Sunday 15 April 2012

సూర్యుడి చుట్టూ కక్ష్యలు


  • -కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ rohiniprasadk@gmail.com
  • 14/04/2012
సూర్యుడి చుట్టూ అన్నిటికన్నా దగ్గరగా ప్రదక్షిణలు చేసేవి మొదట బుధుడు, తరువాత శుక్రుడు. ఆ తరువాతిది భూమి కాగా అంతకన్నా ఎక్కువ దూరాన తిరిగేది కుజుడు. పటంలో చూపినట్టుగా భూమి, కుజుడు ఎదురెదురుగా వచ్చినప్పుడే సూర్యకాంతి కుజుడిమీద బాగా ప్రతిఫలించి అది మనకు బాగా కనపడుతుందని తెలుస్తుంది. ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో సూర్యుడు పశ్చిమాన అస్తమించిన కాసేపటికి తూర్పున ఎర్రగా వెలిగే కుజగ్రహాన్ని ఎవరైనా చూడవచ్చు.
ఆకాశంలో వెలిగే తారలనూ, గ్రహాలనూ మనుషులు ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మానవజాతి చరిత్ర చాలా ప్రాచీనమైనది. మొదట్లో అనాగరిక పద్ధతిలో జీవిస్తూ, రాత్రిళ్లు గుహల్లోనూ, కోనల్లోనూ తల దాచుకున్న తొలిమానవులు అప్పుడప్పుడూ ఆకాశంలో మిలమిల మెరిసే తారలను ఆశ్చర్యంతో పరికిస్తూ ఉండేవారు. పశ్చిమ యూ రప్‌లో దొరికిన 32 వేల ఏళ్ల నాటి ఒక కేలండర్ చూస్తే అప్పటివారు చంద్రుడి కళలు రోజువారీ పద్ధతిలో ఎలా మారుతూ ఉంటాయో గమనించారని అర్ధమవుతుంది. ఎంతో పరిశీలన జరిగితేకాని ఇటువంటి వివరాలు నమోదు కావు. కాలక్రమాన మన దేశంలోనూ, పశ్చిమాసియాలోనూ ఆ తరువాత యూరప్‌లోనూ నక్షత్ర పరిశీలన మెరుగుపడింది. భూమే అన్నిటికీ కేంద్రమనీ, సూర్యచంద్రులు, నక్షత్రాలూ అన్నీ దాని చుట్టూ తిరుగుతాయనీ అనుకునే రోజులు 15వ శతాబ్దంలో కోపర్నికస్ ప్రతిపాదనల తరవాత కొనసాగలేదు.
కోపర్నికస్ నిర్వహించిన సౌర వ్యవస్థ
కుజగ్రహం ప్రత్యేకత ఏమిటంటే అది చాలావరకూ భూమిని పోలిన గ్రహమే. కొద్దిపాటి మార్పులు చేస్తే అది మనుషులకు నివాస యోగ్యం కావచ్చునని శాస్తవ్రేత్తలు ఆశిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు జరిగాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

No comments:

Post a Comment