Wednesday 20 June 2012

ఎనిమిది గ్లాసుల నీళ్లు అవసరమా..?


రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది అనేది ఇప్పటివరకూ ఉన్న ఒక నమ్మకం. మానవులు తమ శరీరాలలో నీటి సమతుల్యత కాపాడుకోవడానికే నీరు తాగాలి. అందుకు నీరు అవసరమైనప్పుడే తాగడం మంచిది. రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం వల్ల ఒనగూడే లాభం పెద్దగా లేదు అంటున్నారు నిపుణులు. పండ్లు, పండ్ల రసాలు, కాఫీ, టీ కూడా బోలెడు నీటిని అందిస్తాయి. ఒక ఉడకబెట్టిన దుంపలో 75 శాతం నీరు ఉంటుంది. అందువల్ల, కేవలం నీటినే తాగడం వల్ల ఏదో మాజిక్‌ జరగదని పరిశోధకులు భావిస్తున్నారు. మన దాహం మనకి ఎంత నీరు కావాలో చెబుతుంది. లేదంటే మూత్రం కూడా ఎంత నీరు కావాలో హెచ్చరిస్తుంది. మూత్రం మరీ పసుపుగా ఉంటే నీటి అవసరం ఎక్కువ. మూత్రం మరీ నీళ్ళలాగా కనబడితే మాత్రం నీరు ఎక్కువైనట్టే లెక్క.
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

No comments:

Post a Comment