Wednesday 22 February 2012

లూయీ పాశ్చర్‌

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
మానవాళికి మేలు చేసిన అతి గొప్ప శాస్త్రజ్ఞుల్లో లూయీపాశ్చర్‌ మొదటి వరుసలో ఉంటాడు. ఈయన ఫ్రాన్స్‌ దేశస్థుడు. 1882-95 మధ్య జీవించాడు. ఈయన పరిశోధనా ఫలితాల వల్ల ప్రతిరోజూ ప్రతిఒక్కరూ ఏదో రూపంలో లాభం పొందుతూనే ఉన్నారు. మొట్ట మొదట వ్యాక్సిన్‌ను తయారుచేసింది ఈయనే. రాబిస్‌, ఆంథ్రాక్స్‌, మశూచి, కలరా వంటి ప్రమాదకర జబ్బుల కారకాలను కనుగొని, వ్యాక్సిన్‌లను తయారుచేశాడు. ఆధునిక జీవశాస్త్రానికి, బయోకెమిస్ట్రీకి పునాది ఏర్పరిచాడు. పులియటంలో గల శాస్త్రీయతను కనుగొని, వైన్‌, బీర్‌లాంటి పానీయాల తయారీకి మార్గం చూపాడు. ఈయన పరిశోధనలు విజ్ఞానశాస్త్రం పలుదిశల్లో విస్తరణకు తోడ్పడ్డాయి.
ఈయన కనిపెట్టిన సూక్ష్మజీవుల సిద్ధాంతం (జర్మ్‌ థియరీ) ఆధారంగా నేడు మనం పాలను సురక్షితంగా (పాశ్చరైజ్‌ చేసి) వాడుకుంటున్నాం. జర్మ్‌ థియరీ ద్వారా అంటురోగాలకు సంబంధించిన కారకాలను కనుగొని, నియంత్రించడానికి తోడ్ప డింది. శస్త్రచికిత్స ఇతరత్రా సమయాల్లో ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఆధునిక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఈయన కనిపెట్టిన శాస్త్ర విజ్ఞానమే తోడ్పడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన పరిశోధనల ఫలితాలను వ్యాక్సినేషన్‌, ఫర్మింటేషన్‌, పాశ్చరైజేషన్‌ (కాచి, చల్లార్చడం)తో నిత్యజీవితంలో మానవాళి పలు ప్రయోజనాలు పొందుతోంది.

No comments:

Post a Comment