Monday 16 April 2012

మన ఉపగ్రహ ప్రస్థానం


భారతదేశపు మొదటి స్పేస్ శాటిలైట్ ఆర్యభట్ట 1975, ఏప్రిల్ 19న ప్రయోగింపబడింది.
భూమిని పరిశీలించడానికి నిర్మించిన భాస్కర ఉపగ్రహాన్ని 1979, జూన్ ఏడున ప్రయోగించారు.
1980, జూలై 18న భారతదేశం తన ఉపగ్రహాన్ని తానే ప్రయోగించింది. శ్రీహరికోట రాకేట్ కేంద్రం నుంచి శాటిలైట్ లాంచ్ వియకిల్ అనే రాకెట్ మీద రోహిణి - 1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఆ తరువాత అంతరిక్ష ఉపగ్రహాల రంగంలో మన దేశం ఎంతో ప్రగతి సాధించింది. వేరు వేరు ఉపయోగాల కొరకు రకరకాల ఉపగ్రహాలను ప్రయోగించింది. రిమోట్ సెన్సింగ్, సమాచార ప్రసార రంగాలలో ప్రగతి ఉపగ్రహాల వల్లనే వీలయింది.
1985 చివరి నాటికి రోహిణి - 3 ఉపగ్రహం ఆధారంగా దేశంలో 70 శాతం జనాభాకు టీవీ అందుబాటులోకి వచ్చింది.
ఎఎస్‌ఎల్‌వీ, జిఎస్‌ఎల్‌వీ, పిఎస్‌ఎల్‌వీ లాంటి లాంచ్ రాకెట్లను మన దేశంలోనే నిర్మించారు.
ఇన్‌సాట్ క్రమంలో వచ్చిన ఉపగ్రహాలు సమాచార రంగాన్ని పూర్తిగా మార్చివేశాయి.
2003 సంవత్సరంలో ఇన్‌సాట్ - 3 ఏ ప్రయోగింపబడింది. ఈ ఉపగ్రహాన్ని నిర్మించింది మన దేశంలోనే అయినా, ఇన్సాట్ ఉపగ్రహాలన్నీ ఫ్రాన్స్ నుంచి అంతరిక్షంలోకి చేరుకున్నాయి.
2007 మార్చి 12న ఇన్సాట్ క్రమంలోని 4 - బి ప్రయోగింపబడింది. ఇది త్రీ-ఏతో కలిసి పనిచేస్తున్నది.

No comments:

Post a Comment