Friday 17 October 2014

నిశిరాత్రి నింగిలోకి

- ముచ్చటగా మూడడుగులు
- మిగిలింది నాలుగడుగులే...
- 2015 నాటికి సంపూర్ణ నావిగేషన్‌ సిస్టమ్‌ : ఇస్రో
      నిశిరాత్రి... బుధవారం అర్ధరాత్రి 1.32 నిమిషాల సమయం...దేశం మొత్తం గాఢనిద్రలో ఉన్నవేళ... అక్కడ మాత్రం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ... కళ్లు చిట్లించి మరీ మరో విజయానికి చేరువవుతున్నామన్న ఆశతో చూస్తున్నారు. వారిలో మొక్కవోని విశ్వాసం కనిపించింది. చిమ్మచీకటి... కడలి అలల శబ్దం తప్ప మరొకటి విన్పించడం లేదు. అర్ధచంద్రాకార జాబిలమ్మ తొంగి చూస్తుండగా అక్కడి మాస్టర్‌ కంట్రోల్‌ రూం నుండి మైనస్‌ 8,7,6,5,4,3,2,1... ప్లస్‌ 1,2,3,4,5,6,7,8 అనగానే ఒక్కసారిగా కారు చీకట్లను చీల్చుకుంటూ పిఎస్‌ఎల్‌వి నింగివైపు దూసుకెళ్లింది. ఆ కాంతిపుంజం వెలుతురుతో అక్కడ అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరి సింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కు నమ్మకమైన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ హెవి కల్‌(పిఎస్‌ఎస్‌వి) ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)1సి ఉపగ్రహా న్ని దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షార్‌లోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ల్యాంచ్‌ ప్యాడ్‌ ఇందుకు వేదికగా నిలి చింది. పిఎస్‌ఎల్‌వి విజయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలి కితురాయి చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పిఎస్‌ఎల్‌విది 28వ ప్రయోగం. ఇప్పటికి 27 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరిగితే 26 విజయవంతమయ్యాయి. తొలి ప్రయోగం విఫలమైంది. రెండో ప్రయోగం నుండి విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌తో ఆ సంఖ్య 27కు చేరింది. ఇది శాస్త్ర సాంకేతిక రంగాల్లో సువర్ణక్షారాలతో లిఖించదగిన అంశం. భారత్‌ అవసరాల కోసం మొత్తం ఏడు నావిగేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది. మూడో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. 2015 నాటికి పూర్తి నావిగేషన్‌ ఉపగ్రహాల ప్రయోగాలను పూర్తి చేస్తామని ఇస్రో సగర్వంగా ప్రకటించింది.
సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) కేంద్రంగా ఎప్పుడు ప్రయోగం జరిగినా శ్రీహరికోట, సూళ్లూరుపేట ప్రాంతాల ప్రజలు ప్రయోగాన్ని వీక్షించడానికి తహతహలాడేవారు. ఈసారి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ప్రయోగానికి అర్ధరాత్రి దాటాక ముహూర్తం నిర్ణయించడమే కారణం. ఇస్రో కుటుంబాలు, పిఎం కార్యాలయం మంత్రి జితేంద్రసింగ్‌, పాత్రికేయులు ప్రత్యక్ష సాక్షులుగా అర్ధరాత్రి 1.32 నిమిషాల సమయంలో పిఎస్‌ఎల్‌వి నింగిలోకి దూసుకెళ్లింది. విరజిమ్ముతున్న నిప్పుల వెలుతురుతో అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన రెండో ప్రయోగం ఇది. సరిగ్గా 1.32 నిమిషా లకు బయలుదేరిన పిఎస్‌ఎల్‌వి నాలుగు దశల్లో లక్ష్యాన్ని చేరింది. 20.20 సెకన్ల సమయంలో భూమికి దగ్గరగా 282.56 కిలోమీటర్లు, దూరంగా 20,670 కిలోమీటర్ల భూస్థిర కక్ష్యలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సి ఉపగ్రహాన్ని దిగ్విజ యంగా ప్రవేశపెట్టింది. ఇస్రో ఛైర్మన్‌ రాధక్రిష్ణన్‌ ప్రయోగం విజయవంతమై యిందని ప్రకటిం చారు. దాంతో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు ఒకరినొకరు అలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఇప్పటి వరకు ఇస్రో రెండు నావిగేషన్‌ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బుధవారం అర్ధరాత్రి జరిగింది మూడోది. నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌లో ఏడు ఉపగ్రహాలను ప్రయోగిస్తే దేశీయ అవసరాలకు సరిపోతుంది. కక్ష్యలోకి చేరిన వెంటనే ఉప గ్రహంలోని రెండో సోలార్‌ ప్యానల్స్‌ విచ్చుకున్నాయి. కర్నాటకలోని హసన్‌లోని ఉప గ్రహ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసుకుంది. దేశంలోని 15 కేంద్రాల్లో ఏర్పాటుచేసిన గ్రౌండ్‌ సేష్టన్లకు అందుబాటులోకి వచ్చింది.
మరో నాలుగడుగులే...!
     భారత్‌ తన సొంత శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్‌ ఉపగ్రహాల   విజయపరంపర కొనసాగుతోంది. మూడు ప్రయోగాలు విజయం సాధించాయి. మరో నాలుగు నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాలు పూర్తి చేస్తే ప్రస్తుతం దేశ అవసరాలకు సరిపోతుంది. ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా నుండి భారత్‌ తీసుకుంటోంది. అందుకోసం పెద్ద మొత్తం ఖర్చు చేస్తోంది. నౌకలు, విమానాలు, కార్లు, ఇతర వాహనాలకు దిక్సూచిగా నావిగేషన్‌ పని చేస్తోంది. మరో 45 రోజుల్లో మరో ప్రయోగం చేపడుతున్నట్లు ఇస్రో పేర్కొంది. 2015 నాటికి దేశ అవసరాలకు కావాల్సిన నావిగేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ ప్రకటించారు. ఈ ప్రయోగాన్ని పిఎం కార్యాలయం మంత్రి జితేంద్రసింగ్‌, ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌, మిషన్‌ డైరెక్టర్‌ కున్నికృష్ణన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎంవిఎస్‌ ప్రసాద్‌, శాస్త్రవేత్తలు చంద్రదత్తన్‌, శివరామకృష్ణ పాల్గొన్నారు.
Curtsey with: PRAJA SEKTHI 

No comments:

Post a Comment