Thursday 30 August 2012

పండ్లను తాజాగా ఉంచే 'స్ప్రే'!


రొయ్యలు, పీతల పెంకులలోని ఒక పదార్థంతో తయారుచేసిన స్ప్రేతో అరటికాయ త్వరగా పండుగా మారకుండా ఆలస్యం చేయవచ్చట. ఇలా రెండువారాల పాటు చెడిపోకుండా ఉంచవచ్చట. చైనాలోని తియాన్జిన్‌ యూనివర్శిటీలో పనిచేసే శిహాంగ్‌ లీ అనే శాస్త్రవేత్త ఈ స్ప్రేని రూపొందించాడు. 'కైటోసాన్‌' అనే పదార్థంతో చేసిన స్ప్రే కాయల్లో సహజ మార్పులను అరికడుతుంది. తద్వారా కాయలుగానీ పండ్లుగానీ చెడిపోకుండా మరికొన్ని రోజులపాటు నిల్వ ఉంటాయట. ఇదే ఆచరణలోకి వస్తే ఇంటిలోనూ, సూపర్‌ మార్కెట్లలోనూ ఈ స్ప్రే బాగా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment