Tuesday 15 October 2013



మైక్రోవేవ్స్‌ వల్ల వేడి పుడుతుందా?
 
     మైక్రోవేవ్స్‌ వల్ల వేడి పుడుతుందా? ఇలా పుట్టిన వేడితో ఆహారపదార్థాల్ని వేడిచేసు కోవచ్చా? అలాంటి ఆహారం వల్ల ఆరోగ్యానికి హాని ఉందా?
                                                                                           - గండి కోట వెంకటశేషయ్య

               ఏ యానకమూ లేకుండా శూన్యంలో కూడా ప్రయాణించగల శక్తి రూపం కాంతి. ఇది విద్యుదయస్కాంత తరంగాల (వశ్రీవష్‌తీశీఎaస్త్రఅవ్‌ఱష షaఙవర) రూపంలోను, కాంతి కణాల (జూష్ట్రశ్‌ీశీఅర) ధారా రూపంలోనూ ఏకకాలంలో కణ తరంగ ద్వంద్వ స్వభావాన్ని (షaఙవ-జూaత్‌ీఱషశ్రీవ సబaశ్రీఱ్‌y) ప్రదర్శిస్తూ ప్రయాణిస్తుంది. ఇలాంటి తరంగాలు నీటి మీద అలలు ఒడ్డుకు చేరినట్లు భావించినట్లుగా ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణిస్తాయి. అల ఒక శిఖరానికి, తర్వాతి శిఖరానికి మధ్య ఉన్న దూరాన్ని తరంగదైర్ఘ్యం (షaఙవశ్రీవఅస్త్ర్‌ష్ట్ర) అంటారు. ఇలా కాంతిలో తరంగదైర్ఘ్యం కొన్ని వందల కిలోమీటర్లు ఉండే తరంగాలున్నాయి. ఒక మిల్లీమీటర్లో వెయ్యికోట్ల వంతు తరంగ దైర్ఘ్యమున్న తరంగాలూ ఉన్నాయి. మనం ఆల్‌ ఇండియా రేడియో ఆకాశవాణి కేంద్రాల వారు ప్రసారం చేసే తరంగాల తరంగదైర్ఘ్యం కొన్ని వందల మీటర్లు ఉంటుంది. మైక్రోవేవ్స్‌లోని తరంగాల తరంగదైర్ఘ్యం మిల్లీమీటర్లో 100వ వంతు నుంచి వేయి లేదా 10 వేల వంతు పొడవు తరంగదైర్ఘ్యమున్న తరంగాలున్నాయి. మనకు సూర్యుడికాంతిలో వేడిని కలిగించే పరారుణ కిరణాల (ఱఅటతీaతీవస) తరంగదైర్ఘ్యం ఇంకా తక్కువ ఉంటుంది. మనం కంటితో చూడదగిన దృశ్యకాంతి (ఙఱరఱbశ్రీవ శ్రీఱస్త్రష్ట్ర్‌) లోని కాంతి తరంగాల తరంగదైర్ఘ్యం మిల్లీమీటర్లో లక్ష భాగంలో ఉంటుంది. ఇలా తరంగదైర్ఘ్యం ఇంకా తక్కువ ఉన్న అతినీలలోహిత (బశ్ర్‌ీతీaఙఱశీశ్రీవ్‌) కిరణాలు, శ- కిరణాలు, గామా కిరణాలు, విశ్వ కిరణాలున్నాయి. కిలోమీటర్ల స్థాయి నుంచి ఫెమ్టో మీటరు (మీటర్లో 10 కోట్ల కోట్ల వంతు) స్థాయి వరకు ఉన్న కిరణాల వైవిధ్యం ఎంతగా ఉన్నా, వాటన్నింటికీ ఓ సారూప్యత ఉంది. ఇవన్నీ శూన్యంలో ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. ఆ వేగం విశ్వంలో స్థిరం. దాన్నే కాంతివేగం (శ్రీఱస్త్రష్ట్ర్‌ ఙవశ్రీశీషఱ్‌y) అంటారు. ఇది 3×108 మీటర్లు /సెకను. అంటే కాంతి శూన్యంలో సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే సాధనంగానీ, శక్తి రూపంగానీ ప్రపంచంలో మరోటి లేదు. అడపాదడపా శాస్త్రం పేరుతోను, కుహనా శాస్త్ర పరిభాషలోను ఇంతకన్నా వేగంలో ప్రయాణించే రూపాలున్నట్లు వాదాలున్నా ఆ వాదాలకు ఋజువులు లేవు. కాంతి కిరణాలకు మరోతత్వం కూడా ఉంది. ఇవి పదార్థంతో కలియబడతాయి (ఱఅ్‌వతీaష్‌ఱశీఅ). అంటే పదార్థాల మీద వీటి ప్రభావం ఉంటుంది. సూక్ష్మ తరంగాలు లేదా, మైక్రోవేవ్స్‌ తరంగాలు పదార్థాల్లో ఉన్న అణువుల్లోని పరమాణవుల మధ్య ఉన్న రసాయనిక బంధాల్ని కొంతమేర లూజు చేస్తాయి. తద్వారా అణువుల్లో కదలికలు ముఖ్యంగా తిరగడం అనే యాంత్రిక చర్యలు పెరుగుతాయి. ఇలా అణువుల్లో కలిగే బంధాల కదలికలు, తిరుగుళ్లు, ప్రకంపనలు (ఙఱbతీa్‌ఱశీఅర), డోలనాల (శీరషఱశ్రీశ్రీa్‌ఱశీఅర) సంయుక్త ప్రభావమే పదార్థాల్లోని వేడికి అర్థాన్నిస్తాయి. వేడి అంటే ఇదే. మైక్రోవేవ్‌ వోవెన్‌ (వీఱషతీశీషaఙవ శీఙవఅ) లో ఆహార పదార్థాల్ని పెట్టినప్పుడు ఆ ఆహారపదార్థాల్లో ఉన్న నీటి అణువులు బాగా కంపిస్తాయి. అంటే ఆ వేడి ఆ నీటిని దాదాపు ఆవిరయ్యేలా చేస్తుంది. ఆ క్రమంలో ఆ నీటి చెమ్మలో భౌతికస్పర్శలు ఉన్న ఇతర పదార్థాలు కూడా వేడెక్కుతాయి. ఒకవేళ నీళ్లు లేకున్నా కేవలం నూనెలే ఉన్నా నూనెలో ఉన్న అణువుల కదలికల్ని మైక్రోవేవ్స్‌ పెంచుతాయి. తద్వారా నూనెలు కూడా వేడెక్కుతాయి. కానీ పింగాణి, మరికొన్ని ప్లాస్టిక్‌ పదార్థాల్ని మైక్రోవేవ్స్‌ కదిలించలేవు. అందువల్లే మైక్రోవేవ్‌ పొయ్యిలో పెట్టే పదార్థాల్ని పింగాణి, గాజు, పాలికొర్పానేట్‌, మేలమిన్‌ వంటి పదార్థాల పాత్రల్లో పెడతారు. లోహపాత్రల్లో పెడితే ఆ తరంగాల శక్తిని పాత్రలే గ్రహిస్తాయి. లోనున్న ఆహారపదార్థాలకు వేడి అందదు. మైక్రోవేవ్‌ ఓవెన్లలో వేడి చేయడం వల్ల ప్రత్యేకంగా కొత్త ప్రమాదం ఏమీ లేదు. కోడిగుడ్డు వంటి వాటిని అధిక ప్రొటీన్‌ ఉన్న పదార్థాల్ని పెడితే పాత్రలు పేలిపోయే ప్రమాదముంది. మైక్రోవేవ్‌ పొయ్యిల్లో ఆహార పదార్థాల్ని (అవి అప్పటికే చెడిపోయి వాసన వస్తున్నవి కాకుంటే) వేడిచేసి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమీ రావు. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టుకోవాల్సిన అవసరం రాకుండానే పరిమితంగా వండుకొని, వేడిగా ఉన్నప్పుడే తినడం ఇంకా మంచిది. శక్తి ఆదా అవుతుంది.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక 

Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment