Sunday 30 December 2012

కంటిచూపుతోనే..!

సూక్ష్మ సాంకేతికత (నానో టెక్నాలజీ) ఆవిర్భావంతో అద్భుతాలు జరిగే అవకాశాలు అధికమౌతున్నాయి. ఇంతవరకూ రానురాను చిన్నవవుతూ వస్తున్న ఉపకరణాలు ఇకపై మన చూపుల మాటలు వినే దిశగా అభివృద్ధిచెందనున్నాయి. ఒకప్పుడు బటన్లను నొక్కితేనే పనిచేసే ఫోన్లు ఇప్పుడు కేవలం సుతారమైన స్పర్శతోనే స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో స్క్రీన్‌పై మనకు కావలసిన ఐకాన్‌పై కాసేపు దృష్టి సారిస్తే చాలు, అవి స్పందించి పనిచేస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి సూత్రం ఉపయోగ పడుతుందో ఇంకా వెల్లడించలేదు. మొత్తానికి, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు కంటిచూపుతో పనిచేసేరోజులు త్వరలో రానున్నాయని హాలెండ్‌ పరిశోధకులు సెలవిస్తున్నారు.

No comments:

Post a Comment