Sunday 12 January 2014

                         సత్యం కోసం నిలిచిన గెలీలియో


                సత్యం కోసం నిలిచిన గెలీ లియో జీవితచరిత్రను చదవాలి. సమాజాన్ని వెనక్కు నడపాలనుకునే మత ఛాందసుల దుర్మార్గాలను ఎది రించి నిలిచిన గెలీలియో ధన్యజీవి. విశాల విశ్వంలో భూమి యొక్క స్థానం గురించి అంతకు పూర్వం ఉన్న అభిప్రాయాలను, సిద్ధాంతాలను పటా పంచలు చేస్తూ కొత్త నిర్వచనాన్ని అందించిన విజ్ఞానశాస్త్ర పితా మహుడు గెలీలియో గెలిలి. టెలి స్కోపును అభివృద్ధి చేసి సుదూర అంతరిక్ష గ్రహరాశుల చలనాలను గుర్తి ంచి సమకాలీన ప్రపంచంలో పెద్ద సంచలనం సృష్టించాడు. అంతకు ముందు గుర్తించిన ఏడు గ్రహాలతో అంతరిక్షం పరిమితం కాలేదని, ఇతర గ్రహాలు కూడా ఉన్నాయని కను గొన్నాడు. విశ్వానికి కేంద్రం సూర్యు డని, భూమి కేంద్ర సిద్ధాంతాన్ని బద్దలు కొట్టాడు. ఇది ప్రకటించినందుకే తీవ్ర విమర్శలకు, కఠోర శిక్షలకు గురై గెలీలీయో అష్ట కష్టాలు పడ్డాడు. ఆనాడు ఇటలీ దేశ ప్రజల జీవిత సమస్త అంశాల మీద చర్చి ఆధిపత్యం కొనసాగుతుండేది. మత పెద్దలు జారీ చేసిన ఆజ్ఞలను తూచా తప్పక పాటించే పరిస్థితి. మత దుర హంకార మూఢా చారాలకు, శాస్త్రీయ దృక్పథానికి నడుమ భీకరమైన పోరు సాగింది. విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చిందన్న విషయమై బైబుల్‌ గాని, ఖురాన్‌ గాని, వేదాలుగాని వేటిలోనూ వాస్తవ సమాచారం లేదు. సమాజ యథాతథ స్థితిని కాపాడటం, ప్రజల్ని కటువైన జీవిత వాస్తవాలు చూడ కుండా చేయటం పాలకవర్గాలకు అవసరం. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే సమాజాన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తారు. వర్గ సమాజంలో దోపిడీ తీవ్రతను మరుగు పరచటానికి మతం పాలకవర్గాల చేతిలో సాధనం.1600 సంవత్సరంలో భౌగోళ శాస్త్రజ్ఞుడైన 'బ్రూనో' సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసినందుకు మత పెద్దలు చర్చి కోర్టులో విచారణ చేసి కొయ్య స్తంభానికి పెడరెక్కలు విరిచికట్టి దహనం చేశారు.1564 ఫిబ్రవరి 15న ఇటలీలోని పీసా పట్టణంలో గెలీలియో జన్మిం చాడు. వైద్య విద్యార్థిగా ప్రారంభమై శాస్త్ర విజ్ఞానిగా మారాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని కోపర్నికస్‌ చెప్పిన సిద్ధాంతాన్ని బల పరుస్తూ గెలీలియో ప్రజల వాడుక భాషలో రాసిన పుస్తకం మతశక్తులకు ఆగ్రహా వేశాలు కలిగించింది. 1611లో గెలీలియో రోమ్‌ వెళ్లినపుడు స్థానిక శాస్త్ర వేత్తలు అభినందనలతో ముం చెత్తారు. 1613లో 'లెటర్‌ ఆన్‌ ది సన్‌ స్పాట్స్‌' పుస్తకం ద్వారా కోపర్నికస్‌ సిద్ధాంతాన్ని బలపరిచాడు. దీనిపై మత గురువులు మండిపడ్డారు. గెలీలియో ప్రయోగాలు మత ధిక్క రణగా నిర్ధా రణకు వచ్చి, 'మత ద్రోహ విచారణ'కు గెలీలియోను గురి చేయాలని మత పెద్దలు నిర్ణయి ంచారు. గెలీలియో రాసిన గ్రంథా లన్నిటినీ నిషే ధించారు. జీవితకాల శిక్ష విధిం చారు. 70 ఏళ్ళ వృద్ధాప్యంలో గెలీలియో ఈ శిక్షకు గుర య్యాడు. చివరి దశలో 'డూ న్యూసైన్సెస్‌' గ్రం థాన్ని నిర్బం ధంలోనే పూర్తి చేసి, ప్రొటెస్టెంట్‌ల ప్రాబల్యమున్న హాలె ండ్‌లో ప్రచురిం పజేశారు. సుదీర్ఘ కాలం ఆకాశాన్ని పరిశీ లించ డం తోనూ, గ్రంథ రచన చేయ టంతోనూ కంటి చూపు మంద గించింది. గృహ నిర్బంధంలోనే ఆయన అంధుడుగా మారాడు. అస్వస్థుడుగా మూడు నెలలు మంచంలో ఉండి 1642 జనవరి 8న తన 78వ ఏట మరణించాడు.

Courtesy with: Praja sekthi Dialy

No comments:

Post a Comment