి వుంటాయి. బోసాన్లు ఒక చుట్టు తిరగగా (ఒక స్పిన్‌), ఫర్మియాన్లు సగం (హాఫ్‌స్పిన్‌) చుట్టే తిరుగుతాయి.
భౌతిక ప్రామాణిక నమూనా ప్రకారం ఎక్కువ బోసాన్లు మిశ్రమ ఉపకణాలు. కానీ, ఐదు కణాలు మాత్రం ప్రాథమిక ఉపకణాలు. ఇవి నాలుగు గేజ్‌ బోసాన్లు, ఒక హిగ్స్‌ బోసాన్లు. అదనంగా గురుత్వాకర్షణ శక్తిని కలిగించే 'గ్రావిటాన్‌' ఉపకణాన్ని ఒకవేళ ప్రామాణిక నమూనాలో చేర్చితే బోసాన్‌ ఉపకణంగా పరిగణించవచ్చు.
సాధారణంగా కనిపించే బోసాన్లు.. 1. ఫోటాన్లు- విద్యుదయస్కాంత శక్తి గలవి; 2. డబ్ల్యు-జెడ్‌ బోసాన్లు- ఇవి బలహీనశక్తికి వాహకంగా పనిచేస్తాయి. 3. గ్లూవాన్లు - ఇవి బలమైనశక్తికి వాహకంగా పనిచేస్తాయి. వీటినే కాక ప్రామాణిక నమూనా హిగ్స్‌ బోసాన్‌ కణాలను ఊహిస్తుంది - ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన కణం హిగ్స్‌ బోసాన్‌ కణాన్ని పోలి వుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అయితే, హిగ్స్‌ బోసాన్‌ కణాలు చుట్టు తిరగలేవు (స్పిన్‌ ఉండదు). స్థిరంగా ఉంటాయి. ఇవి విద్యుత్‌పరంగా తటస్థం.
గురుత్వాకర్షణ శక్తిని కలిగించే కణాలను గ్రావిటాన్స్‌గా సూచిస్తున్నారు. ఈ ఉపకణాల 'చుట్టు తిరుగుడు' (స్పిన్‌) సంఖ్య రెండు. ఇవి మిశ్రమ ఉపకణాలు. ఇవి బోసాన్స్‌ లేదా ఫర్మియాన్స్‌ కావొచ్చు.
సవరణ: గతవారం 'మీకు తెలుసా' శీర్షికలో 'కాంతివేగాన్ని సెకనకు 3 కోట్లు అని వచ్చింది. దీనికి బదులు సెకనుకు 3 లక్షలుగా సరిచేసి చదువుకోగలరని మనవి. పాఠకులకు కలిగిన అసౌకర్యానికి విచారిస్తున్నాం.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

హిగ్స్‌ బోసాన్స్‌...



        బ్రిటిష్‌ శాస్త్రవేత్త పీటర్‌ హిగ్స్‌, భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్‌ బోస్‌ ఇద్దరిపేర్లు కలిపి 'హిగ్స్‌ బోసన్‌' అని ఉపకణానికి పేరు పెట్టారు. ఇది విశ్వనిర్మాణంలో ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. మహావిస్ఫోటనం అనంతరం జరిగిన విశ్వపరిణామంలో నక్షత్రాలు, గ్రహాలు ఒకదాని తరువాత ఒకటిగా ఎలా ఆవిర్భవించాయో 'హిగ్స్‌ కణాలు' వివరిస్తాయనేదే 'స్టాండర్డు మోడలు సిద్ధాంతం'. ఈ కణాలు లేకపోతే విశ్వం మొత్తం పరస్పర సంబంధం లేకుండా ఇసుక రేణువుల వలె ఉండేదే తప్ప పదార్థం ఒక దగ్గరకు చేరి గ్రహాలు, నక్షత్రాలుగా మారేది కాదని ఈ సిద్ధాంతం పేర్కొంది. దీనిప్రకారం మనకు తెలిసిన ఏ కణానికీ స్వతహాగా ద్రవ్యరాశి లేదనీ, అవి హిగ్స్‌ క్షేత్రములో ప్రయాణించినపుడే ఈ బోసాన్లు వాటికి ద్రవ్యరాశిని సమకూరుస్తున్నాయనీ తెలిసింది. అయితే, హిగ్స్‌ క్షేత్రం నుంచి ఉపకణాలు ప్రయాణించినప్పుడు ద్రవ్యరాశి ఎలా చేకూరుతుందో తెలియాల్సి వుంది.
బోసాన్‌ కణాలు. చుట్టు తిరుగుడు (స్పిన్‌) సంఖ్య ఒకటి. 'హిగ్స్‌ శక్తి స్థలం' (హిగ్స్‌ ఫోర్స్‌ఫీల్డ్‌) మొత్తం పరమాణు భాగాన్ని ఆక్రమించుకుంటుంది. ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ వుంటుంది. క్వార్క్స్‌, ఎలక్ట్రాన్లు హిగ్స్‌ క్షేత్ర శక్తిలో పయనించినప్పుడు బరువును పొందుతాయి. ఫోటాన్‌ ఉపకణాలు విద్యుదయస్కాంత శక్తి కణాలుగా ఉన్నట్లుగానే హిగ్స్‌ క్షేత్రశక్తికి హిగ్స్‌ బోసాన్‌ ఉపకణాలు ఉంటాయి. హిగ్స్‌ బోసాన్‌ ఉపకణ ద్రవ్యరాశి చాలా ఎక్కువ. ఫలితంగా, వీటి అధ్యయనానికి పెద్ద శక్తి కావాలి.
'దైవం' కాని కణం..
             'హిగ్స్‌ బోసాన్‌ కణం'.. 'దైవ కణం'గా  సామాన్య మాద్యమంలో ప్రచారం పొందుతుంది. ఇదొక 'ముద్దుపేరు'. నోబుల్‌ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రజ్ఞుడు లియాన్‌ లెడర్‌మాన్‌ అనుకోకుండా హిగ్స్‌ బోసాన్‌ కణానికి సరదాగా ఈ పేరును వాడాడు. 'గార్డ్‌పార్టికల్‌: ఇఫ్‌ యూనివర్స్‌ ఈజ్‌ ది ఆన్సర్‌, వాట్‌ ఈజ్‌ ది క్వశ్చన్‌?' ('దైవకణం:విశ్వం సమాధానమైతే, దీనికి ప్రశ్నేమిటి?') అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. కానీ, హిగ్స్‌-బోసాన్‌ కణాన్ని మొదట గుర్తించిన 'హిగ్స్‌' తాను గుర్తించిన ఉపకణానికి 'దైవ కణం' అని పేరు పెట్టడం ఏమాత్రం రుచించలేదు. అయితే, ఈ ముద్దుపేరు వెనుక ఏ మత ఉద్దేశం లేదని అంటున్నారు. శాస్త్రజ్ఞులు ఈ పదాన్ని వాడటం లేదు.

కష్టసుఖాలకు కారణాలేంటి? (3)


  • అశాస్త్రీయ ఆచారాలు14
          ''పిిల్లలూ! ఇలాంటివి ఇంకా అనేకాంశాలు 'తాళ పత్ర నిధి'' అనే గ్రంథంలోనూ, 'గృహవాస్తు'లోనూ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మనం తలంటుకొనే రోజుకీ, మన ఇంట్లో తేనెతుట్టె ప్రదేశానికీ, అరటిచెట్టు ఉండే దిశకీ, అలాగే భోజనం చేసే వైపుకీ, జుట్టు కత్తి రించుకొనే తిథికీ, బల్లిపాటుకూ మనకు వచ్చే కష్టసుఖా లకీ సంబంధం ఉందని ఎలా నిరూపించగలం? ఇన్ని వందల సంవత్సరాల నుండి ఎవరైనా నిరూపించారా? మన సుఖాలకి అసలు కారణం 'ఆత్మవిశ్వాసంతో కూడిన తీవ్రమైన కృషి' అని సామాజిక శాస్త్రవేత్త లందరూ స్పష్టం చేశారు. విజయం సాధించిన మహా నుభావులందరూ నిరూపించారు. ఇవి లోపించినపుడు కష్టాలు వస్తాయి. వాస్తవమిది కాగా ఆవరణలోని అరటిచెట్టుకీ, నిద్రలేవగానే కనిపించే వ్యక్తికీ, కసువు పారవేసే ప్రదేశానికీ సంబంధం ఉందని నమ్మడం మన అమాయకత్వం, మనలోని అశాస్త్రీయ ఆలోచనా విధానం. తేనెపట్టు పట్టిన ఇంట్లో నివాసం ఉండీ, మధ్యలో నుండి గెలపొడుచుకు వచ్చిన అరటిచెట్టును పెంచీ, తనకే కష్టమూ, నష్టమూ జరగలేదనీ, జరగదనీ నూరేళ్ళక్రితమే నిరూపించారు కందుకూరి వీరేశలింగం గారు. కాబట్టి మన జయాపజయాలకీ, లాభనష్టాలకీ ఎంగిలినీళ్ళు ఆ మూల పారబోయడమో, తీసివేసిన గోళ్ళు ఇంట్లో ఉండటమోలాంటి నిరూపణ చెయ్యలేని అంశాలు కారణమని నమ్మకండి. మన కృషి, పట్టుదలలే కారణమని నమ్మండి. ఇవన్నీ మూఢనమ్మకాలు. వాటిని వదలండి.
మన పెద్దలు చెప్పినట్లు 'కృషితో నాస్తి దుర్భిక్షం'; అంటే కృషితో వ్యక్తిగత దరిద్రాన్నే కాదు సామాజికంగా కరువును కూడా లేకుండా చేయవచ్చు'' అని ముగించాను.
ఒక్క నిమిషం నిశ్శబ్ధం. తర్వాత సాయిలక్ష్మి లేచి ఇలా అడిగింది. 'మరి ఈ మూఢనమ్మకాలు మన సమాజంలోకి ఎలా ప్రవేశించాయి మాస్టారూ?''
''మంచి ప్రశ్న వేశావమ్మా! దీనికి సమాధానం వచ్చే క్లాసులో చెబుతాను'' అన్నాను.

కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

దేవుని ఊహాశక్తి నుండే విశ్వం సమస్తం ఏర్పడినట్లు ఎందుకు అనుకోకూడదు?


         దైవకణాల గురించి మీరు గతవారం ఇచ్చిన సమాధానంలో పదార్థం-శక్తి ఒకే నాణేనికి రెండు పార్వ్వాల్లాంటివన్నట్లుగా చిత్రీకరించారు. పదార్థం-శక్తి వేర్వేరని నా ఉద్దేశ్యం. శక్తే మొదట్లో ఉండేదనీ - అదే పదార్థంగా రూపొందిందని బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతకర్తలు చెబుతున్నారు. ఆ శక్తే దైవశక్తి అనీ అదే మొదట దైవకణాలుగా రూపొందిందని నా భావన. దేవుని ఊహాశక్తి నుండే విశ్వం సమస్తం ఏర్పడినట్లు ఎందుకు అనుకోకూడదు? - మెటా ఫిసిసిస్ట్‌ (అనే అనామకపేరుతో నా వ్యాసంకన్నా పెద్ద స్పందన చేసిన ఓ పాఠకమిత్రుడు)

         శాస్త్రీయ చర్చకు మనం అనామకపేర్లు ఉంచుకోనవసరం లేదు. నిగూఢంగా ఉండాల్సిన అవసరం అసలే లేదు. దైవకణాల వ్యాసం గురించి, అంతకుముందు కూడా హేతువాద వైఖరికి సంబంధించిన సమాధానాలు ఇచ్చిన సందర్భాల్లో మీరు ప్రతిసారీ ఆకాశరామన్నలాగే స్పందించారు. అనామక పద్ధతిలో ప్రజాశక్తి 'నెట్‌ వర్షెన్‌'కు స్పందనను తెలియజేసే క్రమంలో మీరు చాలా అసహనానికి గురయ్యారు. నాపై వ్యక్తిగత దూషణలకు పాల్ప డ్డారు. జన విజ్ఞాన వేదిక మీద కొంత అసభ్య పదజాలాన్ని కూడా వాడారు. అయితే శాస్త్ర ప్రచారమే పరమావధిగా, సత్యాన్వేషణే దిక్సూచిగా, ప్రజా సైన్సు ఉద్యమం ద్వారా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమే గమ్యంగా పయనిస్తున్న మేము మీ బోంట్ల తిట్లను, శాపనార్థాల్ని దీవెనులుగా భావిస్తాము. కాకుంటే మా బాధ్యత మరింత ఎక్కువగా ఉందనీ మీ వంటి మేథో ఛాందసుల్ని, ఛాందస మేధావుల్ని కూడా సమాధానపర్చాల్సిన బాధ్యత కూడా ఉందనీ మరోసారి గుర్తెరిగి సమాయత్తమవుతాము.
మీలాంటి వారు మీరొకరే కాదు. అంతోయింతో అనామకంగానయినా మెటాఫిసిసిస్ట్‌ మాటునయినా ఈపాటి మాటలతో చాటుగా బయటపడ్డ మీకు బాహాటంగా సమాధానమివ్వటమే పరిపాటి.
సైన్సు ఉద్దేశంలో మెటాఫిసిక్స్‌ అంటూ ఏదీ లేదు. అధి భౌతికవాదం (metaphysics) అనేది కొందరి అతి మేధావుల బుర్రల్లో చెలరేగే అతి, మిడిమిడి, పరిమితి భావాల సమ్మిశ్రమణం. ఏదోవిధంగా భావ వాదానికి, ఛాందసత్వానికి, అవాస్తవ జగత్తుకు వత్తాసు పలికే చిత్త చెత్త చిత్తరువు.


       మీ ప్రశ్నలో ఉన్న సార్వజనీనకత (generality) వర్తమాన భౌతికవాదనకు సవాలుగా ఉండడం వల్ల మీ సుదీర్ఘ స్పందనలో బయటపడ్డ సారాన్ని ఆ ప్రశ్నగా భావిస్తూ సంక్షిప్తంగా ఇక్కడ సమాధానమిస్తున్నాను. అయినా, మీ తిట్ల పరంపరకు తెర దించే రకం మీరు కాకున్నా మా పాఠకులకు విజ్ఞానం చేరవేసేందుకు మీరు కారకులైనందుకు ధన్యవాదాలు.
శక్తి (energy) అనేది నేటికీ విశ్వంలో ఉంది. పదార్థం (matter) అనేదీ ఉంది. ఈ రెండు వేర్వేరు విశ్వపుటంశాలు (cosmic entities) గా భావించడానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. కేవలం మహామేధావి ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అతి పిన్నవయస్సులోనే తన సాపేక్షతా సిద్ధాంతం (Theory of Relativity) ద్వారా శక్తి, పదార్థం ఒక్కటే అన్నాడు. మీరన్నట్లు ఒకే నాణేనికి రెండు పార్శాలు అని కూడా అనలేదు. అలా అన్నా కనీసం బొమ్మ, బొరుసు నిజంగానే వేర్వేరు పక్కల ఉన్నంతైనా స్వతంత్రను ఆపాదించి ఉండేవాళ్లం. అలాకాకుండా శక్తి, పదార్థం ఒకటేనన్నాడు. మీరన్న ఒకే నాణేనికి రెండు పార్శాల్లాగా, జతలాగా ఉండడాన్ని చలించే పదార్థాలకున్న కణ (particle) - తరంగ(wave) ద్వంద్వ స్వభావాని (duality) కి రూపకం(analogy) గా భావించగలం. కానీ పదార్థం - శక్తి అనే అంశానికి కాదు. పదార్థం - శక్తి ఒక్కటే అన్నాడు. దానికి తిరుగులేని ప్రాయోగిక సాక్ష్యాలు (empirical proofs) లభ్యమయ్యాక కూడా పదార్థం-శక్తి వేర్వేరు అంశాలు అనుకోవడం పరిమిత పరిజ్ఞానం. పరిమిత పరిజ్ఞానం అని ఎందుకంటున్నా నంటే సాధారణ రోజువారీ కార్యకలాపాలలో పదార్థం, శక్తి వేర్వేరు అంశాలుగానే ద్యోతకమవుతాయి. వాటి మధ్య తేడాలేని విషయం కేవలం లోతైన పరీక్షల్లోనే బోధపడుతుంది. 'శక్తి' అంటే సాధారణ పరిభాషలో పని (work) ని చేయగలది అని నిర్వచనం (definition) ఉంది.

పని అంటే ఏమిటి? వస్తువును జడం (inert) గా ఉంచే, లేదా అనుకున్న దిశలో వస్తు కదలికను అవరోధించే బలాన్నెదిరిస్తూ వస్తువు స్థానచలనం లేదా స్థానభ్రంశం (displacement) కలిగించగలిగితే అప్పుడు 'పని' జరిగిందని అంటాము. కాబట్టి 'పని' అన్నా 'శక్తి' అన్నా ఒకటే. శక్తికి భౌతికశాస్త్రంలో కొలమానాలు 'ఎర్గులు' లేదా జౌళ్లు. ఒక న్యూటన్‌ అవరోధ బలాన్ని అధిగమిస్తూ ఓ వస్తువును ఒక మీటరు మేరకు జరపగలిగితే అపుడు వినిమయమైన శక్తిని ఒక జౌలు అంటాము. అలాగే ఒక డైను (dyne) అవరోధబలాన్ని అధిగమిస్తూ ఒక వస్తువును ఒక సెం.మీ. మేరకు జరపగలిగితే అప్పుడు ఒక ఎర్గు (erg) పని జరిగిందని అర్థం. ఒక కోటి ఎర్గులు ఒక జౌలుకు సమానం లేదా 1J = 1X107 erg అని చెబుతాం. మరి సాధారణ పరిభాషలో పదార్థం (matter) అంటే అర్థం ఏమిటి? వస్తువు (object) నకు జడత్వా (inertia) న్ని సమకూర్చే అంతర్గత లక్షణమే పదార్థం. కదలని వస్తువును కదలకుండానే ఉంచే తత్వాన్ని, సమవేగం (uniform velocity) తో ప్రయాణిస్తున్న వస్తువును అదే విధమైన సమవేగ గమనం నుంచి తప్పించనితత్వాన్ని వస్తువుకున్న పాదార్థిక (mass) లక్షణం అంటారు.

దీనర్థం ఏమిటంటే కిలోగ్రాము ద్రవ్యరాశి ఉన్న వస్తువును కదిలించడం కన్నా 10 కిలోగ్రాముల ద్రవ్యరాశి ఉన్న వస్తువును కదిలించడం కష్టమన్నమాట. న్యూటన్‌ మొదటిసూత్రం ప్రకారం ఇలా జడత్వంలో ఉన్న పదార్థపు జడత్వాన్ని అధిగమిస్తూ కదలని వస్తువు (0 వేగం)ను కదిలించేది బలం. (force). లేదా సమవేగంతో ఉన్న వేగాన్ని మార్చేది కూడా బలం. అయితే వేగంలో కలిగే మార్పు (సున్న నుంచి సున్న కానిదవడం, సమవేగంలో మార్పు రావడం) ను త్వరణం (acceleration) అంటారు. అంటే మరోమాటలో చెప్పాలంటే వస్తువునకు త్వరణాన్ని ఆపాదించేది బలమన్న మాట. ద్రవ్యరాశికి జడత్వం ఉండడం వల్ల నిర్దిష్టబలంతో పెద్ద ద్రవ్యరాశికి తక్కువ త్వరణాన్ని, తక్కువ ద్రవ్యరాశికి ఎక్కువ త్వరణాన్ని ఇవ్వగలమని కూడా ఇక్కడ అర్థంచేసుకోవాలి.

అందుకే F అనే బలాన్ని F=ma గా సూచిస్తారు. (ఇక్కడ M అంటే ద్రవ్యరాశి, a అంటే త్వరణం అన్నమాట). F అనే అవరోధబలాన్ని అధిగమిస్తూ S దూరం మేరకు వస్తువును కదలిస్తే పని (W) జరిగినట్లు ముందే అనుకున్నాం. కాబట్టి నిర్ణీతశక్తితో అవరోధబలం ఎక్కువయితే తక్కువ దూరానికే వస్తువును కదలించగలమని, అవరోధబలం తక్కువయితే ఎక్కువదూరం కదలించగలమని కూడా భావించాలి కదా! కాబట్టి W=FS అని రాస్తాము. ఇక్కడ W అంటే పని, F అంటే బలం, ూ అంటే కదలిన దూరం. W నే (Energy) అని కూడా అంటాము.
ఇపుడు శక్తికి, పదార్థానికి సంబంధించిన మౌలిక శాస్త్రీయ అర్థాలను తెలుసుకున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న ఏకత్వానికి సంబంధించిన అంశాన్ని E=mc2 అనే సూత్రంలో ఆ రెంటి ఐక్యత ఏ విధంగా సిద్ధిస్తుందన్న అంశాన్ని, శక్తి పదార్థానికి మధ్య జరిగే పరస్పర వినిమయా (mutual exchange) నికి సంబంధించిన సాక్ష్యాధారాల్ని, తద్వారా విశ్వావిర్భావంలో దైవకణాల (God particles) నబడే హిగ్స్‌ కణాల విశిష్టపాత్ర గురించి పై వారం ముచ్చటించుకుందాం.

అత్యంత బరువు తక్కువ పదార్థం...!


            జర్మనీలోని పరిశోధకులు ప్రపంచంలో అత్యంత బరువు తక్కువ పదార్థాన్ని రూపొందించారు. ఎరోగ్రాఫైట్‌ అనబడే ఈ కొత్త పదార్థం బోలుగా ఉండే కర్బన గొట్టాల కలయిక. ఇలా తయారైన పదార్థపు బరువు, ఒక ఘనపు సెంటీమీటర్‌కి కేవలం 0.2 మిల్లీగ్రాములు! ఇది 99.99 శాతం గాలే అయినా విద్యుత్‌ని సమర్థవంతంగా ప్రసారం చేస్తుంది. ఈ లక్షణం వలన దీనిని సూపర్‌ తేలిక బాటరీల తయారీలో వాడే అవకాశం మెండుగా ఉంది. ఈ పదార్థం చూడటానికి స్పాంజ్‌లా ఉంటుంది. దీనిని దాని పరిమాణంలో వెయ్యో వంతుకి కుంచింపజేసినా తిరిగి యథారూపానికి వస్తుందట! పైగా ఇది తన బరువుకన్నా 40,000 రెట్లు బరువును మోయగలదు.

భూమి మీది నీళ్ళు ఇక్కడే పుట్టాయి..!



        ఇంతకాలం భూగ్రహంపైన ఉన్న జలం ఎక్కడో బాహ్యాంత రాళంలో జనించిందని అనుకుంటున్నారు. కానీ, సౌర కుటుంబం నుండి ఊడిపడ్డ ఒక ఆస్టరాయిడ్‌ వల్ల భూగ్రహం మీద జలం ఉద్భవించి ఉండవచ్చని కొత్త అంచనా. భూమికి బాగా దగ్గర నుండిగానీ, అసలు భూమి మీదే కానీ ఏర్పడిన ఆస్టరాయిడ్‌ వల్ల నీరు పుట్టి వుండవచ్చని అంటున్నారు. బహుశ మార్స్‌, జూపిటర్‌ మధ్య ఉన్న ఆస్టరాయిడ్‌ వలయం నుండి ఆస్టరాయిడ్లు భూమిని తాకి నీటిని పుట్టించి వుండే అవకాశం వుంటుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా అంతరిక్ష పదార్థాలలోని నీటి మంచులో ఉండే డ్యుటీరియం మోతాదుని బట్టి అవి సౌర కుటుంబ తొలి దశలలో ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోవచ్చు. సూర్యుడి నుండి చాలా దూరంగా ఉన్న శకలాలలో అధిక మోతాదు డ్యుటీరియం ఉంటుంది. పరిశోధకులు అధ్యయనం చేసిన శకలాలలో తక్కువ డ్యుటీరియం ఉంది. కాబట్టి నీటి మూలం మన గ్రహానికి అతి దగ్గరిలోనే ఉందని భావిస్తున్నారు.

కళ్ళు నిజం చెప్పవు..!




          మానసిక వేత్తలు కళ్ళు నిజం చెబుతాయని అంటారు. మాట్లాడుతూ కుడివైపుకు కళ్ళు మళ్లిస్తే అబద్ధం చెప్పినట్టూ, ఎడమవైపుకి చూస్తే నిజం చెబుతున్నట్టూ భావిస్తారు. కానీ, ఎడింబర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధనలు అటువంటి కళ్ళ సిద్ధాంతం తప్పని తేల్చాయి. కంటికీ, ఆలోచనలకూ సంబంధం ఉందన్నది న్యూరో లింగ్విస్టిక్‌ ప్రోగ్రామింగ్‌లో ఒక భాగం. దీని ప్రకారం కుడి చేయి వాటం గలవాళ్ళు కుడివైపుకి చూస్తే వాళ్ళు చెప్పేది నిజం కాకపోవచ్చు. అదే వాళ్ళు ఎడమవైపు చూస్తే వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారని, కాబట్టి వాళ్ళు చెప్పేది నిజం అనీ అనుకుంటారు. అయితే అనేకరకాల పరీక్షల తరువాత కంటిచూపుకీ, చెప్పే విషయానికీ ఎటువంటి సంబంధమూ లేదని తేలింది. కాబట్టి, కళ్ళు నిజాలూ, అబద్ధాలూ చెప్పలేవు.

ఔషధం నుండి విషం!



           ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం కాస్త ఆందోళన కలిగించేదిగా ఉంది. రెండురకాల టీకాలను కలిపితే కొత్తరకం ప్రాణాంతక వైరస్‌ ఏర్పడుతుందట. కోళ్లలో అంటువ్యాధుల కోసం వాడే రెండురకాల టీకాలు అటువంటి ప్రమాదకర పరిస్థితిని కలిగిస్తాయని వీరు గుర్తించారు. ఒక వైరస్‌ కోళ్ల ముక్కులో నుండి రక్తం కారి మరణించే వ్యాధిని కలిగిస్తుంది. కానీ ఆ వ్యాధికి వాడే టీకానే ఆ మరణాలకు కారణం అని తెలుసుకున్నారు. రెండురకాల టీకాలను వ్యాధి నివారణకు వాడటం వలన మరణాలు సంభవించాయని వీరు నిర్ధారించారు. మామూలుగా కాస్త నిర్వీర్యమైన వైరస్‌లను టీకాలుగా వాడటం పరిపాటే. కానీ, ఈ కొత్త వైరస్‌ అసలు రెండు వైరస్‌ల కన్నా శక్తివంతమైనదట.

ఫ్లూటోకి ఐదో ఉపగ్రహం..!



            హబుల్‌ టెలిస్కోప్‌ మరో విశేషాన్ని గుర్తించింది. మరుగుజ్జు గ్రహంగా పిలిచే ఫ్లూటో చుట్టూ ఐదోచంద్రుడు ఉన్నట్టు గుర్తించింది. ఈ కొత్త చంద్రుడు పది నుండి 25 కిలోమీటర్ల వ్యాసంలో ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఫ్లూటో అంతటి చిన్న గోళం చుట్టూ ఇన్ని ఉపగ్రహాలు ఉండటం విశేషమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇంతవరకు ఫ్లూటో చుట్టూ శారన్‌, నిక్స్‌, హైడ్ర, పి4 అనే ఉపగ్రహాలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి తాజా ఉపగ్రహానికి పి5 అనే పేరు పెట్టారు. దీని చిత్రాలు ఈ రెండు నెలల్లో హబుల్‌ తీసింది. ప్రస్తుతం న్యూ హౌరైజాన్స్‌ అనే మానవ రహిత అంత రిక్ష నౌక ఫ్లూటో దరిదాపుల్లో ఉంది. మరో రెండు సంవత్సరాల్లో అది మరిన్ని వివరాలతో చిత్రాలను అందిస్తుందని ఆశిద్దాం..!

Wednesday 11 July 2012

17 గంటలు ఎగిరిన సౌర విమానం!



           కేవలం సౌరశక్తినే వాడుతూ ఎగిరిన విమానం పదిహేడు గంటలు ప్రయాణించింది. ఎయిర్‌బస్‌కి ఉండే రెక్కల పరిమాణంలో రెక్కలు ఉన్నా. ఈ సౌర విమానం బరువు 1600 కిలోలే. 'సోలార్‌ ఇంపల్స్‌' అని నామకరణం చేయబడ్డ ఈ విమానాన్ని బర్టాండ్‌ పికార్డ్‌, ఆండ్రి బార్ష్‌బర్గ్‌లు రూపొందించారు. దీనిలో 12000 ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌ (సోలార్‌ సెల్స్‌) రెక్కలపై అమర్చారు.

బరువు తగ్గాలంటే గుడ్డు తినాలట..!



          బరువు తగ్గాలనుకునేవారు 'రోజూ ఉదయాన్నే ఓ గుడ్డు తింటే చాలు' అంటున్నారు పరిశోధకులు. ఉడికించిగానీ, నూనెలో వేయించిగానీ.. ఏ రూపంలో తీసుకున్నా గుడ్డు చాలా సేపటివరకూ కడుపుకు నిండుగా ఉంచుతుందని యుకె పరిశోధనలు సూచిస్తున్నాయి. గుడ్లలోని ప్రత్యేక పదార్థాలు భోజనంతో తీసుకునే కాలరీల శరీర అందుబాటు నియంత్రణకు దోహదపడతాయట! ఈ పరిశోధనల్లో... రోజూ ఉదయాన్నే ఇతర అల్పాహారం తీసుకునే వారికన్నా గుడ్డు తినేవారిలో బరువు తగ్గుదల స్పష్టంగా కనిపించింది. పైగా గుడ్డు నుండి ఏ మోతాదులో కాలరీలు శరీరానికి అందుతున్నాయో కూడా తెలియడం వల్ల మేలు జరుగుతుందట! ఒక్కో గుడ్డులో సుమారు 78 కేలరీల శక్తి

ప్రాచీన పుష్పాలు..!


సైబీరియా ప్రాంతంలో లభించిన ఒక ప్రాచీన మొక్క తాలుకు ఫలం సుమారు 31,800 సంవత్సరాలు మంచుకింద నిక్షిప్తమై ఉందని గుర్తించారు. ఈ పండు నుండి శాస్త్రవేత్తలు కొత్త మొక్కలను సృష్టించారు. ఆ మొక్కలు పెరిగి తెల్లటి పూలను కూడా ఇచ్చాయి. అంతకాలం మంచుకింద ఉన్నా కూడా ఇంకా జీవకణాలు అలాగే ఉండటం ఆశ్చర్యపరిచింది. కొంతకాలం వరకూ కణాలను శీతలీకరించి, తిరిగి వాడటం ఇప్పుడు పరిపాటే. కానీ, దాదాపు నలభైవేల ఏళ్లనాటి పండులో సజీవకణాలు లభించడం కొత్త ప్రయోగాలకు దారితీసింది. ప్రస్తుతం ఉన్న మొక్కల విత్తనాలని ఈ విధంగా నిక్షిప్తం చేయడం ఆరంభించారు. భవిష్యత్తులో ఏదైనా జాతి అంతరించిపోతే, ఇలా భద్రపరిచిన గింజల నుండి మొక్కల్ని తిరిగి పునరుజ్జీవింప చేయవచ్చు.

కష్టసుఖాలకు కారణాలేంటి?


      ''పిిల్లలూ! మనకు వచ్చే కష్టాలకూ, సుఖా లకూ కారణాలు కొంతమంది విద్యా ర్థులు గతవారం చెప్పారు. ఇంకొందరు చెప్తానన్నారు వారు ఒక్కొక్కరూ చెప్పండి'' అన్నాను నేను.
''జుట్టు కత్తిరించుకొనే రోజునుబట్టి కూడా మన మంచి, చెడులు ఉంటాయని మా తాతయ్య చెప్పేవాడు మాస్టారూ. ఆయన శని, ఆదివారాల్లోనూ, పాడ్యమి, చవితి, షష్టి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమిరోజుల్లో క్షౌరం చేయించుకొంటే అరిష్టం అని, ఆ రోజుల్లో జుట్టు కత్తిరించుకో వడానికి సెలూన్‌కు వెళ్ళేవాడు కాదు. మిగి లిన రోజుల్లోనే వెళ్ళేవాడు'' అన్నాడు శ్రీను.
''మా తాతయ్య నిద్రలేవగానే వేద పండితుణ్ణిగానీ, ముత్తైదువ స్త్రీనిగానీ, గోవునుగానీ, అగ్నిహోత్రాన్నిగానీ చూస్తే శుభం కలుగుతుందనేవాడు. పెరుగు, నెయ్యీ ఆవాలూ, అద్దమూ వీటిని చూడటం అశుభమనేవాడ'' ని సంధ్య చెప్పింది.
''బల్లి మెడపైన పడితే ఆపదలు కల్గుతాయనీ, కనుబొమ్మలపై పడితే ధన లాభమనీ, మోకాలిపై పడితే వాహనం కొంటారనీ, జుట్టుమీద పడితే కష్టాలొస్తా యనీ మా ఇంట్లో పంచాంగంలో రాసి ఉంది'' అన్నాడు వెంకటాచారి.
''ఇంట్లోని పేడ, కసువు, పెంట, ఎంగి లినీళ్ళు ఉత్తర, ఈశాన్య, తూర్పుదిక్కుల్లో పోస్తే సంతానము నశిస్తుందని మా అమ్మ చెప్పి కసువుగానీ, ఎంగిలినీళ్ళుగానీ మిగిలిన దిక్కుల్లోనే పారబోయించేది. ఆ దిక్కుల్లో పో స్తే శుభాలు కలుగుతాయట'' శ్రీలక్ష్మి అంది.
''సంతోషం. మీరు చాలా అంశాలు చెప్పారు. వీటి గురించి వచ్చేవారం వివరిస్తా..''


ఇవన్నీ ఇంకా అనేక ఇతర అంశాలు 'తాళపత్ర నిధి'' అనే గ్రంథంలోనూ, 'గృహవాస్తు'లోనూ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మనం తలంటుకొనే రోజుకీ, మన ఇంట్లో తేనెతుట్టె ప్రదేశానికీ, అరటిచెట్టు ఉండే దిశకీ, అలాగే భోజనం చేసే వైపుకీ, జుట్టు కత్తిరించుకొనే తిథికీ, బల్లిపాటుకూ మనకు వచ్చే కష్టసుఖాలకీ సంబంధం ఉందని ఎలా నిరూపించగలం? ఇన్ని వందల సంవత్సరాల నుండి ఎవరైనా నిరూపించారా? మన సుఖాలకి అసలు కారణం 'ఆత్మవిశ్వాసంతో కూడిన తీవ్రమైన కృషి' అని సామాజిక శాస్త్రవేత్తలందరూ స్పష్టం చేశారు. విజయం సాధించిన మహానుభావులందరూ నిరూపించారు. ఇవి లోపించినపుడు కష్టాలు వస్తాయి. వాస్తవమిది కాగా ఆవరణలోని అరటిచెట్టుకీ, నిద్రలేవగానే కనిపించే వ్యక్తికీ, కసువు పారవేసే ప్రదేశానికీ సంబంధం ఉందని నమ్మడం మన అమాయకత్వం, మనలోని అశాస్త్రీయ ఆలోచనా విధానం. తేనెపట్టు పట్టిన ఇంట్లో నివాసం ఉండీ, మధ్యలో నుండి గెలపొడుచుకు వచ్చిన అరటి చెట్టును పెంచీ, తనకే కష్టమూ, నష్టమూ జరగలేదనీ, జరగదనీ నూరేళ్ళక్రితమే నిరూపించారు కందుకూరి వీరేశలింగం గారు. కాబట్టి మన జయాపజయాలకీ, ధననష్టం, ధనలాభాలకీ ఎంగిలినీళ్ళు ఆమూల పారబోయడమో, తీసివేసిన గోళ్ళు ఇంట్లో ఉండటమోలాంటి నిరూపణ చెయ్యలేని అంశాలు కారణమని నమ్మకండి. మన కృషి, పట్టుదలలే కారణమని నమ్మండి. ఇవన్నీ మూఢనమ్మకాలు. వాటిని వదలండి.
మన పెద్దలు చెప్పినట్లు 'కృషితో నాస్తి దుర్భిక్షం'; అంటే కృషితో వ్యక్తిగత దరిద్రాన్నే కాదు సామాజికంగా కరువును కూడా లేకుండా చేయవచ్చు'' అని ముగించాను.
ఒక్క నిమిషం నిశ్శబద్దం. తర్వాత సాయిలక్ష్మి లేచి ఇలా అడిగింది. 'మరి యీ మూఢనమ్మకాలు మన సమాజంలోకి ఎలా ప్రవేశించాయి మాస్టారూ?''
''మంచి ప్రశ్న వేశావమ్మా! దీనికి సమాధానం వచ్చే క్లాసులో చెబుతాను'' అన్నాను.
కె.ఎల్‌.కాంతారావు, జన విజ్ఞాన వేదిక.

దైవ కణాల ఆవిష్కరణ విషయాలేంటి?


'దైవ కణాల ఆవిష్కరణ' అంటూ ఈ మధ్య వార్తాపత్రికల్లో పతాక శీర్షికతో వార్తలు చూస్తున్నాము. ఈ విషయాల్ని కాస్త వివరిస్తారా?
- వి.కృష్ణ, రీసెర్చి స్కాలర్‌, నిట్‌, వరంగల్‌
మన విశ్వం సమస్తం పదార్థమయం. శక్తి (energy) కూడా పదార్థపు ఓ స్వరూపమే! విశ్వం పర్యంతం పదార్థమే అని శాస్త్రీయంగా వాదించే వారిని 'భౌతికవాదులు (materialists) అంటాము. 'విశ్వంలో ఏమీ లేదు. ఉన్నదనుకుంటున్నదంతా భ్రమ.' అని అశాస్త్రీయంగా వల్లెవేస్తే వారిని భావవాదులు (idealists) అంటాము. విజ్ఞానశాస్త్రం మొత్తం భౌతికవాదుల డైరీ. ఈ భౌతికవాదం ప్రకారం విశ్వానికి ఆది అంతం (beginning and end) అంటూ ఏమీ ఉండవు. మార్పులు (change) మాత్రమే ఉంటాయి. ఒక రూపం (shape), వర్ణన (description), గుణం (quality) నుంచి మరో రూపం వర్ణం, లక్షణం (character), గుణం సంతరించుకొనేలా ఈ మార్పులు ఉంటాయి. ఈ మార్పులన్నింటిలో కొన్ని నిబంధనలున్నాయి. వాటినే నిత్యత్వ నియమాలు (laws of Conservation) అంటారు. ఇలాంటి నిత్యత్వ నియమాల్లో అత్యంత ప్రధానమైనవి మూడున్నాయి. (1) ద్రవ్యశక్తి నిత్యత్వం (Law of Conservation of Mass-Energy). (2) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం (Law of Conservation of Angular Momentum); (3) విద్యుదావేశ తటస్థతా నిత్యత్వం (Law of Conservation of charge Neutrality). వీటిలో మొదటిది అందరికీ చిరపరిచితమే. ఏదైనా ఒక స్వేచ్ఛా వ్యవస్థ (isolated system) లో ఒక సంఘటన జరిగినపుడు ఆ సంఘటనకు ముందు ఆ వ్యవస్థలో ఉన్న ద్రవ్యం (mass +energy) ల నికర విలువ ఎంతయితే ఉందో సంఘటన తర్వాత కూడా అంతే ఉంటుంది. ఆ నికర విలువలో ఏమాత్రం మార్పు ఉండదు. ఇక రెండవ నియమం ప్రకారం అదే వ్యవస్థలో సంఘటనకు మునుపున్న నికర కోణీయ ద్రవ్యవేగం, సంఘటన తర్వాత నికర కోణీయ ద్రవ్యవేగానికి సమానం.... అంటే సంఘటనలలో కోణీయ ద్రవ్యవేగం విలువ మారదు. కోణీయ ద్రవ్యవేగం అంటే ఏమిటో సపరేటుగా తెలుసుకోండి. భ్రమించే (rotational motion) ప్రతి వ్యవస్థకు కోణీయ ద్రవ్యవేగం ఉంటుంది. ఇక మూడవ నియమం కూడా సులభంగానే అర్థంచేసుకోగలం. విద్యుదావేశం నికర విలువ సంఘటనల వలన మారదు. ముందు ఎంత ఉందో సంఘటన తర్వాతా అంతే ఉంటుందన్న మాట. నిత్యత్వసూత్రాలు సంఘటనలలో విధిగా అమలవుతాయి. ఇది విశ్వ సార్వత్రిక నియమం (universal law). ఇది ఒక విషయం.
మరో విషయం ఏమిటంటే భాషలో అక్షరమాల ఉన్నట్లే విశ్వమనే ఈ పెద్ద వాఙ్మయంలో అత్యంత ప్రాథమికమైన కణాలు (ultra fundamental particles) ఏమిటి? ఉదాహరణకు మనం తినే కోడిగుడ్డు సొనను, బియ్యాన్ని, తాగేనీటిని, పీల్చేగాలిని, జ్వరం వస్తే వేసుకొనే పారాసిటమాల్‌ మాత్రను తీసుకుందాం. తెల్లసొన ఓ పెద్ద ప్రోటీను అణువు (macro molecule). అందులో కర్బనం (C), హైడ్రోజన్‌ (H), నత్రజని (Nitrogen, N), ఆక్సిజన్‌ (O), గంథకం (Sulfur, S) ఉన్నాయి. అంటేPRAJASAKTHI పదంలో A, H, I, J, K, P, R, Sఅనే అక్షరాలున్నట్టే గుడ్డుసొనలో C,H,N,S,O అనే పరమాణువులు ప్రత్యేకరీతిలో సంధానించుకొని అణురూపంలో ఉన్నాయన్నమాట. అలాగే మనం తినే బియ్యం కార్బోహైడ్రేటు. అందులో కర్బనం, ఉదజని (hydrogen), ఆమ్లజని (oxygen) ఉన్నాయి. తాగేనీటిలో ఆమ్లజని, ఉదజని మాత్రమే ఉన్నాయి. పీల్చేగాలిలో మనకు ఉపయోగపడే వాయువు ఆక్సిజన్‌. ఇందులో O2 అనే రూపంలో కేవలం ఆక్సిజన్‌ పరమాణువులే ఉన్నాయి. ఆక్సిజన్‌ మూలకం, పారాసిటమాల్‌ సంయోగపదార్థం. ఒకే విధమైన పరమాణువులు పదార్థమంతా వ్యాపించి ఉంటే దాన్నే మూలకం (element) అంటాం. పదార్థంలో ఒకే విధమైన పరమాణు బృందాలు (వీటిని అణువులు లేదా molecules అంటాము) ఉంటే అవి సంయోగ పదార్థాలు (compounds). పారాసిటమాల్‌లో కర్బనం, ఉదజని, నత్రజని, ఆమ్లజని ప్రత్యేక బృందంగా ఉంటాయి. కాబట్టి మూలకాలయినా, సంయోగ పదార్థాలయినా అవి పరమాణువుల చేత నిర్మించబడ్డాయన్న మాట. ఇలాంటి వివిధరకాల పరమాణువులు స్థిరరూపంలో మనకు సుమారు 100 వరకు తెలిసినా అస్థిరంగా ఉన్న వాటిని కూడా లెక్కిస్తే సుమారు 118 వరకు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటికి రకరకాల పేర్లున్నాయి. రాగిని కాపర్‌ అన్నట్లే, బంగారాన్ని ఆరియం అన్నట్లే, టంగ్‌స్టన్‌ను ఓల్ఫ్రం (wolfrum) అంటారు.
మరి పరమాణువుల లోపల ఏమున్నాయి? 18, 19 శతాబ్దాలకాలంలో ప్రముఖుడైన జాన్‌డాల్టన్‌ (1766-1844) అనే శాస్త్రవేత్త పరమాణువుల లోపల ఏముందో తెలుసుకోవడం కష్టం అన్నాడు. పరమాణువులు అభేద్యాలు (unbreakable) అన్నాడు. కానీ అదే 19వ శతాబ్దపు అద్భుత శాస్త్రవేత్త మైఖేల్‌ ఫార్‌డే (1791-1867) చేసిన విద్యుద్విశ్లేషణ (electrolysis) ప్రయోగాల ద్వారా పదార్థాలలో విద్యుదావేశం (electrical charge) మోస్తున్న ప్రాథమిక కణాలున్నాయని ఋజువు చేశాడు. పరమాణువులు విద్యుత్తుపరంగా తటస్థం (neutral). మరి విద్యుదావేశాన్ని మోస్తున్నదెవరు? ఈ ప్రశ్నకు సమాధానమొక్కటే. పరమాణువులోనే ధన విద్యుత్‌ను, ఋణ విద్యుత్‌ను సరిసమానంగా మోస్తున్న అంతర్గత (internal) కణాలున్నాయనడం. అంటే పరమాణువు అభేద్యం కాదని అది భేద్యం (breakable) అనీ అర్థమైంది. 19వ శతాబ్దాంతంలోను, 20వ శతాబ్దపు తొలిదశలోనూ జరిగిన ప్రయోగాల ద్వారా పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనే వివిధరకాల ప్రాథమిక కణాలున్నట్లు స్పష్టమైన ఋజువులు చేకూరాయి. ఇంతేనా? ఈ మూడేనా? ఆ తదుపరి ప్రయోగాల ద్వారా పదార్థాలలో ఈ మూడింటితో పాటు సుమారు 60 వరకు ఇతరరకాల కణాలు విశ్వంలో ఉన్నట్లు కచ్ఛితమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఎన్నోరకాల పరమాణువుల లోపల ప్రధానంగా ప్రోటాన్లు, న్యూట్రాన్లు, హేడ్రాన్లు, ఎప్సిలాన్లు అనబడే పెద్ద ప్రాథమికకణాల్లో మరిన్ని చిన్న ప్రాథమిక కణాలున్నాయా? అవుననే ఆధునిక క్వాంటం క్రోమోడైనమిక్స్‌ (QCD) అనే శాస్త్రం చెబుతోంది. అన్నిరకాల ప్రాథమికకణాలలో ఉన్నది కేవలం 6 క్వార్కులు, 6 లెప్టాన్లు, 4 బలధారణ (force carriers) బోసాన్లు అని 1964 వరకు తేలింది. అయితే 1964 సంవత్సరంలో పీటర్‌ హిగ్స్‌ (1929-) అనే సమకాలీన బ్రిటిష్‌ శాస్త్రవేత్త తన అద్భుత సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనల ద్వారా ఓ విషయం బయటపెట్టాడు. సుమారు 9500 కోట్ల కాంతి సంవత్సరాల వ్యాసం మేర విస్తరించి ఉన్న ఈ విశాల విశ్వంలో ఈ 16 రకాల కణాలు దాదాపు 2.5 × 1089 (అంటే 25 పక్కన 88 సున్నాలు వేయాలి) ఉన్నా వాటి మొత్తం ద్రవ్యరాశి మనకు తెలిసిన విశ్వ ద్రవ్యరాశిలో కేవలం 4 శాతం వరకే లెక్కతేలుతోంది. అంటే మిగిలిన 96 శాతం ద్రవ్యరాశిని మోస్తున్న అదృశ్య కణాలేవో ఉండి తీరాలని సైద్ధాంతికంగా ఋజువు చేశాడు. ఆ అదృశ్యకణాలే గూఢ ద్రవ్యరాశి (dark matter) కి ఆధారమన్నాడు. ఆ అదృశ్యకణాల లక్షణాలను కూడా తేల్చాడు. అవి బోసాన్ల తరహా కణాలన్నాడు. వాటినే శాస్త్రీయంగా హిగ్స్‌ బోసాన్‌ కణాలంటున్నారు. కనిపించని కణాలు కాబట్టి వాటిని 'దైవ కణాలు (God particles)' అని మరికొందరు పేర్కొంటున్నారు. పరమ నాస్తికుడైన పీటర్‌ హిగ్స్‌కు ఈ పేరుతో ఆ కణాల్ని పిలవడం అంతగా రుచించకపోయినా ఆయన ప్రతిపాదనల్నిLHC (Large Headron Collider) లేదా బిగ్‌బ్యాంగ్‌ ప్రయోగం దాదాపు ఖరారు చేసింది. హిగ్స్‌ బోసాన్‌ కణాల ఉనికి దాదాపు ఋజువైంది. ఆ ప్రయోగం ద్వారా విశ్వరహస్యాలు బోధపడే అవకాశం ఉంది. ఆ వివరాలు త్వరలో తెలుసుకుందాము.


ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

విశ్వావిర్భావం.. రహస్యాలు..




              కంటికి కనిపించని, స్వతంత్ర అస్తిత్వంలేని పరమాణువులో ఒక కొత్త 'ఉపకణా'న్ని కనుగొన్నట్టు ఈ నెల 4వ తేదీన శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఇది 99 శాతానికిపైగా 'హిగ్స్‌బోసన్‌' అనే 'ఉపకణం'తో పోలి వున్నట్లు హర్షాతిరేకాలతో ప్రకటించారు. తద్వారా విశ్వావిర్భావాన్ని తెలుసుకోవడంలో మరో ముందడుగు వేసినట్లు వీరు భావిస్తున్నారు. పరమాణు భారాన్ని, ఆకారాన్ని నిర్ధారించడంలో ఈ 'ఉపకణాని'కి కీలకపాత్ర ఉంది. విశ్వం అతి పెద్దది, విస్తృతమైంది. అందువల్ల, విశ్వరహస్యాలకూ, పరమాణు నిర్మాణానికీ వున్న సారూప్యతను, సంబంధాల్ని తెలుసుకోవాలి. ఇలా కొత్తగా గుర్తించిన 'ఉపకణం' 'హిగ్స్‌బోసన్‌ ఉపకణా'న్ని పోలి ఉన్నట్లు శాస్త్రజ్ఞులు చెప్తుండగా, విశ్వావిర్భావానికి మూలమైన 'దైవ కణ' రహస్యాన్ని ఛేదించినట్లు మరికొంతమంది చెప్తున్నారు. విశ్వంలోని అన్ని అంశాలకూ సృష్టికర్త సిద్ధాంతాన్ని ఆపాదిస్తున్నవారు (వీరు ఏదో ఒక మతవిశ్వాసంగలవారు) శాస్త్రజ్ఞులు ఇప్పుడు గుర్తించిన దాన్ని సృష్టికర్త ఇంతకుముందే సృష్టించారని, ఇది మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసని, అదనంగా తెలుసుకునేదేమీ లేదనీ చెప్తున్నారు. ఇది మన సృష్టికర్త ఎంత తెలివైనవాడో మరోసారి ఋజువు చేస్తుందనీ అంటున్నారు. శాస్త్రజ్ఞులు మాత్రం కొత్తగా గుర్తించిన 'ఉపకణం' మన విజ్ఞానాన్ని ఏమేర మరో పైమెట్టుకు తీసుకుపోగలుగుతుంది? దీనివల్ల ముందుకొస్తున్న సమస్యలేమిటి? ఈ విజ్ఞానం ఆధారంగా విశ్వరహస్యాల్ని తెలుసుకోడానికి మరింతగా ఎలాంటి పరిశోధనలు కొనసాగించాలి? అనే విశ్లేషణలో పడిపోయారు. ఈ నేపథ్యంలో... విశ్వావిర్భావ రహస్యాలకు, కొనసాగుతున్న 'ఉపకణ' పరిశోధ నలకు గల సంబంధాల్ని 'ప్రొ|| అరిబండి ప్రసాదరావు, డా|| బి.ఆర్‌.కె.రెడ్డి' సంయుక్త సహకారంతో మూడు భాగాలతో మీకు అందిస్తోంది 'విజ్ఞానవీచిక'. వీటిలో మొదటిభాగం ఈ వారం మీకోసం.
భూగోళం మొదలుకొని అంతరిక్షం మొత్తాన్ని కలిపి వర్ణించడానికి ''విశ్వం (యూనివర్స్‌)'' అనే పదాన్ని వాడుతున్నాం. దీనిలో లెక్కించలేనన్ని నక్షత్రాలు, సూర్యుళ్లు, సౌరకుటుంబాలు, పాలపుంతలు ఉన్నాయి. సమీప సౌరకుటుంబంలో భాగమైన భూగోళం విశ్వంలో అతి చిన్న భాగం. ఇపుడు భూమ్మీద చూస్తున్న కొన్ని నక్షత్రాల వెలుగు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం బయల్దేరినది. భూమి నుండి వీటి దూరాల్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తాం. కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి కిరణం ప్రయాణించే దూరం. ఇది సుమారు 9.4436 లక్షల కోట్ల కిలోమీటర్లకు సమానం.
మన చిన్న భూగోళంలోని పదార్థం అణువులు, పరమాణువులతో నిర్మితమైంది. పరమాణువులు నేరుగా రసాయనికమార్పులలో భాగస్వామ్యమవుతాయి. తద్వారా కొత్త అణువులు.. పదార్థ రూపకల్పనకు దారితీస్తుంది. భిన్న అణువుల కలియక పదా ర్థ భౌతిక ధర్మాలను నిర్ధారిస్తాయి. ఒక భవన నిర్మాణంలో ఇటుకల పాత్ర ఎలాంటిదో మన విశ్వావిర్భావం, నిర్మాణంలో పరమాణువుల పాత్ర కూడా అలాంటిదే. పరమాణువుల్లోని ఉపకణా లను అధ్యయనం చేస్తూ విశ్వావిర్భావ రహస్యాలను తెలుసుకొనే ప్రయత్నం గత ఐదారు దశాబ్దాలుగా చేస్తున్నారు. దీనిలో భాగమే ఇప్పుడు కొనసాగుతున్న 'లార్జ్‌ హెడ్రాన్‌ కొల్లిడర్‌' పరమాణు ఉపకణ పరిశోధనలు.
విభిన్నరంగాల్లో సమకూర్చుకున్న విజ్ఞానం పరమాణువు ఉపకణాల గుర్తింపుకు తోడ్పడుతుంది. పైకి చూడటానికి, ఈ విజ్ఞానం రసాయనిక, భౌతిక శాస్త్రాలుగా.. లెక్కలుగా.. పరమాణు విజ్ఞానంగా.. టెలిస్కోపు.. కాంతిపుంజ విజ్ఞానంగా (స్పెక్ట్రో స్కోపి)... విద్యుదయస్కాంత శక్తిగా... అంతరిక్ష విజ్ఞానంగా కనిపిస్తాయి. ఈ వర్గీ కరణ మన అవగాహనా సౌలభ్యం కోసం ఏర్పర్చుకున్నవి. ఉన్నతస్థాయిలో ఇవన్నీ ఒకదానితో ఒకటి మేళవిస్తాయి. వేర్వేరుగా వీటిని ఎల్లప్పుడూ గుర్తించలేం. ఇంత వైవిధ్యమైన విజ్ఞానంలో ఏ ఒక్కరూ పూర్తిగా నిష్ణాతులుగా ఉండలేని స్థితి. అందు వల్ల, ఇప్పటి పరమాణువు ఉపకణాల గుర్తింపు ప్రయోగాల్లో విభిన్న విజ్ఞాన శాస్త్ర జ్ఞులు 5,100 మంది రెండు బృందాలుగా ఏర్పడి, వేర్వేరుగా కృషి చేస్తున్నారు. మన దేశంతో సహా ఎన్నోదేశాల శాస్త్రజ్ఞుల సమన్వయంతో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఆవిర్భావం..
మానవునికి ఊహ తెలిసినప్పటి నుండీ తను, తన పరిసరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ఫలితంగా మానవ విజ్ఞాన అవగాహన విస్తృతమవుతూ వచ్చింది. మొదట భూమి కేంద్రంగా దానిచుట్టూ సూర్యుడు, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని భావించాడు. త్వరలోనే ఇది తప్పని, సూర్యుని కేంద్రంగా సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని గ్రహించాడు. నూతన సాంకేతిక ఆవిష్కరణలు జరుగుతున్నకొద్దీ సౌర కుటుంబం కన్నా ఇంకా విస్తృతమైన ప్రపంచం వెలుపల ఉందని గ్రహించాడు. టెలిస్కోపు ఆవిష్కరణ, శాటిలైట్‌ విజ్ఞానం, స్పెక్ట్రోస్కోపు ద్వారా అంతరిక్షయానం, పరిశోధనలు, సాధించిన విజయాలు మానవుని విజ్ఞానాన్ని ఎన్నోరెట్లు విస్తృత పరిచాయి. ఫలితంగా తాను నివసిస్తున్న భూమి చాలా చిన్నదని, దీనికన్నా సౌర కుటుంబం (సూర్యుడు, సూర్యగ్రహాలు) చాలా పెద్దదని, అంతకన్నా అవతల నక్షత్రాలు, పాలపుంతలు, సౌరకుటుంబాలు లెక్కించలేని విధంగా ఉన్నాయని గ్రహించాడు. 'విశ్వం' అవగాహన ఇలా ఆవిర్భవించి, రూపొందింది.
ఈ ప్రక్రియలో విశ్వావిర్భావంపై దృష్టి మళ్లింది. గతంలో జరిగిన మార్పుల్ని, అందుబాటులో ఉన్న విజ్ఞానం ఆధారంగా విశ్వాన్ని అర్థంచేసుకునే ప్రయత్నం చేశాడు. ఊహించి నమూనాలను తయారుచేసుకున్నాడు. ఇలా వచ్చిన నమూనాల్లో 'మహా విస్ఫోటనం' నమూనా ముఖ్యమైంది. దీని ఆధారంగా రూపొందించుకున్న విశ్వ నిర్మాణం సరైనదని ఆ తర్వాత జరిగిన ప్రయోగాల ద్వారా గుర్తించాడు. తద్వారా 'మహా విస్ఫోటనం' నమూనా 'మహా విస్ఫోటనం సిద్ధాంతంగా (బిగ్‌బ్యాంగ్‌ థియరీ)' మార్పు చెందింది. ఇదిప్పుడు అందరూ అంగీకరిస్తున్న సిద్ధాంతం.
ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం ప్రారంభంలో ఒకే ముద్దగా, ఎంతో వేడితో, సాంద్రతతో ఉండేది. దీనిలో జరిగిన అంతర్గతశక్తుల మార్పుల వల్ల ఇది ఒకేసారి పెద్ద విస్ఫోటనంతో వ్యాకోచించింది. ఆ తర్వాత ఇది సెకనులో కొన్ని వందల కోట్ల వంతులో వెంటనే చల్లారింది. ఈ సిద్ధాంతం ఆధారంగా విశ్వం ప్రారంభాన్ని అంచనా వేయగలిగారు. దీని ఆధారంగా 1375 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైనట్లు అంచనా వేశారు.
ముద్దగా వున్న విశ్వం విస్ఫోటనం చెంది, ఆ వెంటనే చల్లారే సమయంలో 'శక్తి' వివిధ పరమాణు ఉపకణాలు (ప్రోటాన్లు, న్యూట్రాన్లు) గా ఘనీభవించింది. మొదట ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఏర్పడ్డాయి. ఇవి కలిసి మొదటి పరమాణువు కేంద్రకం రూపుదిద్దుకుంది. ఇది కొద్ది నిమిషాల్లోనే జరిగింది. కానీ, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఎలక్ట్రాన్లు కేంద్రకాలతో కలిపి, విద్యుత్‌పరంగా తటస్థ (న్యూట్రల్‌) పరమాణువులుగా రూపుదిద్దుకున్నాయి. ఈ విధంగా, మొదట హైడ్రోజన్‌ పరమాణువులు, హీలియం, లిథియం పరమాణువులు ఏర్పడ్డాయి. ఈ ప్రాథమిక అణువులు కలిసి గురుత్వాకర్షణ శక్తితో నక్షత్రాలు, పాలపుంతలుగా రూపొందాయి. భారమైన మూలకాలు (హెవీ ఎలిమెంట్స్‌) నక్షత్రాలలో రూపొందాయి.
ఇలా ఊహించిన విశ్వావిర్భావాన్ని నిర్ధారించడానికి 'మహా విస్ఫోటన సిద్ధాంతంపై ఆ తర్వాత ఎన్నో పరీక్షలు జరిగాయి. ఇలా జరిగిన పరీక్షలన్నీ ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించాయి. ఎన్నో విశ్వరహస్యాలను తెలుసుకోగలిగాం. ఖగోళ శాస్త్రజ్ఞులు గమనిస్తున్న అన్ని మౌలిక
సూత్రాలు ఈ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నాయి.
ఎలా సాధ్యమైంది..?
విశ్వంలో అతి చిన్న భాగంగా ఉన్న భూగోళం మీద ఉంటూ ఎన్నో వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో గల నక్షత్రాలలోని 'రసాయనిక పదార్థాల్ని' ఎలా గుర్తించగలిగారు? అని ఆశ్చర్యపోతాం. వీటి నుండి వెలువడిన 'కాంతిపుంజ' విశ్లేషణ ద్వారానే ఇది సాధ్యపడింది. ఎంతో సామర్థ్యం కలిగి, ప్రత్యేకంగా రూపొందించిన స్పెక్ట్రోస్కోపు, రేడియోథార్మిక స్పెక్ట్రోస్కోపు పరికరాల ద్వారా ఈ గుర్తింపు వీలైంది. ఈ పరికరాలకు మూల సిద్ధాంతం మన భారతీయుడు సర్‌ సి.వి.రామన్‌ కనుగొన్న కాంతి (విద్యుదయస్కాంత శక్తి) పుంజ వర్ణపటకం (స్పెక్ట్రమ్‌) సిద్ధాంతమే ఆధారం. తెల్లగా కనిపించే కాంతి ఇంద్రధనస్సులో ఏడురంగుల కలయిక అనేది దీని సారాంశం. ఇది తెలుసుకొని మనకి ఒకింత గర్వంగా లేదూ?
మూలకాలు.. పదార్థ రూపకల్పన..
మహావిస్ఫోటన వల్ల విడుదలైన బ్రహ్మండమైన శక్తి నుండి ఏర్పడిన పరమాణువులు భిన్న కలయిక ద్వారా 'మూలకాలు' (ఎలిమెంట్స్‌) ఏర్పడతాయి. ఇంతవరకు శాస్త్రజ్ఞులు 118 మూలకాలను గుర్తించారు. కానీ, వీటిలో స్థిరమైనవి సుమారు వంద మాత్రమే. కొన్ని మూలకాల భిన్న కలయికల వల్ల విశ్వంలో ఎంతో వైవిధ్యభరితమైన లక్షలాది పదార్థాలు ఏర్పడ్డాయి. వీటి ఏర్పాటుకు దోహదపడే పరిస్థితులు భౌతిక, రసాయనిక, భూగోళ శాస్త్రాల ద్వారా తెలుసుకుంటాం. వీటిలో కొన్ని ఉదాహరణలు.. ఈ పేజీలోని 'ఎందుకని? ఇందుకని!' శీర్షిక కింద ఇచ్చిన సమాధానంలో గమనించగలరు.
మీకు తెలుసా..?
* 'బిగ్‌బ్యాంగ్‌' అనే పదాన్ని ఫ్రెడ్‌ హౌయల్‌ అనే శాస్త్రజ్ఞుడు 1949లో మొదట వాడాడు.
* ప్రతి సెకనుకు కాంతి 3 కోట్ల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంతకంటే మరేదీ వేగంగా ప్రయాణించలేదని 'అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌' సిద్ధాంతం తెలుపుతుంది.

'బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతా'న్ని 'జార్జి లెమైత్రి' ప్రతిపాదించాడు. 'మహావిస్ఫోటన నమూనా చట్రం' ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది. దీని ప్రకారం విశ్వం క్రమంగా విస్తరిస్తూ చల్లబడుతుంది. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. నేడు చూస్తున్న 'విశ్వం' దీని ఫలితమే.
సిద్ధాంత మౌలికపరీక్ష..
మహావిస్ఫోటన సమయంలో విడుదలైన బ్రహ్మాండమైన శక్తి అతికొద్ది సమయంలో (సెకన్‌లో కొన్ని వందల కోట్ల వంతు) చల్లబడుతుంది. ఈ సమయంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు తదితర పరమాణు ఉపకణాలు, కణాలు ఏర్పడతాయనేది సిద్ధాంతంలో కీలకభాగం. శక్తి ఘనీభవించి పదార్థం ఏర్పడుతుంది. పదార్థాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు శక్తి విడుదలవుతుందనే అవగాహనకు ఇది అనువుగా ఉంది. దీన్ని ఋజువు చేయడానికి ఇంతవరకూ పరోక్ష సాక్ష్యాలపై ఆధారపడుతున్నారు. ఈ సిద్ధాంత మౌలికభాగాన్ని నేరుగా పరీక్షకు గురిచేసి, సాక్ష్యాలు సేకరించడానికి లార్జ్‌ హెడ్రాన్‌ కొల్లిడర్‌ ప్రయోగాలు ప్రారంభమైనాయి. ఈ ప్రయోగాల్లో కాంతి వేగంతో ప్రోటాన్లను ఢకొీనేలా చేస్తారు. ఇలా జరిగినప్పుడు విడుదలైన శక్తి, పరిస్థితులు మహావిస్ఫోటన సమయంలో ఏర్పడిన పరిస్థితులను పోలి వుంటాయి. ఈ పరిస్థితుల్లో చల్లారి, ఘనీభవించే సమయంలో ఏర్పడే పరమాణు ఉపకణాలను గుర్తించి, విశ్వావిర్భావానికి అవసరమైన సాక్ష్యాలను సేకరించడం ఈ ప్రయోగాల లక్ష్యం. ఈ ప్రయోగాల ఫలితంగా ఇపుడు హిగ్స్‌ బోసాన్‌ ఉపకణానికి అత్యంత సమీపంగా ఉన్న ఒక కొత్త పరమాణు ఉపకణాన్ని గుర్తించారు.

Sunday 8 July 2012

పల్లెసీమల్లో చైతన్యం





          ప్లాస్టిక్ పూలతో తోరణాలు.. రంగురంగుల బెలూన్లతో అలంకరణ.. ఆ ఇంట్లోనే కాదు, ఆ ఊరంతా మహిళల సందడే.. ఇదంతా గృహ ప్రవేశ సందర్భం కాదు, పండగ సమయం అంతకన్నా కాదు.. ఓ టాయిలెట్‌కు ప్రారంభోత్సవ హంగామా ఇది. టాయిలెట్ లేనిదే అత్తవారింట అడుగుపెట్టేది లేదని ఓ నవ వధువు తన పంతం నెగ్గించుకున్న సందర్భం ఇది. ఈమె పట్టుదలకు గ్రామంలోని మహిళలంతా మొదట విస్మయం చెందినా ఆ తర్వాత మనసారా అభినందించారు.

          గ్రామీణ మహిళల సాధికారతకు ఈ సంఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అధికారులు సైతం కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా విష్ణుపూర్‌లో అత్తవారింట్లో టాయిలెట్ లేదని తెలిసి నవ వధువు ప్రియాంక భర్తతో వెళ్లేందుకు నిరాకరించింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయలు స్థలానికి వెళ్లాలంటే అది మహిళలకు అవమానకరమేనని ఆమె భావించింది. పరిశుభ్రత పాటించకపోవడం వల్లే రోగాల బారిన పడుతున్నామని చెబుతూ ఇతర మహిళల్లో ఆమె చైతన్యం తెచ్చింది. ఈమె పోరాటం గురించి ఆ నోటా, ఈనోటా తెలిశాక ‘సులభ్’ సంస్థ టాయిలెట్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసింది. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రియాంక దీక్ష అందరికీ స్ఫూర్తిదాయకమని ‘సులభ్’ ప్రతినిధులు ప్రశంసించారు. కొద్దిరోజుల క్రితం ప్రియాంక ఇంట్లో నిర్మించిన టాయిలెట్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రియాంకకు అందజేశారు. టాయిలెట్ కోసం ఇంతగా పోరాటం చేస్తానని తాను కూడా మొదట అనుకోలేదని, అయితే తన పుట్టింట్లో మహిళలంతా పరిస్థితులకు ఎదురీదే స్వభావం కలిగినందున తనలో ఇంత తెగువ వచ్చిందని ప్రియాంక చెబుతోంది. తనకు రెండు లక్షల రూపాయల బహుమతి వచ్చిందంటే నమ్మలేక పోయానని ఆమె విస్మయం వ్యక్తం చేసింది. ఈమెకు చిన్న వయసులోనే పెద్దలు పెళ్లి చేశారు. ఈ ఏడాది మే నెలలో 19వ ఏట అడుగుపెట్టడంతో అత్తవారింటికి తీసుకుని వెళ్లేందుకు భర్త వచ్చినపుడు టాయిలెట్ గురించి ప్రియాంక ప్రశ్నించింది. పెద్దల వత్తిడితో భర్త వెంట వెళ్ళినా, అత్తవారింట ఆమె నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈలోగా తనను చూసేందుకు వచ్చిన పుట్టింటివారితో టాయిలెట్ సమస్య గురించి ప్రస్తావించింది. బహిర్భూమికి వెళ్లాలంటే చాలా అవమానకరంగా ఉందని, అత్తవారింట టాయిలెట్ నిర్మిస్తే తప్ప అడుగుపెట్టనని శపథం చేసింది.
తన నిర్ణయం తల్లిదండ్రులకు ఆగ్రహం కలిగించినా ఆమె చలించిపోలేదు. సడలని దీక్షతో తన పంతం నెగ్గించుకుంది. టాయిలెట్ నిర్మించడంతో ప్రియాంక తిరిగి తన వద్దకు చేరుకుందని ఆమె భర్త అమర్‌జీత్ ఆనందం వ్యక్తం చేశాడు. తన ఇంట్లో అడుగుపెట్టినపుడు- ‘టాయిలెట్ ఎక్కడ?’ అని భార్య ప్రశ్నించినపుడు సమాధానం చెప్పలేక తానెంతో ఇబ్బంది పడ్డానని ఆయన వివరించాడు. తన భార్య కారణంగా తమ ఊరుకు గుర్తింపు వచ్చిందని, అందరిలో ఆమె బహుమతి అందుకోవడం తనకు గర్వకారణంగా ఉందని ఆయన చెప్పాడు.
కనీస హక్కుగా..
టాయిలెట్లు లేకపోవడం ఇప్పటికీ పల్లెల్లో మహిళలకు పెనుశాపంగా మారంది. ఆరోగ్యం, పరిశుభ్రత, కనీస హక్కుల విషయాల్లో మహిళల దీనస్థితి ఇంకా కొనసాగుతోంది. ఆధునిక జీవన విధానం తమకూ దక్కాలని ప్రియాంక లాంటి మహిళలు అక్కడక్కడా గళం విప్పి ఘోషిస్తున్నా, ఇంకా వందలాది గ్రామాల్లో మహిళలు అపరిశుభ్ర పరిస్థితులతోనే సహజీవనం సాగిస్తున్నారు. ఉదయానే్న చీకట్లు తొలగకముందు లేదా సాయంత్రం చీకటి పడ్డాక గ్రామాల్లో మహిళలు బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని, ఇందుకోసం ఒక్కోసారి గంటల తరబడి నీరిక్షాంచాల్సి వస్తున్నందున వారు వ్యాధుల బారిన పడుతున్నారని ‘సులభ్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ అంటున్నారు. టాయిలెట్ల సమస్యపై ఆవేదన చెందడం కాదు, పల్లెల్లో బహిరంగంగా చర్చించాలని ఆయన కోరుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా తాము చేస్తున్న ప్రచారం వల్ల పల్లెల్లో కొంత మార్పు కనిపిస్తోందన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినందుకే ప్రియాంకతో పాటు మరో ఇద్దరు నవ వధువులకు తాము నగదు పారితోషికాలను అందజేశామని ఆయన వివరించారు. వీరి విజయగాథలు ఇతరులకు మార్గదర్శకం కావాలన్నారు.
ఇక్కడా అవినీతే..
దేశంలో ఇప్పటికీ 60 నుంచి 70 శాతం మహిళలు మరుగుదొడ్ల సమస్యతో బాధ పడడం జాతి సిగ్గు పడాల్సిన విషయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్ పదే పదే చెబుతుంటారు. మహిళలు సెల్‌ఫోన్లు కాదు టాయిలెట్లు కావాలని అడగాలని, క్షిపణులను ప్రయోగించడం కన్నా టాయిలెట్లు కట్టడం గర్వకారణమని కూడా ఆయన సెలవిస్తుంటారు.
కాగా- వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నా, నిధులను దుర్వినియోగం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పథకాల్లో అధికారుల అవినీతి కారణంగానే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో వేలాది టాయిలెట్లను నిర్మించాల్సి ఉండగా నిర్ణీత లక్ష్యాలు నేటికీ పూర్తి కాలేదు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 131 మిలియన్ ఇళ్లలో టాయిలెట్ సౌకర్యం లేదు. 8 మిలియన్ల మంది మాత్రమే సామాజిక మరుగుదొడ్లను వాడుతున్నారు. 123 మిలియన్ల మంది ఆరుబయలు స్థలాలకు పోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ‘సులభ్’ వంటి సంస్థలు ప్రజలకు ఉదారంగా ఆర్థిక సాయం అందజేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.2 మిలియన్ల మందికి టాయిలెట్ల సౌకర్యాన్ని ‘సులభ్’ సంస్థ కల్పించింది.

విదేశీ భాషలతో కెరీర్‌కు కొత్తదారులు



            
               ప్రపంచీకరణ నేపథ్యంలో కొనే్నళ్ళుగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ కొనసాగిస్తున్న హవా అంతా ఇంతా కాదు. ఏ బ్రాంచిలో ఇంజనీరింగ్, పీజీ చేసినవారైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలవైపే మక్కువ కనబరుస్తున్నారంటే ఆ ఉద్యోగాలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాఫ్ట్‌వేర్ పరిశ్రమలతో పాటు కాల్‌సెంటర్లు కూడా అదే స్థాయిలో వెలుస్తూ యువతకు బోలెడు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే మరింత ఆకర్షణీయమైన జీతాలతో బహుళజాతి కాల్‌సెంటర్లు అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయి. దీంతో అమెరికన్, యుకె యాక్సెంట్ ( పద ఉచ్ఛారణ తీరు) అభ్యసించడానికి మన దేశానికి చెందిన యువత ప్రత్యేక తర్ఫీదు పొందాల్సి వచ్చేది. కానీ, కొనే్నళ్ళుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. కేవలం మాతృభాష, హిందీ, ఇంగ్లీషుతో సరిపెట్టకుండా ఏదో ఒక విదేశీ భాషను అభ్యసించడానికి యువత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే స్పెషలైజేషన్ కోర్సులను ఎంచుకుంటున్నవారు కొందరు ఉంటుండగా, అకడమిక్స్ పూర్తి చేసి ఇఫ్లూ (ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం, హైదరాబాద్) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ద్వారా ఇష్టమైన విదేశీ భాషను నేర్చుకుంటున్నవారు మరికొందరు ఉండడం విశేషం. విశ్వవిపణిలో భారతీయ కంపెనీలు క్రమేపీ తమ ఆధిపత్యం చలాయిస్తూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్న నేటి తరుణంలో మనదేశ భాషలతో పాటు విదేశీ భాషలు తెలిసిన నిపుణుల అవసరం ఎంతైనా ఉందని సంస్థలు గుర్తించాయి. బహుళజాతి కంపెనీలతో వ్యవహారాలు నడిపే సందర్భాల్లో విభిన్న భాషల్లో నిపుణులైన వారు తమ కంపెనీల్లో ఉంటే లాభదాయకమని భావించి పెద్ద స్థాయిలో నియామకాలు చేసుకుంటున్నాయి. అభ్యర్థులు దొరకని పక్షంలో కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నవారిని తీసుకుని వారికి తర్ఫీదునివ్వడానికి కూడా సంస్థలు వెనుకాడడం లేదంటే మల్టీలాంగ్వేజ్ స్కిల్స్ కలిగిన వారికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. 2 లక్షల మంది ప్రొఫెషనల్స్ అవసరం గత దశాబ్ద కాలంగా గ్లోబల్ మార్కెట్‌లో వస్తు న్న మార్పులకు అనుగుణంగా మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థుల అవసరం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే, మానవవనరుల లేమి కారణంగా డిమాం డ్ మేర ఏ దేశంలోనూ విదేశీ భాషల్లో నైపుణ్యం సంపాదించిన అభ్యర్థులు తయారుకాలేకపోతున్నారు. బిపిఓ, ఐటి, కెపిఓల్లో రానున్న పదేళ్ళల్లో దాదాపు 2 లక్షల మంది విదేశీ భాషా పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అవసరం ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడుతున్న వర్థమాన దేశాలకు ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. లాంగ్వేజ్-సెన్సిటివ్ పనులకు గాను దాదాపు 15 బిలియన్ల యుఎస్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలిగే విషయంలో పెద్ద కంపెనీలు సైతం మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మల్టీలాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కొరత తీవ్రస్థాయిలో ఉండడమే. మనదేశం నుంచి విదేశాలకు వెళుతున్న వారు కూడా ఇటువంటి ఉద్యోగాల్లో కుదురుకోలేకపోతున్నారు. ఎక్కడ మొదలుపెట్టాలి..? విదేశీ భాషలను నేర్చుకోవడానికి పలు మార్గాలున్నాయి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో పలువురు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఒక విదేశీ భాషను అభ్యసిస్తున్నారు. మరికొందరు 10+2 తర్వాత డిగ్రీలో చేరాక ఒక విదేశీ భాషను ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకుంటున్నారు. ఇవి కాక ఉస్మానియా, ఇఫ్లూ వంటి విశ్వవిద్యాలయాలు షార్ట్‌టర్మ్ సర్ట్ఫికెట్, డిప్లమో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. విదేశీ భాషల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి కూడా పిజి, పిహెచ్‌డిలు పలు భారతీయ విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఒక క్రీడలో నైపుణ్యం సాధించాలంటే చిన్ననాటి నుంచే ఎలా సాధన చేయాలో అదే విధంగా విదేశీ భాషను కూడా క్రమశిక్షణతో నేర్చుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పాఠశాల కరిక్యులంలో ఒక భాగంగా విదేశీభాషను పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవడంతో చాలామంది హోం ట్యూషన్ బాట పడుతున్నట్లు సర్వేల్లో తెలిసింది. విదేశీ భాషల్లోనూ నైపుణ్యం సంపాదించాలంటే నిరంతరం ప్రాక్టీస్ చేయడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి ఉపయోగకరం..? ఇతర ప్రాంతాల సంస్కృతి, ఆచార వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారికి విదేశీ భాషలు నేర్చుకుంటే ఉపకరిస్తుంది. ఇలా చేయడం వల్ల తమ ఆసక్తి ఉన్న రంగంలో స్థిరపడడమే కాకుండా చక్కటి వేతనం కూడా సంపాదించే అవకాశం ఉంది. ఆంగ్లభాషలో పరిజ్ఞానంతో పాటు ఒక విదేశీ భాషను నేర్చుకోవడం వల్ల కెరీర్ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చు ఎంత .? కేంద్రీయ విశ్వవిద్యాలయాలైన ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్‌లాల్ యూనివర్శిటీల్లో విదేశీ భాషల కోర్సుల ఫీజులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇక ప్రైవేటు కేంద్రాల్లో అయితే భాషను బట్టి కోర్సులో చేరిన విద్యార్థులను బట్టి ఫీజులను నిర్ణయిస్తున్నారు. కొరియన్, జపనీస్, చైనీస్ భాషలు నేర్చుకోవడం ఖర్చుతో కూడుకోగా అరబిక్, పర్షియన్ భాషలను చాలా తక్కువ వ్యయంతో నేర్చుకునే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థల్లో ఐదేళ్ళ కోర్సుకు దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విదేశీ భాషల కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆకర్షణీయ ఉపకార వేతనాలను కూడా అందజేస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీ, మ్యాక్స్ మ్యూలెర్ భవన్‌లు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. అయితే, ఇందుకు ప్రతిభే కొలమానంగా నిర్ణయిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు ఎలా..? విదేశీభాషల్లో నైపుణ్యం సంపాదించిన వారికి పలు రంగాలు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా టూరిజం, ఎంబసీ, డిప్లొమాటిక్ సర్వీసులు, ఎంటర్‌టైన్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, మాస్ కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్, ఇంటర్‌ప్రిటేషన్, ట్రాన్స్‌లేషన్ తదితర రంగాల్లో భారీగా కొలువులు విదేశీ భాషా నిపుణుల కోసం వేచిచూస్తున్నాయి. ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్, జపనీస్, స్పానిష్, కొరియన్, పోర్చుగీస్ తదితర భాషల్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆన్‌లైన్ కంటెంట్ రైటర్లు, టెక్నికల్ ట్రాన్స్‌లేటర్లు, డీకోడర్లకూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలైన యుఎన్‌ఓ, ఎఫ్‌ఏఓ, ఆర్‌బిఐ తదితర సంస్థల్లో కూడా ఫారిన్ లాంగ్వేజ్ స్పెషలైజేషన్ ఉన్న వారి కోసం చూస్తున్నాయి. వేతనాల మాటేంటి..? ఆంగ్లభాషపై మంచి పట్లు ఉండి, విదేశీ భాషల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి దాదాపు రూ.50వేల వరకు నెలకు వేతనం అందించే బహుళజాతి సంస్థలు ఎన్నో ఉన్నాయి. భాషలు నేర్పించే శిక్షకులు కూడా దాదాపు రూ.30వేల వరకూ ఆడుతూ పాడుతూ సంపాదిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తూ గంటకు రూ.4వేలు సంపాదించే శిక్షకులు కూడా ఉన్నారు. యాక్సెంచర్, ఈవాల్యుసెర్వ్, విప్రో, ఫీసెర్వ్, టిసిఎస్, టెక్ మహింద్రా, ఇన్ఫోసిస్, కులీజా, స్కాబార్డ్ వంటి బహుళజాతి కంపెనీలు భాషా నిపుణులకు పెద్దపీట వేస్తున్నాయి.

Wednesday 4 July 2012

జనవిజ్ఞాన వేదిక హిందుమతానికీ హిందూ దేవుళ్లకీ వ్యతిరేకమా?


              జనవిజ్ఞాన వేదిక హిందూ మతానికీ హిందూ దేవుళ్లకీ వ్యతిరేకమా? ఇతర మతాల వారికి అనుకూలమా? ఆ మధ్య రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కొబ్బరికాయలు, పూజాసామగ్రికి ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసిందని, అలా ప్రభుత్వ ఖర్చు మత కార్యక్రమాలకు ఉపయోగించవద్దని జనవిజ్ఞాన వేదిక వారు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. కానీ ప్రతి సంవత్సరం ముస్లిం సోదరుల మక్కాయాత్రకు ప్రభుత్వం రాయితీలు ఇస్తే మీరు ఎందుకు స్పందించడం లేదు? - జి.దినేష్‌కుమార్‌గుప్తా, మలక్‌పేట, హైదరాబాద్‌
              జనవిజ్ఞాన వేదిక ఓ మంచి అభ్యుదయ సంస్థ. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కల్గించడానికి, నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాస్త్రీయ కారణాలను విశ్లేషించి ఆ సమస్యల నివృత్తికి శాస్త్రీయ పరిష్కారమార్గాలను అన్వేషించి ప్రజల్లో ప్రచారం చేసే మంచి సంస్థ. ప్రజల మధ్య సామరస్యాన్ని, సోదర భావాన్ని కల్గించుతూ వారి సర్వతోముఖాభివృద్ధి కోసం తహతహలాడే నిజమైన సామాజిక సేవాతత్పరతగల స్వచ్ఛంద సంస్థ అది. మన భారత రాజ్యాంగంలోనే శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించడం, ప్రశ్నించే హేతు బద్ధ వైఖరిని అలవర్చుకోవడం, పర్యావరణ పరిరక్షణకు జీవవైవిధ్యం కొనసాగింపునకు తనవంతు కృషి చేయ డం, మానవతా దృష్టితో మెలగడం.. ప్రతి భారతీయ పౌరుని ప్రాథమిక బాధ్యతగా పేర్కొనబడి ఉంది.

             భారత సమాజాన్ని నడిపించే మన రాజ్యాంగంలోని ప్రధాన తాత్వికతల్లో 'మన రాజ్యం మత ప్రసక్తిలేని లౌకిక, సమసమాజ సార్వభౌమ్యం (Secular, Socialist, Soverign State) గా ప్రకటించుకొన్నాం. ఇలాంటి అత్యున్నత ఆదర్శాలతో మన సమాజాన్ని ఆదేశిస్తున్న భారత రాజ్యాంగ ఆదేశాల పరిధిలో ఆ ఆశయాల అనువర్తనానికి కృషి చేస్తున్న జన విజ్ఞానవేదికలో మీరూ భాగస్వాములై ఆ సంస్థ చేపట్టే కార్యకలాపాలను దగ్గరగా చూసినట్లయితే మీరీ అభిప్రాయం వెలిబుచ్చే వారే కాదు. దేశంలోనే సైన్సు ప్రచారానికి భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత జాతీయ పురస్కారాన్ని 2005 సంవత్సరానికిగాను రాష్ట్రపతిభవన్‌లో పొందిన హుందాగల సంస్థ హిందూమతానికి వ్యతిరేకికాదు. హిందూ దేవుళ్లకూ వ్యతిరేకం కాదు. ఇతర మతాలేటికీ వ్యతిరేకం కాదు.


                అలాగని ఏమతానికీ అనుకూలమూ కాదు. మీకు వంకాయకూర ఇష్టం, మరొకరికి బెండకాయ పులుసు ఇష్టం అనుకొందాం. వంకాయలకు వ్యతిరేకమా? బెండకాయలకు మీరు అనుకూలమా? అని ఎవరైనా జనవిజ్ఞానవేదిక వారిని ప్రశ్నిస్తే మేమిచ్చే సమాధానం ఒకటే. ఎవరెవరి రుచులు, ఆసక్తులు వారి వారి యిష్టం. మేము వంకాయలకు వ్యతిరేకం కాదు. బెండకాయలకూ వ్యతిరేకం కాదు' అంటాము. అలాగని వంకాయలు గొప్పవనీ, బెండ కాయలు గొప్పవనీ అదేపనిగా ఊదరగొట్టము. బెండకాయలు, వంకాయల కన్నా పెద్ద సమస్యలు ప్రజల తలకాయలు ఎదుర్కొంటున్నాయని గుర్తించి వంకాయల గొడవ, చింతకాయల గొడవల్ని పట్టించుకోము.
అయితే వంకాయల రుచిలో కళ్లు మైమరిచిన వాళ్లు రోడ్లమీదికొచ్చి 'వంకాయల్ని మించిన కాయల్లేవు. అందరూ వంకాయల్నే తినాలి, వంకాయల రూపాల్ని ప్రతి రోడ్డు కూడలి దగ్గరా ప్రతిష్టించాలి. వంకాయలు తప్ప మిగిలిన కాయల్ని తినేవాళ్లు దేశం నుంచి వెళ్లిపోవాలి' అంటూ సామాజిక స్థాయికి వాళ్ల వంకాయ గొడవల్ని పొడిగిస్తే అలాంటి వంకాయల వంకర పోకడల్ని ప్రశ్నించడం ప్రతి శాంతికాముకుడి ప్రధాన బాధ్యత. కాబట్టి ఇలాంటి వాదనలు, ప్రకటనలు, ఆచారాలు ఎదురైనప్పుడు సహజంగానే జనవిజ్ఞానవేదిక ప్రశ్నిస్తుంది. అలాగే బెండకాయల రుచిని మెండుగా భావించే వారి విషయంలోనూ అలానే ప్రవర్తిస్తాము.

               కానీ, అన్ని కాయల్ని సమానంగా భావించాల్సిన ప్రభుత్వం, అన్ని కాయల్లోనూ ఉన్న మంచి చెడులను గుర్తించి నడుచుకోవాల్సిన ప్రభుత్వం కేవలం వంకాయల వంకే ప్రతి కార్యకలాపాన్ని మలవడం వల్ల మిగతా కాయల్ని ఇష్టపడే వారి మనోభావాల్ని ఇబ్బంది పెట్టే అవాంఛనీయ పరిస్థితి వుందన్న భావంతో ఏకాయలకూ పరిమితం కావద్దని చెబుతాం. వారి వారి వ్యక్తిగత రుచుల్ని, జిహ్వ చాపల్యాల్ని బృహత్సామాజిక కార్యకలాపాల్లోకి చొప్పించవద్దని విన్నవిస్తున్నాము. తద్వారా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడవలసిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని అంటాము.
                హిందూమతమైనా, ముస్లిం మతమైనా, క్రైస్తవ మతమైనా, లేదా మరే మతమైనా యథేచ్ఛగా అవలంబించే ప్రాథమిక హక్కు ప్రతి పౌరునికీ భారత రాజ్యాంగం ఇచ్చింది. అంతేకాదు, ఏ మతమూ లేనివారూ భారతదేశపు సమాజానికి సమ్మతమే! మతానికి, దేవుళ్లకూ జనవిజ్ఞానవేదిక వ్యతిరేకం కాదు. మతం పేరుతో జరిగే మారణకాండకు మాత్రమే పూర్తిగా వ్యతిరేకం. మతం పేరుతో మనుషుల మధ్య అంతరాలను పెంచే ధోరణులకు వ్యతిరేకం. అలాంటి మత వైషమ్యాల్ని రెచ్చగొట్టే ఛాందసభావాలకు వ్యతిరేకం. ప్రజల మధ్య సామరాస్యాన్ని పెంచుతూ వారి వారి మత విశ్వాసాల్ని గౌరవిస్తూ జనవిజ్ఞాన వేదిక ముందుకెళుతోంది.
మతంమాటున మూఢవిశ్వాసాల్ని, అభూతకల్పనల్ని, ఛాందసత్వాన్ని, వెనుకబాటుతనాన్ని, నిరాశావాదాన్ని, నిష్క్రియాపరత్వాన్ని, వివక్షను, సోమరితనాన్ని, విద్రోహ పూరిత మనస్తత్వాల్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించే ఏ కార్యకలాపాలనైనా మనం వ్యతిరేకించాలి. ఫలాని తంత్రంతో చేసిన తాయెత్తును ధరిస్తే జబ్బులు నయ మవుతాయన్నా, స్వస్థత కూటముల పేరుతో గుడ్డివాళ్లకు కళ్లు వస్తాయన్నా, అశాస్త్రీయంగా మరేదయినా పద్ధతిలో అన్నీ బాగవుతాయన్నా, ఆ భావాలు ప్రజల్ని నిర్వీర్యం చేస్తాయి కాబట్టి వ్యతిరేకిస్తాము.
               మతాలను, మతభావాల్ని, వారి వారి దేవుళ్లనూ జనవిజ్ఞానవేదిక ప్రశ్నించదు. అలాగని జనవిజ్ఞాన వేదిక ఓ నాస్తిక సంస్థ కానేకాదు. నలభై వేల పైచిలుకకు సభ్యత్వంతో నిస్వార్థంగా పనిచేసే జనవిజ్ఞానవేదికలో అన్ని మతాలవాళ్లు, ఏ మతమూలేని వాళ్లు, సమున్నతాశయాలతో పనిచేస్తున్నారు. ఈ విలువలకు కట్టుబడేవారెవరైనా జనవిజ్ఞాన వేదికకు ఆహ్వానితులే.
              ప్రజలు జరుపుకొనే పండుగలు, సామాజిక బృందస్థాయిలో జరుపుకొనే వేడుకలను వారి వారి సంస్కృతిలో భాగంగా చూస్తాము కాబట్టి ఆయా సందర్భాలలో ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు పండుగ అడ్వాన్సుల రూపంలోనో, మరేదైనా పద్ధతిలోనో సహకారం అందిస్తే అది తప్పుకాదు. కానీ అన్ని మతాల ప్రజలకూ బాధ్యత వహిస్తూ, సర్వమతస్తులకూ ప్రతినిధిగా ఉండవలసిన ప్రభుత్వ కార్యకలాపాల్లో మతపరమైన హడావిడి ఉండకూడదనడం తప్పు కాదు. ప్రత్యేకించి ఓ మతపద్ధతులే అనుసరించడం మరింత అభ్యంతరకరం అనడం వేరొకరికి వంతపాడడం కానేకాదు.

తియ్యటి పరిష్కారం..!



                   కృత్రిమంగా కణజాలాన్ని రూపొందించడంలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇప్పటివరకూ కణజాలంలోని సూక్ష్మ రక్తనాళాలని రూపొందించడానికి కొన్నిరకాల అచ్చులు (మౌల్డులు) వాడుతున్నారు. కానీ, వాటిని తొలగించడం మరీ ఇబ్బందిగా మారుతోంది. ఉదాహరణకు రబ్బరుతో చేసిన అచ్చులను తొలగించడానికి రసాయనాలు వాడవలసి ఉంటుంది. దాంతో సృష్టించిన కణజాలం దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంది. ఇప్పుడు ఈ సమస్యకు ఒక 'తీయని' పరిష్కారం లభించింది. నీటిలో కరిగే ఓ ప్రత్యేక పదార్థాన్ని ('గాజు') ని కేక్‌లు, ఇతర స్వీట్లపై అలంకరణకు వాడుతుంటారు. ఆ కార్బొహైడ్రేట్‌ పదార్థాన్ని వాడి 'అచ్చు'లు చేయడం వల్ల, పని పూర్తయ్యాక వాటిని తొలగించడం సులభం అని అంటున్నారు. కణాలలోని తేమకే ఆ పదార్థం కరిగిపోతుందట!

ఊబకాయానికి మందు..!


           
             వచ్చే ఏడాదిలో ఊబకాయానికి మందు మార్కెట్లోకి రానుంది. 'బెల్విక్‌' అనే ఈ మందును వాడితే సుమారు 5% శరీర బరువు తగ్గుతుందని నిర్ధారణ అయింది. అయితే, దీన్ని వాడటం వలన ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఉందని అమెరికా ఆరోగ్య అధికారులు గతంలో దీనిని ఆమోదించలేదు. బెల్విక్‌ని తయారుచేసే అరీనా సంస్థ మాత్రం అటువంటి ప్రమాదమేమీ లేదని మరిన్ని వివరాలతో తాజాగా అర్జీ పెట్టుకుంది. అనేక పరీక్షల తరువాత అమెరికా ఆరోగ్య అధికారులు బెల్విక్‌ను ప్రజల వినియోగానికి శ్రేయస్కరం అని ఆమోదించారు. బెల్విక్‌ ఆకలిని మందగింపజేస్తుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్‌ ఉన్నవారు కూడా దీనిని వాడవచ్చు. కానీ, గర్భిణీలు మాత్రం వాడకూడదట.

ఆందోళనకరంగా వాతావరణం..!



          ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితి మానవ జీవితాలకు ఇబ్బంది కలిగించే విధంగా మార్పు చెందుతున్నట్టు పరిశోధకులు గ్రహించారు. అంచనాలకు అందని విధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అటు ఉష్ణప్రాంత వాసులనే కాక ఇటు శీతల ప్రాంత వాసులకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. గతవారం కాలిఫోర్నియాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడం ఒక ఉదాహరణంగా చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అడుగంటిపోతున్న భూగర్భజలాలు, కరుగుతున్న అంటార్కిటికా మంచు వంటి ఘటనలు పొంచి వున్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పర్యావరణవేత్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టిన దానికి ఫలితమే ఇది అని అంటున్నారు.

ముడతల పర్వతాలు - ఏర్పడేతీరు..

ఏర్పడేతీరు..

  • ముడతల పర్వతాలు
ఇవి సర్వసామాన్యం. భూమిలో గల 'టెక్టానిక్‌ పళ్లాలు' ఎదురెదురుగా ఘర్షణ పడటం వల్ల ఒత్తిడికి లోనై, పైకి లేసి ఎత్తయిన పర్వతాలు ఏర్పడతాయి. ఉదా: హిమాలయ పర్వతాలు.
పళ్లాల లోపాలతో ఏర్పడే పర్వతాలు
భూగోళ పైపొరలో ఏర్పడే లోపాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఒక పక్కకకు ఒరిగి వుండవచ్చు లేదా పైకి లేచి వుండవచ్చు. ఇటువంటి పర్వతాల వాలు తక్కువగా ఉంటుంది.
లావాతో ఏర్పడే పర్వతాలు
అగ్ని పర్వతాలు పేలి లావా బయటకు వచ్చినపుడు చల్లబడి, పర్వతంగా ఏర్పడుతుంది. ఉదా: జపాన్‌లోని ఫుజి పర్వతాలు.
డోమ్‌ పర్వతాలు
ఒత్తిడితో వున్న మాగ్మా (లావా) భూగోళ పైపొరను పైకి నెడుతుంది. దీంతో, పైపొర ఉబ్బి పర్వతంగా ఏర్పడుతుంది. ఉదా: అమెరికాలో నవాజో పర్వతాలు.
మైదాన పర్వతాలు
ఉబికిన మైదాన ప్రాంతం తీవ్ర కోతకు గురై ఈ పర్వతాలు ఏర్పడతాయి. ఉదా: అమెరికాలో అడిరాండాక్‌ పర్వతాలు.

గుట్టలు..


చిన్నా, పెద్ద గుట్టలు కూడా సూక్ష్మ స్థాయిలో వాతావర ణాన్ని, నేలల్ని, ఉత్పత్తి వ్యవస్థలను, సాంఘిక, ఆర్థిక జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.
చిన్న గుట్టల పునాది చుట్టూతా భూగర్భ జలసంపద అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతపు నేలల్లో ఇసుక శాతం ఎక్కువగా ఉండి, బంకమట్టి శాతం తక్కువగా ఉంటుంది. కొంత వాలు తగ్గిన తర్వాత మైదాన ప్రాంతం వస్తుంది. మైదాన ప్రాంతం పైర్ల పెరుగుదలకు అనువుగా ఉంటుంది. లోయ ప్రాంతపు నేలల్లో బంక మట్టి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండవచ్చు. ఎత్తుపల్లాలు వాలు కూడా ఈ విధంగానే ప్రభావితం చేస్తున్నాయి. వంపులో చేరే నీరును చెరువులు లేదా పెద్ద కట్టడాలను నిర్మించి, నీటిని నిల్వ చేసి వినియోగించుకోవచ్చు. సంస్కృతి పరంగా మానవులు లోయల్లోనూ స్థిర నివాసాలు ఏర్పరచుకొని, జీవనాన్ని కొనసాగించారు.
పెద్ద గుట్టలపై అడువులు సహజంగానే ఉన్నాయి. ఇవి అధిక వర్షపాతానికి కూడా దోహదపడుతున్నాయి. ఈ అడవులు, అధిక వర్షపాతం, అనుకూల ఉష్ణోగ్రత లు, నాణ్యమైన జీవనానికి తోడ్పడుతున్నాయి. ఇక మెత్తటి రాయితో ఏర్పడే గుట్టలు పైభాగంలో కూడా సారవంతమైన భూముల్ని, చల్లని వాతావరణాన్ని కలిగుంటాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి పర్యాటక కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి. ఊటీలాంటి చోట్ల చురుకైన ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడుతున్నాయి.

హిమాలయ శ్రేణి..



                      హిమాలయమంటే తెలుగులో 'మంచు నివాసం'. ఈ శ్రేణిలో అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌. దీని ఎత్తు 8,848మీటర్లు (29, 029 అడుగులు). ఈ పర్వతశ్రేణి ఆఫ్ఘానిస్తాన్‌, భూటాన్‌, బర్మా, చైనా, భారత్‌, నేపాల్‌, పాకిస్తాన్‌లకు విస్తరించింది. దాదాపు 300 కోట్ల ప్రజలు దీని నుండి వచ్చే నీటిపై ఆధారపడి ఉన్నారు. ఈ పర్వతాలు 18 దేశాలకు 'పరీ వాహక' ప్రాంతంగా ఉన్నాయి. దక్షిణాసియా సంస్కృతిపై వీటి ప్రభావం అధికంగా ఉంది. హిమాలయాల్ని హిందువులు, బౌద్ధులు, సిక్కింలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ శ్రేణిలో 15 వేల హిమనీనదాలున్నాయి.
భారత-ఆస్ట్రేలియా టెక్టానిక్‌ పళ్లెం ప్రతి సంవత్సరం 15 సెం.మీ. ఉత్తర దిశలో జరిగింది. యూరేషియా పళ్లాన్ని ఎదుర్కొని ఒత్తిడికి గురవుతుంది. ఫలి తంగా ఇప్పటి హిమాలయాల పర్వత శ్రేణి ఏర్పడింది. ఇప్పటికీ ఈ భారత- ఆస్ట్రేలియా టెక్టానిక్‌ పళ్లెం ప్రతి ఏడాది 6.7 సెం.మీ. దూరం ఉత్తరంవైపుకు కదులుతుంది. భూగోళంపై ఈ పర్వతాలు ఇప్పటికీ చురుగ్గా, జవసత్వాలు కలిగి ఉన్నాయి.
సముద్రగర్భంలో ఉన్న తేలికైన సున్నపురాళ్లు(మెరిన్‌ లైమ్‌ స్టోన్‌) పైకి వచ్చి పర్వతాలుగా ఏర్పడ్డా యి. ఎవరెస్టు, దాని పక్కనున్న శిఖరాలు కలిసే (సమ్మిట్‌) ప్రాంతంలో వున్న ఈ రాళ్లే దీనికి నిదర్శనం. హిమాలయ పర్వతశ్రేణిలో 14 శిఖరాలు 8 వేల మీటర్లకుపైగా ఎత్తున్నాయి. 7,200 మీటర్లకు పైగా 100 పర్వతాలున్నాయి. ఇవి పడమర నుండి తూర్పువైపుకు 2,400 కి.మీ. మేర, 400 కి.మీ. వెడల్పున విస్తరించి ఉన్నాయి.
శిఖరం ఎత్తు పెరుగుతున్న కొద్దీ జీవవైవిధ్యం తగ్గిపోతుంది. (వివరాలు చిత్రంలో చూడండి) వేగంగా మారుతున్న భూగోళ వాతావరణం హిమాలయాలపై జీవించే జంతుజాలల్నీ ప్రభావితం చేస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల ఓక్‌ అడవుల్లో, ముఖ్యంగా గర్హల్‌ ప్రాంతంలో ఫైన్‌ చెట్లు విస్తరిస్తున్నాయి. కొన్నిరకాల చెట్లు త్వరగా పుష్పించి, కాస్తున్నాయి. ముఖ్యంగా రోడోడెరడ్రాన్‌, యాపిల్‌, మైరికా (ఒకరకం చెట్టు)లలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఔషధ మొక్కల్లో ఔషధ గుణాలు మారవచ్చని భావిస్తున్నారు.
హిమాలయాల వర్షపాత ప్రభావం దక్షిణంవైపు ఎక్కువగా ఉంది. ఉత్తరంవైపు వర్షాలు కురవడం లేదు. ఒక్కోసారి ఈ పర్వతంపై నుండి మంచు ఖండాలు కూలిపోతూ ఉంటాయి ఉత్తరంవైపునున్న ఆర్కిటిక్‌ ప్రాంతం నుండి వచ్చే చల్లనిగాలులు మన దేశంలోకి రాకుండా ఈ పర్వతాలు అడ్డుకుంటు న్నాయి. దీనిప్రభావంతో దక్షిణ ప్రాంతం వేడిగా ఉంటుంది. ఉత్తరదిశగా వెళ్లే ఋతుపవనాల్ని ఆపి, దక్షిణాసియాలో వర్షాలు వచ్చేలా చేస్తాయి. ఫలితంగా మధ్యాసియాలో ఎడారి ఏర్పడింది. దీనికి గోబీ ఎడారిని ఉదాహరణగా చెప్పవచ్చు. తూర్పువైపు (ఇరాన్‌) నుండి వచ్చే చలిగాలుల్నీ ఆపి, కాశ్మీర్‌లో మంచు కురవడానికి, పంజాబ్‌, ఇతర ఉత్తరభారతంలో వర్షాలు రావడానికి తోడ్పడుతున్నాయి. బ్రహ్మపుత్ర లోయ, ఈశాన్య భారతంలో, బంగ్లాదేశ్‌లో కొంతమేర చలిగాలులు రావడానికి దోహదపడుతున్నాయి.

పర్వతాలు.. ప్రభావా లు



                       భూ వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో 'పర్వతాలు' కీలకపాత్ర పోషస్తున్నాయి. మన దేశ ఉత్తర సరిహద్దుగా ఉంటున్న హిమాలయ పర్వతశ్రేణి మన దేశ వాతావరణాన్ని నిర్ధారించడంలో కీలకపాత్ర వహిస్తోంది. ఇక పర్వతాలకన్నా చిన్నగా ఉండే పెద్ద, చిన్న గుట్టలు ఒక నిర్దిష్ట పద్ధతిలో వాతావరణాన్ని మార్చుతూ తమదైన ప్రత్యేకతలతో క్షేత్ర వాతావరణాన్ని, రూపొందిన నేలల స్వభావాన్ని, ఉత్పత్తి వాతావరణాన్ని, సాంఘిక ఆర్థిక కార్యక్రమాల్ని నిర్ధారిస్తున్నాయి. మొత్తంమీద, ఇవి సకలజీవుల్ని, మన జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే, ఇవి సముద్రగర్భంలో కూడా ఉన్నాయి. ఇలా ఉంటూ సముద్రగర్భంలో జీవించే జలచరాలను, సముద్రయానాన్ని పలురూపాల్లో ప్రభావితం చేస్తున్నాయి. భూమి మీద మనకు కనిపిస్తూ ప్రభావితం చేసే వాటినే మనం పర్వతాలు, గుట్టలుగా గుర్తిస్తున్నాం. ఇవి ప్రశాంత వాతావరణాన్ని అందిస్తూ.. తాత్వికచింతనకూ తోడ్పడుతున్నాయి. మొత్తం మీద ఇవి ప్రకృతిని పరిరక్షిస్తూ మన జీవితాలను సుసంపన్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ముఖ్య పార్శ్వాల్ని సంక్షిప్తంగా తెలుపుతూ ఈ వారం మీ ముందుకొచ్చింది 'విజ్ఞాన వీచిక'.
భూతలం మీద ఎత్తుగా ఉంటూ, కొనదేలి ముందుకొచ్చిన రాళ్లు, మట్టి సమూ హంతో ప్రత్యేకంగా కనపడేవే పర్వతాలు, పెద్ద, చిన్న గుట్టలు. ఇవి స్థానిక వాతావర ణాన్ని పలువిధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. సకలజీవరాశుల జీవనశైలిని నిర్ధారిస్తు న్నాయి. ఇవి ప్రకృతిపరంగానే ఏర్పడ్డాయి. వ్యవహారికంగా, భూతలం మీద కనపడే వాటినే పర్వతాలుగా పరిగణిస్తున్నాం. వీటిని గురించే ఈ వ్యాసంలో వివరిస్తున్నాం. సముద్రగర్భంలో ఉండేవాటిని ఈ సందర్భంలో ప్రస్తావించడం లేదు.
''పర్వతాలకు'' అందరూ అంగీకరిస్తున్న నిర్వచనం ఏమీలేదు. ఎత్తు, పరిమాణం, వాలు, వాలు తీవ్రత, శిఖరాలు, వాటి మధ్య దూరాల ఆధారంగా వీటిని గుర్తిస్తు న్నాం. కొన్ని సందర్భాల్లో స్థానిక ప్రజల వ్యవహారిక గుర్తింపు కూడా ముందుకొస్తుంది. ఉదా: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో దగ్గరున్న మౌంట్‌డేవిడ్సన్‌ పర్వత నిర్వచనానికి సరిపోదు. అయినా, దీన్ని స్థానికులు పర్వతంగానే భావిస్తున్నారు. అందువల్ల ఇది పర్వతంగానే పిలువబడుతుంది.
గుర్తింపు..
* విస్తృతపునాదిపై కనీసం 2500 మీటర్ల (8202 అడుగులు) ఎత్తుగల శిఖరం.
* పునాదిపై 1500-2500 మీటర్ల (4921-8,202 అడుగులు) ఎత్తుతో రెండు డిగ్రీలకన్నా అధికంగా వాలు కలిగిన శిఖరాలు.
* పునాదిపై 1000-1500 మీటర్ల (3281-4921 అడుగులు) ఎత్తుతో ఐదు డిగ్రీలకన్నా అధిక వాలు కలిగిన శిఖరాలు.
* స్థానిక శిఖరాలు 7000 మీటర్ల వ్యాసార్థం (22.966 అడుగులు) గల పునాదిపై 300 మీటర్ల (984 అడుగులు) ఎత్తుగల శిఖరాలు.
ఈ నిర్వచనాల ఆధారంగా ఆసియా ఖండంలో 64%, యూరప్‌లో 25%, దక్షిణ అమెరికాలో 22%, ఆస్ట్రేలియాలో 17%, ఆఫ్రికాలో 3% మేర పర్వతాలు ఆక్రమించుకొని వున్నాయి. మొత్తం మీద, భూమిపై 24% పర్వతాలు విస్తరించి వున్నాయి. వీటిపై 10% మేర ప్రజలు నివసిస్తున్నారు. భూగోళంలో ప్రధాన నదులన్నీ ఈ పర్వత ప్రాంతాల నుండే జనించినవే. దాదాపు 50% ప్రజలు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నారు.
వాతావరణం..
పైకి వెళుతున్న కొద్దీ ప్రతి 150 మీటర్లకూ ఒక డిగ్రీ సెంటీ గ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ తగ్గుదల అధికంగానూ ఉండ వచ్చు. అందువల్ల, పర్వత శిఖరాలు ఎప్పుడూ చల్లని వాతావరణ పొరల్లో ఉంటాయి. పునాది వద్ద ఉష్ణమండల పరిస్థితులున్నప్ప టికీ ఉన్నత శిఖరం నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ పర్వతలోయలు హిమనీ నదాలతో నిండి ఉంటాయి. హిమనీ నదంలోని మంచు కరుగుతూ నదులు, జలపాతాలుద్భవిస్తాయి.
పర్వతాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. మార్పుకు లోనవు తుంటాయి. వాతావరణ ప్రభావాల వల్ల తేలికగా విచ్ఛిన్నం కాగల పర్వత శిఖరభాగం బోడి (గుండ్రం)గా మారవచ్చు. విడిపోయిన రాళ్లూరప్పలు లోయ ప్రాంతాల్లో చేరవచ్చు. ప్రవహించే నీరు తోడై నప్పుడు ఈ రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా మారవచ్చు. ఈ లోయ ప్రాంతాల్లో చెట్లూ, చేమలు పెరిగి దట్టమైన అడవులు ఏర్పడ తాయి. కొన్ని పర్వతాలు పెరుగుతుండవచ్చు. ఉదా: హిమాలయ పర్వతాలు. వీటి పర్వతశిఖరాలు ఎత్తుగా, మొనదేలి ఉంటాయి.
పర్వత ప్రాంతం సామాన్యంగా పరిసర భూ వాతావరణం కన్నా చల్లగా ఉంటుంది. భూమిపై పడిన సూర్యరశ్మి భూతలాన్ని వేడెక్కిస్తుంది. వేడెక్కిన భూమి ఉపరితలంపైనున్న గాలిని వేడెక్కిస్తుంది. ఇలా వేడెక్కిన గాలి పైనున్న పొరను వేడెక్కించలేదు. ఫలితంగా పర్వత శిఖర ప్రాంతంలో గాలి చల్లగా ఉంటుంది. ఇదే సందర్భంలో పైకి వెళుతున్న కొద్దీ గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంటుంది. 3,500 మీటర్లపైన ఊపిరి పీల్చుకోవడం భారంగా మారుతుంది.
మీకు తెలుసా..?
* హిమాలయాల్ని 'ప్రపంచ పైకప్పు'గా వర్ణిస్తారు. ధృవప్రాంతాల తర్వాత దానితో సరిసమానంగా ఇక్కడే మంచు ఉంటుంది. దాదాపు పది పెద్ద నదులు ఇక్కడ నుంచే ప్రవహిస్తుంటాయి.
* వందలాది సరస్సులు ఈ శ్రేణిలో ప్రకృతిపరంగా ఐదువేల మీటర్ల ఎత్తు లోపల ఏర్పడి ఉన్నాయి. ఈ పరిమితిలోనే వృక్షజాలాలు వుంటాయి.
* హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది.నేపాల్‌లో గత పదేళ్లలో 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ప్రపంచంలో గత 100 సంవత్సరాల్లో 0.7 డిగ్రీలు మాత్రమే పెరిగింది.