Tuesday 25 February 2014

  
భూతాపం ఎవరి పాపం?



 మనం సమాజాభివృద్ధికి భూమిపై ఉన్న కొండల్ని, అడవుల్ని, ఇసుకని వాడి ఆనకట్టలు, రోడ్లు, వంతెనలు, భవనాలు నిర్మిస్తున్నాం. అలాగే భూమి లోపల వనరులుగా ఉన్న బొగ్గు, చమురు, గ్యాస్‌ను కరెంటు యంత్రాలను, వంట మొదలైన వాటికి ఉపయోగిస్తు న్నాం. పైన తెల్పిన వాటి అన్నింటివలన ఇప్పటికే భూమి ఉష్ణోగ్రత, కాలుష్యం పెరిగి, పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. మనుషులు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇలాగే మరో 200 సంవత్సరాలు సాగితే భూమి పైనా, లోపలా ఉన్న వనరులన్నీ అయిపోతాయని భావించాల్సి వస్తుంది. అదే జరిగితే అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? ఎలా బతుకుతాం?
- మెట్టు కోటిరెడ్డి, గుంటూరుజిల్లా
అభివృద్ధి అనే మాటకు ఈ మధ్య అర్థాలు మారిపోతున్నాయి. సాధారణ పరిభాషలో 'అభివృద్ధి' అంటే అభ్యుదయం వైపు వెళ్తు న్న సామాజిక గతిని సూచించే పదంగా భావిస్తాము. కానీ ూూ+ (ూఱbవతీaశ్రీఱఝ్‌ఱశీఅ, ూతీఱఙa్‌ఱఝ్‌ఱశీఅ aఅస +శ్రీశీbaశ్రీఱఝ్‌ఱశీఅ) ఆర్థిక విదానాలు ప్రపంచాన్నంతా శాసిస్తున్న తరుణంలో రాజకీయ వ్యవస్థలు, వాటితో పెనవేసుకున్న సాంస్కృతిక, సామాజిక వ్యవస్థలకు చెందినవారు 'అభివృద్ధి' అనే పదాన్ని ఎవరికి తోచినట్టు వారు వాడుకుంటున్నారు లేదా వక్రీకరిస్తున్నారు. సాపేక్షతా సిద్ధాంతా (ుష్ట్రవశీతీy శీట =వశ్రీa్‌ఱఙఱ్‌y) న్ని గుర్తుకు తెచ్చేవిధంగా నేడు 'అభివృద్ధి'కి భాష్యం అల్లుతున్నారు. కొందరి అభివృద్ధినే చూపిస్తూ, ఎందరో అణగారిపోతున్న ఆ దురవస్థను కనుమరుగు చేస్తూ మొత్తం సమాజమే అభివృద్ధి చెందుతోంది చూడమంటున్నారు. 
ఈ విశాల విశ్వంలో మనకు తెలిసినంతవరకూ మరేచోటా భూమిలాంటి గ్రహం లేదు. ఇన్ని లక్షల జీవజాతులకు, ఇంతటి సుందర నదీనదాలకు, సోయగాలకు మరెక్కడా ఆనవాళ్లు లేవు. ప్రకృతిని శాసించే స్థాయి కేవలం మానవజాతికి తప్ప మరో ఏ ఇతర జీవికీ లేదు. మనం ఏ వూరికెళ్లినా మన గుండె పంపు చేసే రక్తంతోనే బతుకుతాము. మనం ఏ సంస్థలోకి వెళ్లినా మన మెదడునే వాడుకుని నడుచుకొంటాము. ఈ వూర్లో ఓ గుండె, మరో వూర్లో మరో గుండె మనకు ఉండదు. ఆ సినిమా హాల్లో ఈ మెదడు, ఇంకో మైదానంలో రెండో మెదడు వాడము. అలాగే మనం ఎక్కడికి వెళ్లినా, ఎన్ని రోజులైనా ఈ భూమ్మీద ఉండే ఆక్సిజన్‌ను, ఈ భూమి ఇచ్చిన నీటిని, ఈ నేలలో పండిన గింజల్ని తిని, బతుకుతాము. మనము ఈ రోజు భూమిలో దొరికిన బఠాణీలు, మరో రోజు చంద్రుడి నుండి దిగుమతి అయిన బత్తాయి పళ్లు తినము. కాబట్టి ప్రకృతిలో ఉన్న వనరులే మన ఉనికికి కారకాలు. వాటిని వాడుకోకుండా మనం ఏమాత్రం జీవించలేము. అయితే అదే ప్రకృతిలో కొన్ని చక్రీయ వ్యవస్థల ద్వారా మనం, ఇతర జీవజాతులు వనరుల్ని వాడుకున్నా అవి పునరుత్పత్తి అయ్యే అనుకూలత ఉంది. ఉదాహరణకు మనము, చెట్లు, పురుగులు, జీవులు జీవించే క్రమంలో ఆహారాన్ని, గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి రసాయనిక శక్తి ద్వారా బతుకుతున్నాయి. ఆ క్రమంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ విపరీతంగా విడుదలవుతుంది. ఆరు అణువుల ఆక్సిజన్‌ను స్వీకరిస్తే, ఆరు అణువుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేసేలాగా చాలా జీవ పక్రియలు ఉంటున్నాయి. కానీ ఆక్సిజన్‌లో ఉన్న బంధాలకన్నా కార్బన్‌ డై ఆక్సైడ్‌లో ఉన్న బంధాల సంఖ్య ఎక్కువ. బంధాల సంఖ్య తక్కువ ఉన్న అణువుల కన్నా రసాయన బంధాలు ఎక్కువ ఉన్న అణువులే గాలిలో వేడిని పెంచుతాయనేది ఉష్ణగతిక శాస్త్ర నియమం (ూతీఱఅషఱజూశ్రీవ శీట ుష్ట్రవతీఎశీసyఅaఎఱషర). ఉదాహరణకు మానవులకు, లక్షలాది ఇతర వృక్ష జంతు జాతులకు ప్రాణాన్ని ఇచ్చే శ్వాసక్రియలో ఘన (లేదా రక్తంలోను, కణద్రవంలోను కరిగి ద్రవ) స్థితిలో ఉన్న గ్లూకోజు అణువు (జ6న12ఉ6) లో 23 లింకులు ఉన్నాయి. బంధం ద్విబంధం అయినా ఒకే లింకుగా భావించాలి. కానీ ఆరు లింకులే ఉన్న ఆక్సిజన్‌ (ఉ2) తో కలిసి ఆరు నీటి (న2ఉ) అణువుల్ని, ఆరు కార్బన్‌ డై ఆక్సైడ్‌ (జఉ2) అణువుల్ని ఏర్పరుస్తుంది. మొత్తం క్రియాజనకాల్లో వెరసి 29 లింకులున్నాయి. క్రియాజన్యాల్లో మొత్తం 24 లింకులే ఉన్నాయి. కాబట్టి క్రియాజనకాలలోనే ఎక్కువశక్తి దాగి ఉందన్న మాట. కానీ గ్లూకోజు వాయుస్థితిలో లేదు. కేవలం ఆక్సిజన్‌ మాత్రమే వాయుస్థితిలో ఉంది. గాలిలో వేడిని కలిగించే లక్షణం గాలి రూపంలో ఉన్న అణువులకే సాధ్యం. అంటే బంధాల లింకులు దండిగానే ఉన్నా గ్లూకోజు వల్ల గాలికి కలిగే నష్టం లేదు. కానీ క్రియాజన్యాల్లో 24 లింకులూ గాలి రూపంలోనే ఉంటాయి. (ఏర్పడిన నీటి అణువులు కొన్ని నీటి ఆవిరి రూపంలో గాలిలో ఉంటాయి). సేంద్రీయ పదార్థాలైన గ్లూకోజు, పెట్రోలు, బొగ్గు వంటివి మండితే వాతావరణం వేడెక్కుతుంది. దీనినే మనం భౌగోళిక తాపా (+శ్రీశీbaశ్రీ షaతీఎఱఅస్త్ర) నికి దారితీసే చర్యగా భావిస్తున్నాము. అయితే ప్రకృతిలో అదే జఉ2, న2ఉ లను కిరణజన్య సంయోగక్రియ (ూష్ట్రశ్‌ీశీ రyఅ్‌ష్ట్రవరఱర) ద్వారా తిరిగి చక్రీయంగా గ్లూకోజుగా మారే యంత్రాంగం ఉంది. కాబట్టి ప్రకృతిని ప్రకృతి సిద్ధంగా ఉంచినట్లయితే జీవులకు కావలసిన గ్లూకోజును తయారుచేసి వడ్డించడమే కాకుండా, ఆ జీవనచర్యల్లో ఏర్పడే తాప వాయువులు (స్త్రతీవవఅష్ట్రశీబరవ స్త్రaరవర) మితిమీరకుండా సర్దుబాటూ చేస్తుంది. కానీ తాప వాయువుల విడుదలకన్నా వాటి చక్రీయ వినిమయం తగ్గినట్లయితే భౌగోళిక తాపం పెరుగుతుంది. ఇదే మీరన్న అడవుల నరికివేత, పంటపొలాల తగ్గింపు, విపరీతమైన పెట్రోలు, బొగ్గుల వినియోగం, పట్టణీకరణ, వినిమయతత్వం (షశీఅరబఎaతీఱరఎ) వంటి అవాంఛనీయ కార్యకలాపాలు ప్రకృతిలో సమతుల్యం లోపించేలా చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన బాధ్యులు ఎవరు? 
వర్గ దృక్పథంలేని అజ్ఞానంతోను, వర్గ సామరస్యాన్ని ప్రోత్సహించే స్వార్థాలోచనలతోను, సంపన్నుల, బహుళజాతి సంస్థల, సామ్రాజ్యవాద శక్తుల తప్పుల్ని కప్పిపుచ్చే కపట బుద్ధితోను కొందరు పర్యావరణ వాదులు 'మానవుడు స్వార్థజీవి, మానవుడి స్వార్థానికి ప్రకృతి వనరులు సన్నగిల్లుతున్నాయి. మానవుడు తాను కూచున్న కొమ్మను తానే నరుకుతున్నాడు. మానవుడు ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేయడం మాననంతవరకు మన మానవజాతికి మనుగడలేదు!' అనే పెద్ద పెద్ద పదాలు వాడుతూ మొసలి కన్నీరు కారుస్తుంటారు. 'మానవుడు' అంటూ తప్పంతా అందరిదీ అయినట్లు సమస్యను పక్కదారి పట్టించి, పరిష్కారం లేని సమస్యగా చూపుతారు. ప్రపంచంలో ఉన్న సకల వనరుల్లో 90 శాతం పైచిలుకు కేవలం 10 శాతం కన్నా తక్కువ ఉన్న సంపన్నుల చేతిలో ఉన్నాయి. వారి అభివృద్ధికే అవి ఖర్చవుతున్నాయి. మిగిలిన 10 శాతం వనరులే 90 శాతం మంది ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మరి వీరెలా ప్రకృతి వినాశనానికి, వనరుల దుబారాకు కారణమవుతారు? మీరన్న సమస్యకు పరిష్కారం కేవలం ప్రజా పోరాటాల ద్వారానే వీలవుతుంది. 'ప్రజల కోసం సైన్సు, ప్రగతి కోసం సైన్సు' అంటూ నినదించే జనవిజ్ఞాన వేదిక వంటి అభ్యుదయ సంస్థల కార్యకలాపాలు పెరిగి, ప్రజా సైన్సు ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా నడిస్తేనే సమతౌల్యాభివృద్ధి జరిగి, భవిష్యత్తుకు ఏమాత్రం ఢోకా లేకుండా మానవజాతి భాసిల్లగలదు. ఒక అంచనా ప్రకారం, ''సమసమాజ ఆర్థిక ప్రపంచ ప్రజలందరూ పొందగలరట. పైగా ప్రకృతివనరులు ఇపుడున్న దుబారా కన్నా 200 రెట్లు తక్కువ వినియోగంలోనే అది సాధ్యం కాగలదట. కాబట్టి పరిస్కారం లేని సమస్యగా మీ ప్రశ్నను చూడకూడదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

No comments:

Post a Comment