Tuesday 5 November 2013

జయహో.. ఇస్రో అరుణోదయం

  • 06/11/2013


                 300 రోజుల ప్రయాణం 9లక్షల కిలోమీటర్ల గమనం లక్ష్యం
షార్‌లో నింగికెగసిన ఆనందం అగ్రరాజ్యాల సరసన భారత్ కీర్తిపతాక
నెల్లూరు, సూళ్లూరుపేట, నవంబర్ 5: అంగారక గ్రహంపై పరిశోధనలు సాగించగలమంటూ
భారత శాస్తవ్రేత్తల బృందంలో భరోసా కలిగించే అపూరూప ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం
 మధ్యాహ్నం సరిగ్గా 2.38 నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌నుంచి పిఎస్‌ఎల్‌వి సి-25 రాకెట్
 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఆనందానికి అవధుల్లేవు.
 ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సహా శాస్తవ్రేత్తల బృందం భారతీయుల అభినందలు అందుకుంన్నారు. గత
జిఎస్‌ఎల్‌వి డి-5 ఆకస్మికంగా వాయిదా పడినా, షార్ శాస్తవ్రేత్తల బృందం నిరుత్సాహ పడక ప్రస్తుత
ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ప్రయోగానికి మొక్కవోని పటిమ చూపారు. పిఎస్‌ఎల్‌వి సి-25
విజయవంతమై మాస్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం) కక్ష్యలోకి చేరుకోవడం వల్ల భారత్ అగ్రారాజ్యాల
 సరసన చేరుకుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే ఇప్పటి వరకు అంగారక యాత్రలో
సఫలీకృతమయ్యాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ మొదటి
ప్రయోగ వేదిక నుంచి పిఎస్‌ఎల్‌వి సి-25ని నింగిలోకి పంపారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్
 ప్రక్రియ 56.30 గంటల ముందే ప్రారంభమైంది. కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలించడంతో
రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగానికి పది నిమిషాల ముందు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలు సూపర్
 కంప్యూటర్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. సరిగ్గా ప్రయోగ సందర్భంలో ప్రథమ దశలోని స్ట్ఫ్రాన్ మోటార్లను
మండించడంతో పిఎస్‌ఎల్‌వి సి-25 రాకెట్ రోదసిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. అంగారక
యాత్ర ప్రయోగం విజయవంతం కావడంతో షార్ ఒక్కసారిగా సందడి వాతావరణంతో నిండిపోయింది.
 పిఎస్‌ఎల్‌వి సి-25 ప్రయోగంతో కక్ష్యలోకి చేరిన మాస్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం) మూడు వందల రోజుల
 తరువాత తొమ్మిది లక్షల కిలోమీటర్ల గమనం సాగించి అంగారక కక్షలోకి చేరుకుంటుందని శాస్తవ్రేత్తలు
చెపుతున్నారు. అంగారకుడిపై వాతావరణ, పర్యావరణ పరిస్థితులు, సూర్యకిరణాల వ్యాప్తి, ఉష్ణోగ్రత, మట్టి,
 రాళ్లలో ఉండే ఖనిజ సంపదపై పరిశోధలు చేసేందుకు ఉపకరించే వివిధ పరికరాల్ని ఎంఓఎంలో అమర్చారు.
వీటి ద్వారా తటస్థ అణువుల వివరాలు, మిథేన్ గ్యాస్ సమాచారం, హైడ్రోజన్, హీలియంల వివరాలను
తెలుసుకుంటారు. ఉపగ్రహంలో అమర్చిన ఐదు పరికరాల బరువు15 కిలోల వరకూ ఉంది. మొత్తం ప్రయోగం
కోసం ఇస్రో 450 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసింది. ఇదిలావుంటే సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూమి,
 అంగారక గ్రహాల నడుమ సుమారు నాలుగు వందల మిలియన్ కిలోమీటర్ల దూరం వరకూ ఉంటుంది.
ఈ రెండు గ్రహాల పరిభ్రమణంలో 780 రోజులకు ఓ పర్యాయం 44 డిగ్రీల కోణంలో చేరువ అవుతుంటాయి.
సరిగ్గా ఇదే సందర్భంలో కృత్రిమ ఉపగ్రహాల్ని అంగారకుడి గమనంలోకి పంపించే ప్రయోగాలు జరుగుతుండటం
పరిపాటి.  కలిసొచ్చిన సెంటిమెంట్ప్ర యోగానికి ముందు రోజున పిఎస్‌ఎల్‌వి సి-25 నమూనా రాకెట్‌కు
తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో, శ్రీ కాళహస్తిలో, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా
 కార్యక్రమాలను నిర్వహించారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో పూజా కార్యక్రమాల్ని చేపట్టారు.
శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయని గత కొన్ని ప్రయోగాలకు ముందునుంచీ ఇదే సెంటిమెంట్
కొనసాగుతోంది.
ముఖ్యాంశాలు
* ఆసియా ఖండంలోనే అంగారక యాత్రలో విజయవంతమైన తొలి అడుగు వేసిన దేశంగా భారత్‌కు ఖ్యాతిదక్కింది.
* భారతదేశ రాకెట్ ప్రయోగాల్లో 50వ సంవత్సరం అంగారక యాత్రకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు.
* పిఎస్‌ఎల్‌వి సి-25 రాకెట్ 23566 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎంఒఎం ఉపగ్రహాన్ని భూకక్షలోకి చేర్చింది.
* సెకనుకు 9.3 కిలోమీటర్ల వేగంతో రాకెట్ దూసుకెళ్లింది.
* మొత్తం ఐదు దశల్లో అంగారక కక్ష్యలో చేరనుండగా తొలి, కీలకమైన రాకెట్ ప్రయోగం ద్వారా కృత్రిక ఉపగ్రహం
 అంగారకుడి దిశగా భూకక్ష్యలోకి చేరుకోవడం విశేషం.
రోదసి పరిశోధనల్లో భారత్ సాధించిన నిరుపమాన విజయమిది. ఈరోజు మన రోదసి కార్యక్రమంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
-రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ
ఇదో చారిత్రక విజయం. దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేసిన శాస్తవ్రేత్తలకు అభినందనలు. -ప్రధాని మన్మోహన్
ఇదో అద్భుతమైన విజయం. అంతరిక్షంలో భారత నిరుపమానతకు నిదర్శనం. చారిత్రక విజయం సాధించిన శాస్తవ్రేత్తలను అభినందిస్తున్నాను
.
Courtesy with: Andhra Bhumi Daily

No comments:

Post a Comment