Wednesday 28 March 2012

కనుమరుగు కానున్న కొన్నిపక్షులు!


మానవ అనాలోచిత చర్యలు, స్వార్థ అభివృద్ధి కార్యక్రమాలూ అనేక జీవ జాతుల్ని పొట్టనబెట్టు కుంటున్నాయి. తాజాగా, అటువంటి మరో ఘాతుకం వెలుగు చూసింది. మన దేశంలో కనీసం 14 పక్షి జాతులు అంతరించిపోయే దిశలో ఉన్నట్టు ఏకంగా పర్యావరణ, అటవీ అమాత్యుల వారే చెప్పారు. ఈ దారుణానికి కారణం క్రిమి నాశకాల మందుల్ని అతిగా వాడటం. వేట, సహజ ఆవాసాల క్షీణత కూడా దీనికి కారణాలని సెలవిచ్చారు. ఇలా అంతరించిపోగల పక్షి జాతుల్లో గుడ్లగూబ నుండి రాబందు వరకూ, మొత్తం పద్నాలుగు రకాలు ఉన్నట్లు తెలిసింది. అయితే, వీటిలో మన జాతీయపక్షి మాత్రం లేదు.

No comments:

Post a Comment