Wednesday 25 April 2012

గ్రహాలు.. అవగాహన..


  • ఎందుకని? ఇందుకని!
గతవారం సూర్యకుటుం బంలో సూర్యుడితో పాటే భూమి కూడా ఏర్పడిందనీ, తొలిరోజుల్లో అది కూడా స్వయంప్రకాశకమనీ తెలుసుకు న్నాం. మధ్యలో సూర్యుడు, దానిచుట్టూ గ్రహాలు, గ్రహాలచుట్టూ ఉపగ్రహాలు రావడం గురుత్వ బలాల (gravitational forces) ప్రభావమే! ఆధునిక భౌతికశాస్త్ర పరిజ్ఞానం రానంతవరకూ ప్రపంచంలో పురాణగ్రంథాలు, బైబిల్‌ తదితర విశ్వాసాల్లో భూమే కేంద్రం. ఈ సిద్ధాంతాన్నే భూ కేంద్రక సిద్ధాం తం (Geocentric Theory)అనేవారు. భూ కేంద్రక సిద్ధాం తానికి కొద్దోగొప్పో శాస్త్రీయ పదజాలాన్ని ఉటంకించిన వారిలో టోలెమీ ((Ptolemy- క్రీ.శ.90-168) సుప్రసిద్ధుడు. ఆయన ప్రకారం మధ్యలో భూమి ఉండగా దానిచుట్టూ చంద్రుడు (Moon), బుధుడు (Mercury), శుక్రుడు (Venus), సూర్యుడు(Sun), కుజుడు (Mars), గురుడు (Jupiter)), శని (Saturn) గ్రహాలు తిరుగుతాయి. శనిగ్రహం కన్నా ఆవల ఉన్నది స్వర్గం, స్వర్గంపైన ఉన్నది దైవపేటిక. అది మొత్తం ఈ భూకేంద్రక వ్యవస్థను తిప్పుతుంది.
'టోలెమీ నమూనా'లో ఆధునిక విజ్ఞానం ప్రకారం ఎన్నో అవక తవకలున్నా 2వ శతాబ్దంలోనే కొన్ని గ్రహాలను గుర్తించగలగడం, ఏ పరికరాలు లేకున్నా కొన్ని ఆవిష్కరణలు ఆవిష్కరించడం ఆనాటి శాస్త్రజ్ఞుల విజ్ఞతకు చిహ్నం. అయితే ఆ నమూనానే పట్టుకొని వేలా డడం జ్యోతిశ్శాస్త్రం (Astrology)చేస్తున్న మూఢత్వ ప్రచారం. టోలెమీ వంటి ఎందరోచేసిన పాక్షిక సత్యమైన నమూనాను వ్యతి రేకిస్తూ సాధనలేమీ వాడకుండానే హైపేషియా (క్రీ.శ. 370-415) అనే గ్రీకు గణితశాస్త్రజ్ఞురాలు సమీకరణాల ద్వారానే ఇతర గ్రహాలకు భూమి కేంద్రం కాలేదని ఋజువు చేసింది. సూర్యుడే కేంద్రంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువని ప్రతిపాదించింది. ఆమె ప్రతిపాదించిన సూర్యుకేంద్రక సిద్ధాంతం (Heliocentrie Theory) నచ్చని పురుష దురహం కారానికి అండగా భూకేంద్రక సిద్ధాంతానికి వంతపాడే రాచరిక వ్యవస్థ తోడవడంతో ఆమెను పరమ కిరాతకమైన రీతిలో (బహిరం గంగా వివస్త్రను చేసి, ఆల్చిప్పలతో శరీరాన్ని ముక్కలు చేసి) చంపారు నాటి ఛాందసులు. ఇదే వాదనను తన భౌతికవాద దృక్ప థంలో అంతర్భాగంగా ప్రవచించిన బ్రూనో (1548 -1600) ను సజీవదహనం చేశారు. ఆయన రోమ్‌చక్రవర్తితో 'మరణిస్తున్న నాకు.భయం లేదు. నా వాదన మీ పునాదుల్ని కదిలి స్తున్నందున నాకు మరణశాసనాన్ని విధించిన మీకే ఎక్కువ భయం పట్టుకుంది. అబద్ధాల కోసం పిరికి బతుకుకన్నా నిజం కోసం మరణమే నాకు పరమార్థం' అన్నాడు. సత్యాన్వేషణకు, శాస్త్రీయ దృక్పథ ప్రచారానికి, సమసమాజ స్థాపనకు కంకణబద్ధులైన దేశభక్తులకు, సామాజిక సేవాతత్పరులకు బ్రూనో చేసిన ఈ వ్యాఖ్యాలు సదా స్ఫూర్తి దాయకం. 16, 17వ శతాబ్ద కాలంలో గెలీలియో (Galelio, 1564- 1642) తాను రూపొం దించిన టెలిస్కోపు (దూరదర్శిని) సాయంతో అంతకుమునుపు హైపేషియా, బ్రూనో, కోపర్నికస్‌ (Copernicus, క్రీ.శ. 1473- 1543) తదితర శాస్త్రవేత్తలు ప్రతి పాదించిన సౌరకేంద్రక సిద్ధాం తానికి ప్రాయోగిక సాక్ష్యాధారాలతో, సంపూ ర్ణమైన నిర్వివాదమైన రీతిలో సశాస్త్రీ యతను కల్పించాడు. ఆయన సమ కాలీనుడు(contemporary జోహన్సెన్‌ కెప్లర్‌, (Kepler, క్రీ.శ. 1571-1630) తన పేరుతో నేటికీ సుప్రసిద్ధమైన గ్రహగతి సిద్ధాంతాలను (Theory of Planetary Motions) ప్రతిపా దించాడు. గెలీలియో, బ్రూనో, కెప్లర్‌, హైపేషియా, కోపర్నికస్‌ వాదనల బలంతో స్ఫూర్తి పొందిన ఐజాక్‌ న్యూటన్‌ (1642 -1727) తన గణిత మేధోతనంతోను, అద్భుతమైన ప్రాయోగిక ప్రావీణ్యతతోను, పరికరాల సాయంతోను గ్రహాల మధ్య ఉన్న పర స్పర గమనస్థితులకు ఆధారాలను ఇస్తూ గురుత్వ సిద్ధాంతాన్ని(Theory of Gravitation) ప్రతిపాదించాడు. పదార్థాల గమనాలకు సంబంధించిన 3 ప్రాథమిక సూత్రాలను (Newton’s Three Laws of Motion) రూపొందించాడు. అందుకే 2వ సహస్రాబ్దపు అత్యంత మేధోపరమైన శాస్త్రవేత్త లెవరన్న BBCసర్వేలో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తర్వాత న్యూటన్‌ పేరు ఉండడం గమ నార్హం. భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే నడు స్తున్న జ్యోతిశ్శాస్త్రాన్ని, పంచాంగాన్ని, తిధి జన్మనక్షత్రం - రాహూ కాలం-వర్జ్యం వంటి నిరాధార పద్ధతుల్ని, అబ్బాయి, అమ్మాయిల జాతకాలు కుదర్లేదని పెళ్లి ప్రతిపాదనలు రద్దుకావడాలను, మహిళ లను కించపరచే విధంగా నేడు కొందరు రాస్తున్న దౌర్భాగ్యపు సాహిత్యాన్ని సాధారణ నిరక్షరాస్యులకన్నా మరింత అజ్ఞానంతో నమ్ము తున్న, ఆచరిస్తున్న మధ్యతరగతి చదువరులెక్కువ అవుతుండడం ఆందోళన కల్గించే విషయం. ఎవరేమనుకున్నా, ఎవరికి ఇష్టం లేకున్నా గెలీలియో తనను బందీని చేసి, హింసి స్తున్న పాలక ప్రభువుల్ని ఉద్దేశించి.. ''మీ బుర్రల్లో, మీ సాహి త్యంలో, మీ కార్యకలాపాలలో భూమి చుట్టూ సూర్యుడు తిరుగు తున్నా అక్కడ ఆకాశంలో సూర్యుడి చుట్టూనే భూమి తిరుగు తోంది.'' అన్నట్లు ఎవరేమనుకున్నా సూర్యచంద్రులు, రాహు కేతవులు గ్రహాలు కావు. భూమి కేంద్రం కాదు.
ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

No comments:

Post a Comment